వామ్మో.. ఒత్తిడి భరించలేకున్నాం
పాఠశాల విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయవర్గానికి నానాటికీ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. హాజరు నమోదు నుంచి వర్క్బుక్ కరెక్షన్ వరకు ప్రతి లోపానికి వారినే బాధ్యుల్ని చేసి సంజాయిషీలు కోరడంతో బెంబేలెత్తుతున్నారు.
ఆందోళనలో ఉపాధ్యాయ వర్గం
వీఆర్ఎస్.. మెడికల్ లీవ్లకు దరఖాస్తులు
ఈనాడు, బాపట్ల
పాఠశాల విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయవర్గానికి నానాటికీ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. హాజరు నమోదు నుంచి వర్క్బుక్ కరెక్షన్ వరకు ప్రతి లోపానికి వారినే బాధ్యుల్ని చేసి సంజాయిషీలు కోరడంతో బెంబేలెత్తుతున్నారు. ఇలాగైతే ఉద్యోగం ఏం చేస్తామని చెప్పి ఆందోళన, ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కారణాలేమైనా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటీవల నలుగురు ఉపాధ్యాయులు మృత్యువాత పడటం సహచర ఉపాధ్యాయవర్గాన్ని కలవరపరుస్తోంది. ఆ మరణాలు చూశాక కొందరు విధి నిర్వహణలో ఒత్తిడికి గురైతే మన పరిస్థితి అంతే అవుతుందేమోనని భయపడి ఏకంగా మెడికల్ లీవ్, స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) బాట పడుతున్నారు. బతికి ఉంటే బలుసాకు తినయినా బతకొచ్చని నిరంతరం ఆ ఒత్తిడి ఎక్కడ పడతామని మరికొందరు అంటున్నారు.. వీటిని బట్టి చూస్తుంటే ఉపాధ్యాయవర్గం ఎంత ప్రతికూల వాతావరణంలో పని చేస్తుందో అర్థమవుతోంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో పలువురు హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారని విద్యాశాఖవర్గాలు పేర్కొన్నాయి.
పిల్లోడు బడికి రాకపోయినా.. హోంవర్క్ చేయకపోయినా వారిని పన్నెత్తి మాట అనకూడదు. కానీ వాటికి ఉపాధ్యాయుల్ని బాధ్యులుగా చేయటం ఉన్నతాధికారుల తీరు కాబోతుంది. ఒకవైపు పిల్లల్ని ఏమీ అనొద్దని చెబుతున్నారు. అలాంటప్పుడు పిల్లలకు తామంటే ఏం భయం ఉంటుంది? మందలించో, బెత్తంతో ఒక దెబ్బేస్తేనో పిల్లోడు కాస్తోకూస్తో క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ఇవేం లేకుండా పిల్లోడిలో మార్పు తీసుకురావడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ప్రతి దానికి ఉపాధ్యాయడ్నే బాధ్యున్ని చేసి శిక్షించాలనుకోవటం సరికాదని ఉన్నతాధికారులు తమ పంథా మార్చుకోవాలని సూచిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. ఆ పరిస్థితి రాక మునుపే ఉన్నతాధికారులు అప్రమత్తమై ఉపాధ్యాయ వర్గంలో స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ముందస్తు అనుమతి పొందినా..
పదవీ విరమణకు నాలుగేళ్ల సర్వీసు ఉన్న ప్రధానోపాధ్యాయుడొకరు ఇటీవల అత్యవసరంగా ఒక రోజు సెలవు పెట్టారు. ఆరోజు స్కూల్ పర్యవేక్షణ ఎవరు చూడాలో పక్కాగా ఇంఛార్జి బాధ్యతలు అక్కడ ఉన్న సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించారు. ఆపై తాను సెలవు పెట్టే విషయాన్ని డివిజన్ ఉప విద్యాశాఖ అధికారికి తెలియజేసి ఆయన అనుమతి పొందారు. సెలవు వివరాలు యాప్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే అది పని చేయలేదని మిన్నకుండిపోయారు. సెలవు పెట్టిన విషయం యాప్లో అప్లోడ్ చేయలేదని డీఈవో సంజాయిషీ కోరారు. ఇలాంటి సంజాయిషీ నోటీసులు ఇటీవల ఒక్క పల్నాడు జిల్లాలోనే వంద మందికి పైగా టీచర్లు అందుకున్నారు. ప్రతి ఉపాధ్యాయుడికి ఏడాదికి కొన్ని సెలవులు ఉంటాయి. కనీసం ఆ సెలవును కూడా వినియోగించుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఉన్నతాధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. తాను సెలవు పెడితే ఎవరు స్కూల్ బాధ్యతలు చూస్తారో కూడా ముందుగానే ఏర్పాట్లు చేశానని, అయినా తనకు సంజాయిషీ నోటీసు పంపడంతో ఆ హెచ్ఎం మనస్తాపం చెంది వీఆర్ఎస్ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
వీఆర్ఎస్కు మొగ్గుచూపినవారిలో కొందరు..
