వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
భార్య వివాహేతర సంబంధం భర్తను హతమార్చింది. పథకం ప్రకారమే ప్రియుడితో కలిసి వివాహిత దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు. హత్య సమయంలో ప్రధాన నిందితుడిని వెంటాడిన బాధితుడి దీనచూపులు లొంగిపోయేందుకు కారణమయ్యాయి.
హత్య కేసులో రౌడీషీటర్ లొంగుబాటు
నలుగురి అరెస్టు.. రిమాండ్కు తరలింపు
విజయ్కుమార్
యూసుఫ్గూడ, న్యూస్టుడే: భార్య వివాహేతర సంబంధం భర్తను హతమార్చింది. పథకం ప్రకారమే ప్రియుడితో కలిసి వివాహిత దారుణానికి తెగబడినట్టు నిర్ధారించారు. హత్య సమయంలో ప్రధాన నిందితుడిని వెంటాడిన బాధితుడి దీనచూపులు లొంగిపోయేందుకు కారణమయ్యాయి. ఈ కేసులో శుక్రవారం నిందితులు మృతుడి భార్య శ్రీలక్ష్మి, ఆమె ప్రియుడు రాజేశ్, రౌడీషీటర్ రాజేశ్వర్రెడ్డి, మహ్మద్ మైతాబ్ను మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
భర్తకు తెలియడంతో పథకం
ఎల్లారెడ్డిగూడకు చెందిన విజయ్కుమార్ ప్రయివేటు ఉద్యోగి. 15 ఏళ్ల క్రితం శ్రీలక్ష్మిని వివాహమాడాడు. ఇద్దరు పిల్లలతో కలిసి జయప్రకాశ్నగర్లోని శిఖర అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. పెళ్లికి ముందే ప్రేమించిన రాజేశ్తో శ్రీలక్ష్మి ఆ సంబంధాన్ని కొనసాగించింది. భర్తకు తెలియకుండా ప్రియుడ్ని కలుస్తుండేది. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతుండేది. ఈ ఏడాది జనవరిలో భార్య ప్రవర్తనపై అనుమానం రావటంతో ఆమె సెల్ఫోన్ను విజయ్ పరిశీలించాడు. ప్రియుడు రాజేశ్తో వాట్సాప్ చాటింగ్ చేసినట్టు గుర్తించాడు. ఈ విషయమై భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. పద్దతి మార్చుకోమంటూ భర్త గట్టిగా మందలించటంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పింది. భర్తను బెదిరించాలని, అవసరమైతే అడ్డు తొలగించాలని కోరింది. విజయ్కుమార్ను చంపేందుకు రాజేశ్.. స్నేహితుడైన రౌడీషీటర్ రాజేశ్వర్రెడ్డిని అతనికి తెలిసిన మహ్మద్ మైతాబ్కు చెప్పాడు. స్థానిక మద్యం దుకాణం వద్ద ముగ్గురూ హత్యకు పథకరచన చేశారు. ఫిబ్రవరి 1న విజయ్ పిల్లల్ని పాఠశాలకు తీసుకువెళ్లగా ఆ ముగ్గురు ఇంటికి వచ్చి మరుగుదొడ్డిలో దాక్కున్నారు. శ్రీలక్ష్మిని పడకగదిలో ఉంచారు. విజయ్కుమార్ ఇంటికి రాగానే ముగ్గురు దాడి చేసి చంపేసి వెళ్లిపోయారు. రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసిన శ్రీలక్ష్మి.. విజయ్కుమార్ గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది. మృతుడి తల్లిదండ్రులు మరణించడం, సోదరుడు, బంధువులున్నా రాకపోకలు లేకపోవడంతో ఎవరూ అనుమానించలేదు. దీంతో అంత్యక్రియలు పూర్తిచేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. విజయ్ను రౌడీషీటర్ రాజేశ్వర్రెడ్డి చంపుతున్న సమయంలో పిల్లల కోసమైనా తనను ప్రాణాలతో వదిలేయమని మృతుడి కళ్లు దీనంగా వేడుకోవడం గుర్తుకొచ్చి పశ్చాత్తాపపడిన రాజేశ్వర్రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. తండ్రి మరణించటం, తల్లి జైలుకెళ్లటంతో ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంటికి చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
[ 26-07-2024]
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
[ 26-07-2024]
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
[ 26-07-2024]
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్