16,23,149.. ఇదీ ఓటర్ల సంఖ్య
జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండవ అనుబంధ జాబితా(సప్లిమెంటరీ)ను కూడా ప్రచురించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే మొత్తం ఓటర్ల వివరాలను శనివారం కలెక్టర్ మాధవీలత వెల్లడించారు.
రాజమహేంద్రవరం కలెక్టరేట్: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండవ అనుబంధ జాబితా(సప్లిమెంటరీ)ను కూడా ప్రచురించి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే మొత్తం ఓటర్ల వివరాలను శనివారం కలెక్టర్ మాధవీలత వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 22న తుది జాబితా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తూ మళ్లీ మార్చి 20న మొదటి సప్లమెంటరీ ప్రచురించారు. కొత్త ఓటు నమోదుకు గడువు ఈ నెల 15 వరకు ఎన్నికల కమిషన్ కల్పించడంతో ఆరోజు వరకు కొత్తగా ఫారం-6 దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు రెండవ అనుబంధ జాబితాలో చోటు కల్పించారు.
పెరిగారిలా..: జనవరి 22న తుదిజాబితా ప్రచురించిన నాటికి జిల్లా మొత్తం ఓటర్లు 16,05,762 ఉండగా అనుబంధ జాబితాల్లో చేర్చిన ఓటర్లతో కలిపి ఇప్పుడు వీరిసంఖ్య 16,23,149కి పెరిగింది.
గ్రామీణంలోనే అధికం: నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యధికంగా రాజమహేంద్రవరం గ్రామీణంలో మొత్తం 2,72,170 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా కొవ్వూరులో 1,83,235 మంది ఉన్నారు. అనపర్తిలో 2,24,233 మందికాగా రాజానగరంలో 2,14,549, రాజమహేంద్రవరం అర్బన్లో 2,61,956, నిడదవోలులో 2,11,842, గోపాలపురంలో 2,40,835 మంది చొప్పున ఉన్నారు.
మహిళలదే పైచేయి..: మొత్తం పురుష ఓటర్లు 7,92,317 కాగా మహిళా ఓటర్లు 8,30,735, ఇతరులు 97 మంది ఉన్నారు. తుది జాబితాతో పోలిస్తే రెండవ అనుబంధ జాబితా ప్రచురణ నాటికి కొత్తగా పెరిగిన ఓటర్లు పురుషులు 7,175, మహిళా ఓటర్లు 10,220 మంది ఉన్నారు. ఇతరులు మాత్రం ఎనిమిది మంది తగ్గారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దణ్ణం మాకొద్దీ అరాచకం
[ 11-05-2024]
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అయిదేళ్లు అరాచకాలు, ఆగడాలు.. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులతో అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. -
నన్ను నమ్మండి.. మీ కోసం నిలబడతా
[ 11-05-2024]
మీకు మాట ఇస్తున్నా.. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని మార్మోగేలా చేస్తా.. పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటులా ఉండేలా చేస్తా.. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కృషిచేస్తా. -
చెంతకొచ్చి మాటిచ్చావ్.. చేయూతనివ్వక మోసగించావ్
[ 11-05-2024]
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం.. ప్రతిపైసా చెల్లిస్తాం.. ఇదీ గత ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. గద్దెనెక్కాక.. ఇచ్చిన మాట గాలికొదిలేశారు. -
సంక్షేమ బోర్డు జాడేది
[ 11-05-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 వేల మంది కొబ్బరికార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నేటితో గప్చుప్
[ 11-05-2024]
కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ తుది దశకు చేరువవుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది. -
జనహోరు.. సేనజోరు
[ 11-05-2024]
ఎండలు మండినా.. గుండెల్లో అదే అభిమానం.. అధినేత రాక అయిదు గంటల ఆలస్యమైనా ఒక్క అడుగూ వెనక్కి తగ్గలేదు. -
ప్రచార పిచ్చి.. సేవలకు సుస్తీ
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పేద రోగులకు సరైన వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. -
అయిదేళ్లుగా ముంపు సమస్యను పట్టించుకోలేదు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరంలో ముంపు సమస్యను పట్టించుకోలేదని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
గడప గడపకు ద్రోహం.. ఓట్ల కోసమే వ్యూహం
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి.. యంత్రాంగం చేపట్టిన పనులకు పొంతన లేకుండా పోయింది. -
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
[ 11-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవం నిర్వహించారు.