అనారోగ్యం బారిన భర్త.. వదిలి వెళ్లిన భార్య
విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మంచానికి పరిమితమైన భర్త ఆలనాపాలనా చూసుకోవాల్సిన భార్య, తనను.. పిల్లలను వదిలేసి రెండో పెళ్లి చేసుకొని తనను మోసగించిందని గుంటూరు బారాఇమామ్పంజాకు చెందిన అబ్దుల్ రజాక్ వాపోయారు.
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని పెళ్లాడింది
నలుగురు పిల్లలతో వచ్చి ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు
గుంటూరు, న్యూస్టుడే : విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మంచానికి పరిమితమైన భర్త ఆలనాపాలనా చూసుకోవాల్సిన భార్య, తనను.. పిల్లలను వదిలేసి రెండో పెళ్లి చేసుకొని తనను మోసగించిందని గుంటూరు బారాఇమామ్పంజాకు చెందిన అబ్దుల్ రజాక్ వాపోయారు. కొవిడ్ ఫైటర్స్కు చెందిన అంబులెన్స్లో నారి సమ్మాన్ ఛైల్డు వెల్ఫేర్ స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో బాధితుడు తన పిల్లలతో కలిసి గుంటూరులో సోమవారం నిర్వహించిన ఎస్పీ స్పందనకు వచ్చిన తీరు అందరినీ కలచివేసింది. డీఎస్పీ శ్రీనివాసరావు అంబులెన్స్ వద్దకు వచ్చి ఫిర్యాదు స్వీకరించి అతనికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
బాధితుడు విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం... ‘నేను ఎలక్ట్రీషియన్ని. 16 ఏళ్ల కిందట ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళతో వివాహమైంది. మాకు నలుగురు పిల్లలు. పదో తరగతి చదివిన భార్యను వివాహం అనంతరం ఉన్నత విద్య చదివించాను. కుటుంబ పోషణ కోసం 2019లో సౌదీకి వెళ్లాను. అక్కడ నుంచి భార్యకు డబ్బులు పంపిస్తుండేవాడిని. సౌదీలో పని చేస్తున్న క్రమంలో 2020లో ప్రమాదానికి గురై నా వెన్నెముక విరిగింది. 2021లో గుంటూరు వచ్చాను. మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. వైద్యం, మందుబిళ్లల ఖర్చులకు నగదు లేక ఇబ్బంది పడ్డాం. నా భార్య నా ఫొటోలను వాట్సప్, ఇతర గ్రూపుల్లో పెట్టి డబ్బులు వసూలు చేసుకొని సొంతానికి వాడుకుంది. అయినా నేను బాధ పడలేదు. నా సోదరులు నన్ను ఆదుకున్నారు. నా భార్య గుంటూరులోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న క్రమంలో ఒకరితో ఫేస్బుక్లో పరిచయమైనట్లు తెలిసింది.
నాలుగు నెలల కిందట నన్ను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. విచారిస్తే.. భార్య చనిపోయిన కడప జిల్లా బద్వేల్కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. నన్ను ఇలా మంచంలో వదిలేసి పెళ్లి చేసుకోవడం న్యాయమా? ఇలా మరొకరికి జరగకుండా ఉండాలని లాలాపేట పోలీసులకు 20 రోజుల కిందట ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న నా భార్యను, ఆమెను వివాహమాడిన వ్యక్తి, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయటానికి వచ్చా’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు వీడలే.. ఓటు వదల్లే..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లు పోటెత్తారు. ఓటింగ్ ప్రక్రియ తీవ్ర జాప్యం కావడంతో వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. ఒకవైపు సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించడం, నేతల మధ్య వాగ్వాదాల నియంత్రణకు తగిన భద్రతా సిబ్బంది లేకపోవడం, మరోవైపు వర్షంతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. -
పశ్చిమలో యుద్ధ వాతావరణం
[ 14-05-2024]
పోలింగ్ సందర్భంగా గుంటూరు పశ్చిమలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీకి కంచు కోటలుగా ఉన్న డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల వద్దకు మంత్రి విడదల రజిని వైకాపా కార్యకర్తలను వెంటబెట్టుకుని వచ్చి అలజడి రేపారు. -
వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలన
[ 14-05-2024]
జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా, జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, శిక్షణ కలెక్టరు పవార్ స్వప్నిల్ జగన్నాథ్తో కలిసి సోమవారం పరిశీలించారు. -
ప్రముఖులు ఓటేశారిలా..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎంపీలు, మాజీ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
వసతులు లేక.. వృద్ధులు విలవిల..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కనీసం కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాధితుడు సుధాకర్కు పరామర్శలు
[ 14-05-2024]
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ను సోమవారం తెనాలి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. -
మంత్రి, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేత, మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు కోరారు. -
దొంగ ఓట్లు వేయించిన మాజీ వాలంటీర్లు
[ 14-05-2024]
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో రాజీనామా చేసిన మాజీ వాలంటీర్లు వైకాపా సానుభూతిపరులుగా మారి ఆ పార్టీకు అనుకూలంగా దొంగ ఓట్లు వేయించటమే లక్ష్యంగా పని చేశారు. -
మాక్ పోలింగ్ ఓట్లు తొలగించలేదు
[ 14-05-2024]
విధుల్లో నిర్లక్ష్యం కారణంగా మాక్ పోలింగ్ ఓట్లను సాధారణ ఓట్లతో కలిపిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని 64వ పోలింగ్ కేంద్రంలో 1,143 ఓట్లు ఉన్నాయి. -
బందోబస్తు పరిశీలన
[ 14-05-2024]
జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును ఎస్పీ తుషార్ దూడి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు 4 వేల మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సిరా చుక్కకు.. నెత్తుటి మరక
[ 14-05-2024]
పోలింగ్ రోజు పల్నాడు రక్తమోడింది. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మాచర్లలో పోలింగ్ సందర్భంగా వైకాపా అరాచకం సృష్టించింది. ఉదయం మొదలు మధ్యాహ్నం 3 గంటల వరకూ పిన్నెల్లిని హౌస్ అరెస్టు చేసే వరకూ నియోజకవర్గంలో ఎక్కడోచోట దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. -
కసిగా ఓటెత్తారు!
[ 14-05-2024]
జిల్లాలో వాతావరణం చల్లగా మారడంతో సోమవారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలకు మునుపెన్నడూ లేని రీతిలో ఓటర్లు వరుస కట్టడం ఆశ్చర్యకరంగా అనిపించిందని పలువురు పోలింగ్ అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
పోలీసులు చేతులెత్తేశారు
[ 14-05-2024]
ఎన్నికలకు సంబంధించి శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు చేతులెత్తేశారని కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆయన మాట్లాడారు. -
ఎండనక.. వాననక..రేయనక.. ఓటెత్తారు
[ 14-05-2024]
మండుటెండలో భరించలేని ఉక్కపోత.. అంతలోనే పిడుగులతో కూడిన వర్షం.. రాత్రి పది గంటల వరకు వరుసలో నిల్చొని ఓటుహక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద జాతరను తలపించింది.