వేణుగోపాలా.. ఇదేం మాయ?
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు అధికారపక్షం ఎంతకైనా తెగిస్తోంది. ప్రభుత్వం తీరును ఎన్నికల సంఘం తప్పుపడుతున్నా.. అధికార పక్షానికి అంటకాగుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు.
ఈయనే జడ్పీ ఛైర్మన్.. వైకాపా అభ్యర్థి
సీఈవోలే ఆ నియోజకవర్గ ఈఆర్వోలు.. ఆర్వోలు
ఈనాడు, కాకినాడ: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు అధికారపక్షం ఎంతకైనా తెగిస్తోంది. ప్రభుత్వం తీరును ఎన్నికల సంఘం తప్పుపడుతున్నా.. అధికార పక్షానికి అంటకాగుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడంలేదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది. పి.గన్నవరం మండలం నుంచి జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు ఛైర్మన్గా విప్పర్తి వేణుగోపాలరావు వ్యవహరిస్తున్నారు. వైకాపా అధిష్ఠానం పి.గన్నవరం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును పక్కనపెట్టి.. వేణుగోపాలరావును అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. జడ్పీ ఛైర్మన్ కనుసన్నల్లో పనిచేసే సీఈవోనే ఈ నియోజకవర్గ ఓట్ల నమోదు అధికారిగా, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆయన నియమించుకోవడం గమనార్హం. జడ్పీ సీఈవోగా 2020 అక్టోబô్ 29 నుంచి 2023 జూన్ 14 వరకు డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఎన్.వి.వి.సత్యనారాయణ పనిచేశారు. 2023 జూన్ 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు డిప్యూటీ సీఈవో ఎ.రమణారెడ్డి ఇన్ఛార్జి సీఈవోగా వ్యవహరించారు. ప్రస్తుతం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ.శ్రీరామచంద్రమూర్తి సీఈవోగా ఉన్నారు.
ఒకరి తర్వాత ఒకరుగా..
ఎన్నికల సన్నద్ధత క్రమంలో ఓటర్ల నమోదు అధికారిగా సీఈవో సత్యనారాయణ కొద్దికాలం పి.గన్నవరం బాధ్యతలు చేపట్టారు. ఆయన బదిలీ తర్వాత రమణారెడ్డి ఇక్కడ ఈఆర్వోగా వ్యవహరించి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ- 2024 క్రతువు పూర్తిచేశారు. ఎన్నికల బదిలీల్లో కొత్తగా జిల్లాకు వచ్చిన సీఈవో శ్రీరామచంద్రమూర్తికి సైతం ఇక్కడే ఆర్వో బాధ్యతలు అప్పగించారు.. ఇలా ఉద్దేశపూర్వకంగా సొంత నియోజకవర్గం ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారనే విమర్శలున్నాయి. తనను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించి వేరొక నియోజకవర్గం అప్పగించాలని ఆ మధ్య ఆయన లిఖితపూర్వకంగా కోరారు. అధికారపక్షం రాజకీయం వల్ల ఆయనే ఆర్వోగా కొనసాగాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారు: నాగబాబు
[ 11-05-2024]
వైకాపా నేతలు పిఠాపురంలో భారీగా డబ్బులు పంచుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. -
మీకో దణ్ణం మాకొద్దీ అరాచకం
[ 11-05-2024]
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అయిదేళ్లు అరాచకాలు, ఆగడాలు.. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులతో అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. -
నన్ను నమ్మండి.. మీ కోసం నిలబడతా
[ 11-05-2024]
మీకు మాట ఇస్తున్నా.. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని మార్మోగేలా చేస్తా.. పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటులా ఉండేలా చేస్తా.. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కృషిచేస్తా. -
చెంతకొచ్చి మాటిచ్చావ్.. చేయూతనివ్వక మోసగించావ్
[ 11-05-2024]
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం.. ప్రతిపైసా చెల్లిస్తాం.. ఇదీ గత ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. గద్దెనెక్కాక.. ఇచ్చిన మాట గాలికొదిలేశారు. -
సంక్షేమ బోర్డు జాడేది
[ 11-05-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 వేల మంది కొబ్బరికార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నేటితో గప్చుప్
[ 11-05-2024]
కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ తుది దశకు చేరువవుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది. -
జనహోరు.. సేనజోరు
[ 11-05-2024]
ఎండలు మండినా.. గుండెల్లో అదే అభిమానం.. అధినేత రాక అయిదు గంటల ఆలస్యమైనా ఒక్క అడుగూ వెనక్కి తగ్గలేదు. -
ప్రచార పిచ్చి.. సేవలకు సుస్తీ
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పేద రోగులకు సరైన వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. -
అయిదేళ్లుగా ముంపు సమస్యను పట్టించుకోలేదు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరంలో ముంపు సమస్యను పట్టించుకోలేదని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
గడప గడపకు ద్రోహం.. ఓట్ల కోసమే వ్యూహం
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి.. యంత్రాంగం చేపట్టిన పనులకు పొంతన లేకుండా పోయింది. -
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
[ 11-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!