- మాచవరంలో పనిచేసే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఒకరు వీఆర్ఎస్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
- తాను పనిచేసే పాఠశాలలో విపరీతమైన ఒత్తిడి ఉంటోందని స్కూల్ అసిస్టెంట్ ఒకరు రెండేళ్ల క్రితం వీఆర్ఎస్కు పెట్టుకున్నారు. ఆమె ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. ఒత్తిడి కారణంగా రెండేళ్ల ముందే తాను వీఆర్ఎస్ తీసుకోవడంతో ఆర్థికంగా నష్టపోయినా ఆరోగ్యంగా మిగిలి ఉండటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఇటీవల వీడ్కోలు సభలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
- గుంటూరులో ఓ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం ఒకరు నాడు-నేడు పనుల నిర్వహణకు సకాలంలో నిధులు రాకపోవడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. దానికి తనను బాధ్యుల్ని చేస్తూ ఉన్నతాధికారులు పదేపదే హెచ్చరిస్తుండటంతో సదరు హెచ్ఎం ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేనని స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.
- సత్తెనపల్లి డివిజన్కు చెందిన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఒకరు తను పని చేసే పాఠశాలలో నాడు - నేడు పనులకు నిధులు, మెటీరియల్ ఇవ్వకుండా పనులు వేగవంతం చేయాలని ఒత్తిడి పెట్ట డంతో ఆమె వీఆర్ఎస్కు పెట్టుకొని ఇటీవలే విరమణ పొందారు.
- గురజాల డివిజన్కు చెందిన ప్రధానోపాధ్యాయుడొకరికి తన స్కూల్తో పాటు మరో స్కూల్కు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఏకకాలంలో ఆ రెండు పాఠశాలల బాధ్యతలు చూడలేక ఇబ్బంది పడుతున్నారు. ఓ స్కూల్ బాధ్యతలు తప్పించాలని హెచ్ఎంగా తనకు పెద్దగా అనుభవం కూడా లేదని విన్నవించుకుంటే తన మొర ఆలకించకపోగా, ఆ రెండు స్కూళ్లల్లో ఏ లోపం ఉన్నా తననే బాధ్యుడ్ని చేస్తున్నారని మెడికల్ లీవులోకి వెళ్లిపోయారు.
