logo

పతుల విజయానికి సతుల పిలుపు

కాంగ్రెస్‌ పార్టీతోనే పేదల సంక్షేమం సాధ్యమని చేవెళ్ల లోక్‌సభ  అభ్యర్థి రంజిత్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి భార్య ఉమారెడ్డి, టీఆర్‌ఆర్‌ అన్నారు.

Updated : 30 Apr 2024 05:49 IST

ప్రచారంలో సంగీతారెడ్డి, టీఆర్‌ఆర్‌ సతీమణి ఉమారెడ్డి

పరిగి, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీతోనే పేదల సంక్షేమం సాధ్యమని చేవెళ్ల లోక్‌సభ  అభ్యర్థి రంజిత్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి భార్య ఉమారెడ్డి, టీఆర్‌ఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి పట్టణంలో ఇంటింటా ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ దేశంలోనూ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు.  


భాజపా ముగ్గువేసి ప్రచారం నిర్వహించిన కొండా సతీమణి సంగీతారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంలో  మహిళల పాత్ర అమూల్యమైందని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌ పట్టణంలో రామయ్యగూడ, గాంధీకాలనీ, వాసవి కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఉదయం ,రాజీవ్‌ గృహ కల్ప కాలనీలో భాజపా రంగవల్లులు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీని, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, సుచరితారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని