logo

Kakinada: షాంపూతో జుట్టు రాలిందని మహిళ దూషణ.. చాకుతో దాడిచేసిన యువకుడు

ఓ వృద్ధురాలిపై యువకుడు చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. కాకినాడ రెండో పట్టణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Updated : 27 Nov 2023 12:37 IST

చికిత్సపొందుతున్న సత్యవతి

మసీదుసెంటర్‌(కాకినాడ): ఓ వృద్ధురాలిపై యువకుడు చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. కాకినాడ రెండో పట్టణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌ వెంకటనారాయణవీధికి చెందిన చెల్లంచెర్ల సత్యవతి ఇటీవల ఓ జనరిక్‌ మందుల దుకాణంలో షాంపూ కొన్నారు. అది వాడిన తర్వాత జుట్టంతా రాలిపోయిందని ఆ దుకాణంలో పనిచేస్తున్న యువకుడు పెన్నాడ వెంకటేష్‌ను ఆమె దూషించడం ప్రారంభించారు.

రోజూ దుర్భాషలాడటంతో అతను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం పక్కనే ఉన్న ప్లాస్టిక్‌ దుకాణంలో రూ.30 చాకు కొన్నాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి శరీరంపై పలుచోట్ల పొడిచాడు. ఇంతలో చాకు విరిగిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పెనుగులాటలో ఆమె బంగారు గొలుసు ఘటనా స్థలంలోనే కింద పడిపోయి అక్కడే ఉందన్నారు. తొలుత ప్రచారం జరిగినట్లు బంగారు గొలుసు కోసం ఈ దాడి చేయలేదని టుటౌన్‌ సీఐ నాగేశ్వర్‌నాయక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని