జగనన్నా.. ఇదేనా ‘మీ సేవ’..!
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 215 మీసేవ కేంద్రాలు ఉండేవి.
వెలవెలబోతున్న మీసేవ కేంద్రం
న్యూస్టుడే, ముమ్మిడివరం: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 215 మీసేవ కేంద్రాలు ఉండేవి. వైకాపా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి.. మీసేవ కేంద్రాలకు కత్తెర వేసింది. సేవలన్నీ గ్రామ సచివాలయాల్లోనే పొందాలనే విధంగా ప్రచారం చేసి మీసేవ కేంద్రాలు మూతపడే స్థితికి తీసుకువచ్చారు. ఓ దశలో మీసేవ కేంద్రాల్లో పొందిన ధ్రువపత్రాలు పనిచేయవనేలా వ్యవహరించిన పరిస్థితులున్నాయి.
గతమే మేలు..
పౌరసేవలన్నింటినీ సులభతరం చేయాలి. ఆలస్యం కాకుండా.. అవినీతి అక్రమాలకు తావు లేకుండా.. ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి హయాంలో మీసేవ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు నిర్ణీత రుసుం చెల్లించి తమకు కావాల్సిన సేవలు నిర్ణీత గడువులో సులువుగా, సులభతరంగా పొందేవారు.
యువత రోడ్డుపాలు..
జగనన్న ఏలుబడిలో ఇప్పడు మీసేవ కేంద్రాలు మూతపడుతున్నాయి. కేంద్రాలను నిర్వహించలేక నిర్వాహకులు అప్పుల పాలవుతున్నారు. పొమ్మనలేక పొగపెట్టినట్లుగా సేవల్లో కోత విధించి కేంద్రాలను దెబ్బతీశారు. మీసేవ కేంద్రాల ద్వారా ఉపాధి పొందుతున్న యువత వాటిని మూసేసి ఇతర పనులకు వెళ్లాల్సిన దుస్థితికి తీసుకువచ్చారు.
ప్రాధాన్యం తగ్గించేసి..
మీసేవ కేంద్రాల్లో గతంలో అత్యంత ప్రాధాన్యమైన మ్యుటేషన్లు, ఆధార్, రేషనుకార్డుల్లో చేర్పులు, సవరణలు, కొత్తవాటికి దరఖాస్తు చేసుకోవడం, అడంగళ్లో దిద్దుబాట్లు, ఓటర్ల నమోదు, గుర్తింపుకార్డుల జారీ వంటి 300 రకాల సేవలు అందేవి. వీటిలో ప్రధాన సేవలన్నింటినీ సచివాలయాలకు అప్పగించడంతో మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. నెలకు నిర్దేశిత సేవలు అందించాలని మెలికపెట్టి ఆ మేరకు సేవలందించకపోతే రద్దు చేస్తున్నారు. అప్పు చేసి, రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన సామగ్రి వృథాగా మారాయని వారు వాపోతున్నారు. జిల్లాలో సుమారు 120 వరకు మీసేవ కేంద్రాలు మూతపడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాలకు ఎప్పుడు వీలుంటే.. అప్పుడు వెళ్లి కావాల్సిన సేవలు పొందే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. పోనీ సచివాలయాల్లో పూర్తిస్థాయి సేవలందిస్తున్నారా.. అంటే అదీ లేదు. విద్యుత్తు లేకున్నా, అంతర్జాలం పనిచేయకపోయినా, ఇతర ఆటంకాలు ఎదురైనా ఇక అంతే.
ఇదివరకు నెలకు రూ.20 వేలు వచ్చేది..
మీసేవ కేంద్ర]ం ఏర్పాటుతో ఉపాధి లభించిందని ఆనందపడ్డా. రూ.లక్షలు ఖర్చుచేసి కంప్యూటర్, ప్రింటర్, ఇతర పరికరాలు ఏర్పాటు చేసుకున్నా. కేంద్రానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం సేవలు అందించడంతో నెలకు రూ.20 వేల వరకు వచ్చేది. ఈ అయిదేళ్లలో మీసేవ కేంద్రాలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. కేంద్రాన్ని మూసేయాల్సివచ్చింది.
జిల్లాలోని మీ సేవ కేంద్రం నిర్వాహకుడి ఆవేదన ఇది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దణ్ణం మాకొద్దీ అరాచకం
[ 11-05-2024]
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అయిదేళ్లు అరాచకాలు, ఆగడాలు.. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులతో అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. -
నన్ను నమ్మండి.. మీ కోసం నిలబడతా
[ 11-05-2024]
మీకు మాట ఇస్తున్నా.. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని మార్మోగేలా చేస్తా.. పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటులా ఉండేలా చేస్తా.. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కృషిచేస్తా. -
చెంతకొచ్చి మాటిచ్చావ్.. చేయూతనివ్వక మోసగించావ్
[ 11-05-2024]
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం.. ప్రతిపైసా చెల్లిస్తాం.. ఇదీ గత ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. గద్దెనెక్కాక.. ఇచ్చిన మాట గాలికొదిలేశారు. -
సంక్షేమ బోర్డు జాడేది
[ 11-05-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 వేల మంది కొబ్బరికార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నేటితో గప్చుప్
[ 11-05-2024]
కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ తుది దశకు చేరువవుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది. -
జనహోరు.. సేనజోరు
[ 11-05-2024]
ఎండలు మండినా.. గుండెల్లో అదే అభిమానం.. అధినేత రాక అయిదు గంటల ఆలస్యమైనా ఒక్క అడుగూ వెనక్కి తగ్గలేదు. -
ప్రచార పిచ్చి.. సేవలకు సుస్తీ
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పేద రోగులకు సరైన వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. -
అయిదేళ్లుగా ముంపు సమస్యను పట్టించుకోలేదు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరంలో ముంపు సమస్యను పట్టించుకోలేదని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
గడప గడపకు ద్రోహం.. ఓట్ల కోసమే వ్యూహం
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి.. యంత్రాంగం చేపట్టిన పనులకు పొంతన లేకుండా పోయింది. -
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
[ 11-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి