యువకుడి ఆత్మహత్యతో పెళ్లింట విషాదం
రెండు రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. వివాహ పనుల నిమిత్తం కుటుంబికులు బయటకెళ్లి వచ్చేసరికి పెళ్లి కుమారుడు ఇంట్లో ఉరేసుకుని కొన ఊపిరితో ఫ్యాన్కు వేలాడుతూ ఉండడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
రాజమహేంద్రవరం నేరవార్తలు: రెండు రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. వివాహ పనుల నిమిత్తం కుటుంబికులు బయటకెళ్లి వచ్చేసరికి పెళ్లి కుమారుడు ఇంట్లో ఉరేసుకుని కొన ఊపిరితో ఫ్యాన్కు వేలాడుతూ ఉండడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కుమారుడ్ని తీసుకుని ఆ తల్లి ఆసుపత్రులు చుట్టు తిరిగినా ఫలితం దక్కలేదు. వివాహం కావాల్సిన యువకుడు విగతజీవిగా మారిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. బొమ్మూరు స్టేషన్ సీఐ ఆర్.విజయ్కుమార్ వివరాల మేరకు... బొరుసు రాజీవ్బాబు(32) నగరంలోని దానవాయిపేటలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఐటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. తండ్రి గతంలోనే మరణించారు. ముగ్గురు సోదరీమణులకు వివాహాలయ్యాయి. తల్లి మంగాదేవితో కలసి బాలాజీపేటలోని ఓ అపార్టుమెంటులో రాజీవ్బాబు ఉంటున్నారు. పెళ్లి పనుల నిమిత్తం సోదరీమణులు, తల్లి బయటకు వెళ్లే క్రమంలో రాజీవ్ తనకు పనిఉందని చెప్పి ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయాడు. బయటకు వెళ్లినవారు రెండు గంటల్లో తిరిగి వచ్చేసరికి రాజీవ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపల్ భార్య బలవన్మరణం
రాజమహేంద్రవరం నేరవార్తలు: భర్త, ఒక్కగానొక్క కుమారుడు ఉద్యోగ విధుల్లో బిజీగా ఉండడంతో ఇంట్లో ఆమె ఒంటరిగా భావించారు. మానసిక ఒత్తిడి భరించలేని ఆ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజమహేంద్రవరం నగరంలో చోటుచేసుకుంది. ప్రకాశంనగర్ సీఐ పవన్కుమార్రెడ్డి వివరాల మేరకు.. నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో నివాసముంటున్న చప్పిడి కృష్ణ డిగ్రీ కళాశాలలు(జోన్1) ఆర్జేడీగా, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు భార్య రమాదేవి(57), ఓ కుమారుడు. అమెరికాలో స్థిరపడ్డ కుమారుడికి ఈ నెల 10న వివాహం జరగాల్సి ఉంది. వారం కిందటే అతను నగరానికి వచ్చాడు. పెళ్లైన వారం తర్వాత అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. విధి నిర్వహణ నిమిత్తం మరో జిల్లాలో ఉన్న కృష్ణ బుధవారం మధ్యాహ్నం పలుమార్లు రమాదేవికి ఫోన్ చేశారు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం ఇంటికి వచ్చి చూశారు. అప్పటికే భార్య రమాదేవి గదిలో ఫ్యానుకు వేలాడుతుండడంతో కుమారుడ్ని పిలిపించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దణ్ణం మాకొద్దీ అరాచకం
[ 11-05-2024]
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అయిదేళ్లు అరాచకాలు, ఆగడాలు.. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులతో అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. -
నన్ను నమ్మండి.. మీ కోసం నిలబడతా
[ 11-05-2024]
మీకు మాట ఇస్తున్నా.. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని మార్మోగేలా చేస్తా.. పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటులా ఉండేలా చేస్తా.. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కృషిచేస్తా. -
చెంతకొచ్చి మాటిచ్చావ్.. చేయూతనివ్వక మోసగించావ్
[ 11-05-2024]
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం.. ప్రతిపైసా చెల్లిస్తాం.. ఇదీ గత ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. గద్దెనెక్కాక.. ఇచ్చిన మాట గాలికొదిలేశారు. -
సంక్షేమ బోర్డు జాడేది
[ 11-05-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 వేల మంది కొబ్బరికార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నేటితో గప్చుప్
[ 11-05-2024]
కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ తుది దశకు చేరువవుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది. -
జనహోరు.. సేనజోరు
[ 11-05-2024]
ఎండలు మండినా.. గుండెల్లో అదే అభిమానం.. అధినేత రాక అయిదు గంటల ఆలస్యమైనా ఒక్క అడుగూ వెనక్కి తగ్గలేదు. -
ప్రచార పిచ్చి.. సేవలకు సుస్తీ
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పేద రోగులకు సరైన వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. -
అయిదేళ్లుగా ముంపు సమస్యను పట్టించుకోలేదు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరంలో ముంపు సమస్యను పట్టించుకోలేదని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
గడప గడపకు ద్రోహం.. ఓట్ల కోసమే వ్యూహం
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి.. యంత్రాంగం చేపట్టిన పనులకు పొంతన లేకుండా పోయింది. -
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
[ 11-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి