అంబటి.. తప్పు కదా?
వైకాపా నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ప్రదేశంతో సంబంధం లేకుండా సీఎంకు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారు. వారు చేస్తే ఎవరూ కాదనరు..
విద్యార్థులతో సీఎం చిత్రాల ప్రదర్శన
నిడుబ్రోలు హైస్కూల్లో సీఎం జగన్ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు.. మధ్యలో కూర్చున్న అంబటి మురళీకృష్ణ
పొన్నూరు, న్యూస్టుడే : వైకాపా నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. ప్రదేశంతో సంబంధం లేకుండా సీఎంకు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారు. వారు చేస్తే ఎవరూ కాదనరు.. కానీ లోకం తెలియని చిన్నారులను ఇందులో భాగస్వాములను చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలు హైస్కూల్లో గురువారం బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని వైకాపా పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు చేశారు. అనంతరం అంబటి మురళీకృష్ణ విద్యార్థుల చేతికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫొటోలు ఇచ్చి ప్లకార్డుల మాదిరిగా ప్రదర్శింపజేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదువు చెప్పాల్సిన పాఠశాలలో వైకాపా నేతలు రాజకీయం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెనాలి వైకాపా అభ్యర్థిని అదుపులోకి తీసుకోండి.. పోలీసులకు ఈసీ ఆదేశం
[ 13-05-2024]
తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కాల్చుకు తిన్నోళ్లను.. కాల్చిపారేయండి!
[ 13-05-2024]
తెలుగు జాతి వెలగాలని.. తరతరాలు మురవాలని! సిరుల మాగాణం కంటే.. సరిలేని ఆంధ్రమే మిన్నయని.. లక్షల ఉద్యోగాల కల్పనకు.. లక్ష కోట్ల సంపద సృష్టికి ఊపిరిలూదారు -
వేలిచుక్క పాశుపతమై.. వేగుచుక్క నీ పథమై..
[ 13-05-2024]
భవిష్యత్తుకు భరోసా కావాలన్నా.. మౌలిక వసతులు మెరుగుపడి ఉపాధి అవకాశాల కేంద్రంగా రాష్ట్రం ఎదగాలన్నా.. పేదల బతుకులు మారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా.. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా కావాలన్నా.. -
ఓటరూ... నీ ఓటే... నీ భవిత...
[ 13-05-2024]
ఓ యువతా.. మేలుకో.. ఓటరూ గుర్తుంచుకో.. ఉద్యోగం రాలేదని, ఉపాధి లేదని నిందిస్తూ ఇంట్లో కూర్చుంటే సరిపోదు పోలింగ్ కేంద్రానికి వచ్చి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకో. -
ప్రవాస భారతీయం
[ 13-05-2024]
దేశం కాని దేశం.. వేల మైళ్ల దూరం.. కన్నతల్లిని.. ఉన్న ఊరిని వదిలి విదేశాలకు వెళ్లిన వారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు కోసం కదలివచ్చారు. -
పల్నాట ప్రశాంతంగా జరిగేనా?
[ 13-05-2024]
పల్నాడు జిల్లాలో పోలింగ్కు కొన్ని గంటల ముందు నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ప్రలోభాలు.. పదవుల తాయిలాలు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మరికొద్ది గంటల్లో మొదలవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. -
ఎన్నికల వేళ.. ప్రయాణికుల రద్దీ
[ 13-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆర్టీసీ బస్టాండు ప్రయాణికులతో కిక్కిరిసింది. -
రైళ్లన్నీ కిటకిట
[ 13-05-2024]
రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ఏపీకి చెందిన ఓటర్లు ఓటేసేందుకు స్వస్థలాలకు భారీగా చేరుకుంటున్నారు. -
ప్రజాభీÅష్టం నిక్షిప్తం నేడు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రజల అభీష్టం ఏమిటనేది సోమవారం ఈవీఎంల్లో నిక్షిప్తం కానుంది. -
పోలింగ్కు కేంద్రాలు ముస్తాబు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి పోలింగ్ కేంద్రాలు ముస్తాబయ్యాయి. -
గల్లా, పెమ్మసాని భేటీ
[ 13-05-2024]
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భేటీ అయ్యారు. -
స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన
[ 13-05-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను కల్టెకర్ వేణుగోపాలరెడ్డి, ఎస్పీ తుషార్ దూడి ఆదివారం పరిశీలించారు. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
[ 13-05-2024]
పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
-
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్