సగం మంది వెళ్లిపోతారు
స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నా వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల్ని మాత్రం వాస్తవంగా వారు ఎప్పుడైతే రిటైర్డు అవుతారో అప్పుడే ఇస్తామని ఆ మధ్య ప్రభుత్వం ఓ నోట్ పంపింది. ఈ నిబంధన లేకుంటే వెంటనే తమకు రావాల్సిన ప్రయోజనాల్ని ఇచ్చేస్తామంటే సగం మంది ఉద్యోగాలకు ముందుగానే విరమణ చేసి వెళ్లిపోతారని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. గతంలో ఎప్పుడూ టీచర్లకు ఇంతగా ఒత్తిడి లేదని గుర్తు చేశారు. హాజరు నమోదుకు సర్వర్ సామర్థ్యం పెంచకుండా సకాలంలో హాజరు వేసుకోలేదని తమను ఇబ్బంది పెట్టడం విడ్డూరంగా ఉందని వెంటనే ప్రభుత్వం ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని, చీటిమాటికి టీచర్లను బాధ్యుల్ని చేసే విధానాల్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
[ 16-05-2024]
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. -
గొడవలు అరికట్టండి.. సీఎస్, డీజీపీ, సీఈవోకు హైకోర్టు ఆదేశాలు
[ 16-05-2024]
ఏపీలో హింసాత్మక ఘటనలపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అల్లర్లు జరగకుండా సీఎస్, డీజీపీని ఆదేశించాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు -
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
[ 16-05-2024]
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. -
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
[ 16-05-2024]
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
పల్నాడును వైకాపా నేతలు రావణకాష్ఠంలా మార్చారు: యరపతినేని
[ 16-05-2024]
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైకాపా నేతలు పల్నాడును రావణకాష్ఠంలా మార్చారని గురజాల తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. -
తెదేపా నేత నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
[ 16-05-2024]
తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
అనుబంధాల్లో.. ఆరని మంటలు
[ 16-05-2024]
కళ్ల ముందే కన్నవారు సజీవ దహనం అవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. చెల్లెలు కుమార్తె మంటలకు ఆహుతి అవుతున్నా కాపాడుకోలేని దైన్యం. గుండెలు పిండే ఈ హృదయ విదారక సంఘటన చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనిపించిన దృశ్యం. -
ఖరీఫ్ సాగుకు.. సన్నద్ధమెప్పుడు?
[ 16-05-2024]
ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. పంటలు సాగు చేసేందుకు రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువులు, భూసార పరీక్షలు, పంటల విత్తనాలు, ఎరువులు అందించి సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం చేయాల్సి ఉంది. -
చేతిలో పెడతారా.. చేతులెత్తేస్తారా?
[ 16-05-2024]
ఏటా అదే తంతు.. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక మూడు, నాలుగు నెలల వరకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తూనే ఉంటారు. దీంతో అర్ధ సంవత్సర పరీక్షలు వచ్చినా కొన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. -
నిర్లక్ష్యం ఖరీదు... నిండు ప్రాణాలు
[ 16-05-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చినగంజాం నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న టిప్పరును ఢీకొట్టడంతో -
బాపట్ల జిల్లాలో 86.59 శాతం పోలింగ్
[ 16-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం అధికారికంగా వెలువడింది. జిల్లాలో 86.59 శాతం పోలింగ్ నమోదైంది. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 89.35 శాతం, రేపల్లె నియోజకవర్గంలో అత్యల్పంగా 84.16 శాతం పోలింగ్ జరిగింది. -
ఓపికుంటేనే వైద్యం..
[ 16-05-2024]
నిత్యం 2వేల మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి జీజీహెచ్కు వస్తుంటారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా జీజీహెచ్లో రోజుకు ఎంత మంది... -
వైకాపా దాడులకు అడ్డుకట్ట పడేనా?
[ 16-05-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసినా ప్రతిపక్షాలపై దాడులు, ఘర్షణలు, ఆస్తుల విధ్వంసం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు కొనసాగాయి. -
చైతన్య యాత్రికుడు..!
[ 16-05-2024]
ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు సైకిల్పై.. మరికొందరు బైక్లపై సవారీ చేస్తున్నారు. కొత్త ప్రాంతాలకు తిరుగుతూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మానసికోల్లాసం పొందుతారు. -
పల్నాడులో 86.76 శాతం పోలింగ్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుది నమోదు శాతం వెలువడింది. పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్ కలిపి బుధవారం తుది పోలింగ్ శాతం విడుదల చేశారు. -
పేద విద్యార్థినులకు ఉపకార వేతనాలు
[ 16-05-2024]
కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థినుల వసతి గృహంలో చేరేందుకు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులు గురువారం నుంచి దరఖాస్తులు చేసుకోవాలని సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. -
తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె
[ 16-05-2024]
కుటుంబ తగాదాల నేపథ్యంలో తల్లి నివాసం ఉంటున్న పూరింటికి కుమార్తె నిప్పు పెట్టిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చెంచుపేటలో జరిగింది. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీˆఐ రమేష్బాబు బుధవారం తెలిపిన సమాచారం మేరకు.. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 16-05-2024]
ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయమని తేలడంతో ఆ పార్టీ నాయకులు కూటమి నేతలపై దాడులు చేస్తున్నారని పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర