పుడమికి బలం.. జగతికి జీవాధారం
తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు.
ఇంకుడుగుంతల నిర్మాణం అత్యవసరం
పొలంలో తవ్విన ఇంకుడుగుంతలో నిలిచిన నీరు
న్యూస్టుడే, తాండూరు, పరిగి: తాగునీటి ఎద్దడి నివారణకు, భూగర్భ జలాల పెంపుదలకు ‘ఇంకుడు గుంతలకు’ మించిన చక్కటి మార్గం మరొకటి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్ల క్రితం వరకు వీటి తవ్వకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించాయి. కరవు పరిస్థితులను అధిగమించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతానికి ప్రధానంగా మున్సిపాలిటీల్లో ప్రజలు సైతం చొరవ చూపారు. తరువాత దీనిపై అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఆసక్తి చూపక పోవడంతో ఉన్నవన్నీ పూడుకుపోయి ఆనవాళ్లే కానరాకుండా పోయాయి. ప్రస్తుతం ఎండలు భరించలేని స్థితిలో ఉన్నాయి. చెరువులు, కుంటలు అడుగంటి పోతున్నాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ కరవు పరిస్థితులు తలెత్తకుండా పట్టణాల్లో అందరూ ‘ఇంకుడు గుంతల’ తవ్వకానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వీటి అవసరం, గత పరిస్థితులపై ‘న్యూస్టుడే’ కథనం.
నిబంధనల అమలు ఎక్కడ..
జిల్లాలో పరిగి, తాండూరు, కొడంగల్, వికారాబాద్ మున్సిపాలిటీలున్నాయి. వీటిలో కొత్తగా భవనాల నిర్మాణాలు చేసే వారు ఇంకుడు గుంతను విధిగా నిర్మించుకోవాలనే నిబంధన ఉంది. అధికారులు మాత్రం ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో పారుతున్న వరద వృథాగా పోతుంది. దీనికి తోడు గృహాల్లో వివిధ అవసరాలకు వినియోగించిన నీరు కూడా కాలువల ద్వారా వెళ్లి పోతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో నిర్మించిన ఇంకుడు గుంతల నిర్వహణ సవ్యంగా లేక భూమికి సమాంతరంగా మారి పోయాయి.
2019లోనే లక్ష్య నిర్దేశం
నిర్ణీత పరిమాణాల్లో తవ్విన గుంతల్లో కంకర, ఇసుక, గులకరాళ్లను పొరలుగా పోస్తారు. వీటిలోకి వచ్చిన వరద నీరు, వృథా నీరు భూమిలోకి ఇంకి పోయి జల మట్టం పెరుగుతుంది. ఈ అంచనాతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కలిపి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,560 ఇంకుడు గుంతలు నిర్మించాలనే లక్ష్యాన్ని మున్సిపాలిటీలు పెట్టుకున్నాయి. ఒక్కో ఇంకుడు నిర్మాణ స్థితిని బట్టి రూ.6వేల నుంచి రూ.8వేల వరకు చెల్లించేందుకు నిర్ణయించింది. అయితే ఈ విషయంలో అవగాహన కల్పించక పోవడంతో నిర్ణీత లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు.
- ఒక్కో మున్సిపాలిటీలో ఇవి పరిమిత సంఖ్యలోనే పూర్తవడం విశేషం.
ప్రత్యేక శిలాఫలకం ఆవిష్కరించినా..
తాండూరులో ఇంకుడు గుంతల నిర్మాణానికి 2017లో అప్పటి ప్రభుత్వం రూ.4లక్షలను మంజూరు చేసింది. అదే ఏడాది జనవరి 30న అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న పట్నం మహేందర్రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ నిధుల ఆధారంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణల్లో దాదాపు 67 ఇంకుడు గుంతలను నిర్మించాల్సి ఉండగా పట్టించుకోలేదు. నిధులు వెనక్కి వెళ్లి పోయాయి. శిలాఫలకం మాత్రం వెక్కిరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వశక్తులొడ్డారు.. సగానికి పైగా కదిలారు
[ 14-05-2024]
రాజధాని ఓటర్లు సోమవారం పోలింగ్కు కదిలొచ్చారు. గత లోక్సభ ఎన్నికల కంటే ఈ సారి కొంత మెరుగ్గానే ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో 60 శాతం జరిగింది. రాజధాని ఓటింగ్లో చివరి వరుసలో నిలిచింది. -
కంటోన్మెంట్లో పెరిగిన ఓటింగ్
[ 14-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు లోక్సభకు మాత్రమే ఓటు వేయగా.. కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలోని ఓటర్లు మాత్రం రెండు ఓట్లు వినియోగించుకున్నారు. ఇక్కడ భారాస ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మరణంతో సోమవారం ఉప ఎన్నిక జరిగింది. -
పోలింగ్ సమయం పెంచాలని అసదుద్దీన్ నిరసన
[ 14-05-2024]
చాంద్రాయణగుట్ట సెయింట్ ఆన్స్ గ్రామర్ హైస్కూల్లోని బూత్-88లో పలుమార్లు ఈవీఎంలు మొరాయించాయని మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటింగ్ సమయానికి విఘాతం కలిగినందున సమయం పెంచాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు నీడలో పోలింగ్
[ 14-05-2024]
ఎక్కడికక్కడ సాయుధ బలగాల మోహరింపు.. పోలీసు పహారా నడుమ నగరంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నపాటి ఘర్షణలు.. ఆందోళనలు మినహా ఎక్కడా ఉద్రిక్తతలు నమోదవ్వలేదు. -
మొరాయించిన ఈవీఎంలు ఓటరుకు తప్పని తిప్పలు
[ 14-05-2024]
ఉదయాన్నే ఓటేయడానికి ఆసక్తి చూపినా పలుచోట్ల ఈవీఎంల మొరాయింపులతో ఓటర్లకు ప్రయాసలు తప్పలేదు. కుత్బుల్లాపూర్ సుభాష్చంద్రబోస్నగర్ 313 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం గంటన్నర పాటు మొరాయించింది. -
అధికారుల తీరుపై మండిపడ్డ మాధవీలత
[ 14-05-2024]
చాంద్రాయణగుట్టలోని సెంట్ ఆన్స్ గ్రామర్ హైస్కూల్లోని పోలింగ్ బూత్లను భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత సందర్శించారు. ఓ బూత్లో ఈవీఎంలు వరుస క్రమంలో లేవని అభ్యంతరం చెప్పి వాటిని సక్రమంగా మార్పించారు. -
పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగిన ఏజెంట్పై కేసు
[ 14-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలతో సెల్ఫీ దిగిన ఓ ఏజెంట్పై శంషాబాద్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తొండుపల్లిలోని 460 పోలింగ్ స్టేషన్లో ఉదయం 5.45 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. -
వెతల మధ్య ఓటింగ్
[ 14-05-2024]
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు లేక అధికారులు అవస్థపడ్డారు. ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీలోని ఓ పాఠశాల నిర్వాహకులు మరుగుదొడ్లకు తాళం వేశారు. -
ఠాణా ఎదుట కంటోన్మెంట్ భాజపా అభ్యర్థి నిరసన
[ 14-05-2024]
కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బు సంచులతో వెళ్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కంటోన్మెంట్ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి డా.టి.ఎన్.వంశ తిలక్ సోమవారం బేగంపేట ఠాణా ఎదుట నిరసనకు దిగారు. -
ఓటు వేసి మృత్యుఒడికి..
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రానికి వచ్చి బాధ్యతగా ఓటు వేశాక గుండెపోటుతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఘటన ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఓల్డ్ భరత్నగర్ సామాజిక భవనంలోని 349 బూత్లో జరిగింది. -
సిబ్బంది వైఫల్యం.. ఓటర్లకు గందరగోళం
[ 14-05-2024]
ఓటర్లకు పోలింగ్ చీటీలు పంచడంలో అధికార యంత్రాంగం మరోసారి ఘోరంగా విఫలమైంది. తూతూమంత్రంగా కొన్నిచోట్ల పంచి మమ అన్పించారు. ఓ ప్రధాన పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి చీటీలు పంచారు. -
పోలింగ్ స్టేషన్ లేదని గిరిజనుల ధర్నా
[ 14-05-2024]
తమకు ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయలేదంటూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల పంచాయతీ తండా వాసులు రహదారిపై ధర్నా నిర్వహించారు. -
తొలిఓటు సంబరం
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో 18ఏళ్లు నిండిన ఓటర్లు తొలిసారిగా వారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వారి తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఉత్సాహంగా వచ్చారు. సెలవు రోజని బద్ధకించకుండా ఉదయం ఏడు, ఎనిమిది గంటలకే ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్ కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. -
బారులుదీరిన బస్తీవాసులు
[ 14-05-2024]
బస్తీ ఓటర్లపై అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. ఆయా నియోజకవర్గాల్లోని బస్తీవాసులు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. కుటుంబ సభ్యులు, చంటి పిల్లలతో సహా క్యూలో నిలుచుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
బుల్లెట్ బండి పేలుడు ఘటనలో..
[ 14-05-2024]
బుల్లెట్ బండి ట్యాంకు పేలిన ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన పాతబస్తీ భవానీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. -
నిర్మానుష్యంగా రహదారులు
[ 14-05-2024]
నిత్యం లక్షలాది వాహనాలతో ప్రయాణించే జూబ్లీహిల్స్ రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. వరుస సెలవులు.. ఏపీ, తెలంగాణాల్లో ఎన్నికలు కావడంతో చాలా మంది తమ సొంతూర్లకు వెళ్లారు. -
ప్రలోభాలు.. పంపకాలకు దూరం
[ 14-05-2024]
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని అగర్మియాగూడలో స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్ని పార్టీల ప్రతినిధులు ఒక రోజు ముందే తీర్మానం చేసుకున్నారు. -
పార్టీ గుర్తులతో ఓటరు స్లిప్పులు!
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రాలకు ఓటరు ఐడీ కార్డులతో వచ్చిన ప్రజలు అక్కడే ఉన్న పార్టీల నాయకుల వద్ద సిప్పులు తీసుకున్నారు. ఈసారి పార్టీలు మొబైల్ ప్రింటర్ సహాయంతో వారికి సంబంధించిన ఓటర్ స్లిప్పులు ఇచ్చాయి హిమాయత్నగర్లోని ఓ కేంద్రం వద్ద ఇలా ఇచ్చిన స్లిప్పులపై పార్టీ గుర్తు, అభ్యర్థుల చిత్రాలు ఉన్నాయి. -
ఆమెను చంపేశారు.. ఈమెను బతికించారు
[ 14-05-2024]
బతికున్నవారిని చంపేశారు.. చనిపోయిన వారిని బతికించారు.. ఒకరికి రెండు పోలింగ్బూత్లలో ఓట్లున్నాయి.. సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించినా జాబితాలో ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉన్నాయి. -
ఏపీ.. ఎన్నికలపై ఆసక్తి!
[ 14-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది నగరవాసుల్లో ప్రధానంగా ఆ రాష్ట్ర మూలాలున్న వారిలో ఉత్కంఠగా మారింది. -
నడవలేకుంటే చక్రాల కుర్చీలు
[ 14-05-2024]
నగర వ్యాప్తంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చాలా కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం ఓపికతో వచ్చి ఓటు వేయడం కనిపించింది. -
సార్వత్రికం.. సర్వత్రా ప్రశాంతం
[ 14-05-2024]
చేవెళ్ల పరిధిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. కొత్తగా ఓటుపొందిన యువతీ, యువకులు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. -
సీఎం ఎన్నికల నిబంధనలు అతిక్రమించారు: అరుణ
[ 14-05-2024]
ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రెస్మీట్లు పెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని భాజపా పాలమూరు లోక్సభ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. సోమవారం నియోజక వర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన ఆమె విలేకరులతో చిట్చాట్గా మాట్లాడారు. -
పెరిగిన పోలింగ్ శాతం
[ 14-05-2024]
పార్లమెంట్ ఎన్నికలంటే మనకెందుకులే అనుకోకుండా ఈసారి ఓటుహక్కు వినియోగానికి జిల్లా ఓటర్లు ముందుకొచ్చారు. ఈ కారణంగానే గత పార్లమెంట్ (2019) ఎన్నికల్లో జిల్లాలో 62.57 శాతం ఓటింగ్ నమోదైతే.. ఈసారి 68.02గా నమోదై అందరి దృష్టిని ఆకర్షించింది. -
స్ట్రాంగ్ రూమ్లకు చేరిన ఈవీఎంలు
[ 14-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు.