రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాణం ఉన్నంత వరకు దీక్ష కొనసాగిస్తా
దీక్షా శిబిరంలో శ్రీలక్ష్మి తదితరులు
గుంటూరు రూరల్, న్యూస్టుడే: న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకుల అక్రమాలు, భూకబ్జాలకు వ్యతిరేకంగా గుంటూరులో శ్రీలక్ష్మి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం కొనసాగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భూకబ్జాలు, గంజాయి విక్రయాల అరికట్టటానికి ఎన్నో ఏళ్లగా ఇక్కడ పోరాటం సాగిస్తున్నానని తెలిపారు. మనుషులను చంపుతూ ఆ శవాలపై వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు.జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రాణం ఉన్నంతవరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. ఓ మహిళ వేలు కోసుకుని దీక్ష చేపడితే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళి మోహన్ అన్నారు. ఆమెను పరామర్శించి మాట్లాడారు. వందనాదేవి, కృష్ణ రేఖ ఆనంద్ కుమార్, పద్మావతి, విజయ, దేవి, యల్లమంద రావు తదితరులు శిబిరాన్ని సందర్శించి ఆమెకు మద్దతు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
[ 16-05-2024]
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
పల్నాడును వైకాపా నేతలు రావణకాష్ఠంలా మార్చారు: యరపతినేని
[ 16-05-2024]
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైకాపా నేతలు పల్నాడును రావణకాష్ఠంలా మార్చారని గురజాల తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. -
తెదేపా నేత నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
[ 16-05-2024]
తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
అనుబంధాల్లో.. ఆరని మంటలు
[ 16-05-2024]
కళ్ల ముందే కన్నవారు సజీవ దహనం అవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. చెల్లెలు కుమార్తె మంటలకు ఆహుతి అవుతున్నా కాపాడుకోలేని దైన్యం. గుండెలు పిండే ఈ హృదయ విదారక సంఘటన చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనిపించిన దృశ్యం. -
ఖరీఫ్ సాగుకు.. సన్నద్ధమెప్పుడు?
[ 16-05-2024]
ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. పంటలు సాగు చేసేందుకు రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువులు, భూసార పరీక్షలు, పంటల విత్తనాలు, ఎరువులు అందించి సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం చేయాల్సి ఉంది. -
చేతిలో పెడతారా.. చేతులెత్తేస్తారా?
[ 16-05-2024]
ఏటా అదే తంతు.. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక మూడు, నాలుగు నెలల వరకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేస్తూనే ఉంటారు. దీంతో అర్ధ సంవత్సర పరీక్షలు వచ్చినా కొన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. -
నిర్లక్ష్యం ఖరీదు... నిండు ప్రాణాలు
[ 16-05-2024]
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చినగంజాం నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న టిప్పరును ఢీకొట్టడంతో -
బాపట్ల జిల్లాలో 86.59 శాతం పోలింగ్
[ 16-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం అధికారికంగా వెలువడింది. జిల్లాలో 86.59 శాతం పోలింగ్ నమోదైంది. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 89.35 శాతం, రేపల్లె నియోజకవర్గంలో అత్యల్పంగా 84.16 శాతం పోలింగ్ జరిగింది. -
ఓపికుంటేనే వైద్యం..
[ 16-05-2024]
నిత్యం 2వేల మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి జీజీహెచ్కు వస్తుంటారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా జీజీహెచ్లో రోజుకు ఎంత మంది... -
వైకాపా దాడులకు అడ్డుకట్ట పడేనా?
[ 16-05-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రక్తసిక్తంగా మారాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసినా ప్రతిపక్షాలపై దాడులు, ఘర్షణలు, ఆస్తుల విధ్వంసం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు కొనసాగాయి. -
చైతన్య యాత్రికుడు..!
[ 16-05-2024]
ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు సైకిల్పై.. మరికొందరు బైక్లపై సవారీ చేస్తున్నారు. కొత్త ప్రాంతాలకు తిరుగుతూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మానసికోల్లాసం పొందుతారు. -
పల్నాడులో 86.76 శాతం పోలింగ్
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుది నమోదు శాతం వెలువడింది. పోస్టల్ బ్యాలెట్లు, హోం ఓటింగ్ కలిపి బుధవారం తుది పోలింగ్ శాతం విడుదల చేశారు. -
పేద విద్యార్థినులకు ఉపకార వేతనాలు
[ 16-05-2024]
కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థినుల వసతి గృహంలో చేరేందుకు గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులు గురువారం నుంచి దరఖాస్తులు చేసుకోవాలని సమితి అధ్యక్షుడు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. -
తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమార్తె
[ 16-05-2024]
కుటుంబ తగాదాల నేపథ్యంలో తల్లి నివాసం ఉంటున్న పూరింటికి కుమార్తె నిప్పు పెట్టిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చెంచుపేటలో జరిగింది. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీˆఐ రమేష్బాబు బుధవారం తెలిపిన సమాచారం మేరకు.. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 16-05-2024]
ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయమని తేలడంతో ఆ పార్టీ నాయకులు కూటమి నేతలపై దాడులు చేస్తున్నారని పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్