సొంతవారికే పంపకాల అప్పగింతలు
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి.
కిందిస్థాయి నాయకుల్ని నమ్మేదేలే అంటున్న అభ్యర్థులు
ఈనాడు, హైదరాబాద్: ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. ఆ బాధ్యతలు తమకే అప్పజెప్పాలంటూ డివిజన్, బూత్స్థాయి నాయకులు ఉదయాన్నే నేతల ఇంటి వద్ద తిష్ఠ వేస్తున్నారు. బూత్స్థాయి బాధ్యతలు అప్పగించాలని కొందరు.. డివిజన్ స్థాయి బాధ్యతలు ఇవ్వాలని మరికొందరు.. సామాజికవర్గాల వారీగా ఓట్లేయిస్తామని, చివరిరోజు ర్యాలీలకు జనాలను తీసుకొస్తామని ఇంకొందరు వస్తుండటంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొన్ని నెలలకే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ‘ఖర్సయిపోతున్నామ’ంటూ కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి నాయకుల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో వారి నుంచి తప్పించుకునేందుకు ప్రచారం ఉందంటూ ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇళ్లలో ఉన్నా లేరంటూ చెబుతుండటంతో కేడర్ నిరాశతో వెనుదిరుగుతోంది.
వాళ్లు అలా.. వీళ్లు ఇలా..
ఈ ఎన్నికల్లో అందినకాడికి సర్దేద్దామని కిందిస్థాయి నాయకులు భావిస్తుంటే ఆచితూచి అడుగేయాలని అభ్యర్థులు అనుకుంటున్నారు. ఓటేసేవారికి రూ.500, పంపిణీలో కీలకంగా ఉండే వారికి రూ.1000-2000 వరకు పంచాలనే ప్రతిపాదనలను నాయకులు అభ్యర్థుల ముందు ఉంచుతున్నారు. గత లోక్సభ ఎన్నికలను విశ్లేషించుకుంటున్న నేతలు ఆ స్థాయిలో ఖర్చు అవసరమా అని వెనకడుగు వేస్తున్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో లక్షలాది ఓటర్లు ఉండగా.. విజయం కోసం డబ్బు ఏ స్థాయిలో పంచాలోనని తర్జన భర్జన పడుతున్నారు. బూత్, డివిజన్ స్థాయి బాధ్యతలు అప్పగించి డబ్బు చేతిలో పెట్టాలని నాయకులు ఒత్తిడి తెస్తుంటే ‘డబ్బు ఇవ్వలేను. దేవుడిపై భారం వేశా.. అదృష్టం ఉంటే గెలుస్తా. లేదంటే లేద’ని కొందరు చేతులెత్తేస్తున్నారు. ఇంకొందరు ఎంతో కొంత చేతిలో పెట్టి ఇంతే ఇవ్వగలను..సర్దుకోవాలని బుజ్జగిస్తున్నారు.
గుర్రుగా ఉన్న ఇతర నేతలు..
ప్రచారం చివరిలో బలప్రదర్శనపై దృష్టిపెడితేనే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుందనే భావన అభ్యర్థుల్లో ఉంది. ఇందుకోసం ర్యాలీలకు జనాలను తీసుకురావడంలో క్షేత్రస్థాయి నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి కాకుండా పంపకాల బాధ్యత వేరే వారికి అప్పగించడంపై కొన్ని పార్టీల కేడర్ గుర్రుగా ఉంది. అన్నిచోట్లా కిందిస్థాయి నాయకులను నమ్మే పరిస్థితి లేకపోవడం, పంపకాలపై పర్యవేక్షణ సాధ్యంకాని పరిస్థితి.. ఇచ్చిన మొత్తం ఓటర్లకు చేరుతుందో లేదో అనే అనుమానంతో అభ్యర్థులు సొంత మనుషులకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదట సికింద్రాబాద్.. చివర హైదరాబాద్
[ 04-06-2024]
నువ్వా.. నేనా అన్నట్లు సాగిన పార్లమెంటు ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. -
మెడకు చున్నీ.. తలకు తీవ్ర గాయం.. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
[ 04-06-2024]
తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో మెడకు చున్నీ బిగించిన స్థితిలో ఓ మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నేరేడ్మెట్ ఠాణా పరిధిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. -
మహానగరం.. భద్రత కట్టుదిట్టం
[ 04-06-2024]
రాజధానిలో మంగళవారం నాలుగు లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. -
ఏపీలో ఎవరు.. గ్రేటర్లో ఎవరెవరు?
[ 04-06-2024]
అటు ఏపీ.. ఇటు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఇంకా కొన్ని గంటల్లోనే వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ఠాణాల ప్రక్షాళనకు వేళాయె
[ 04-06-2024]
ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు నిర్దారణ కావటంతో అరెస్టయిన నగర సీసీఎస్ ఏసీపీ.. భూవివాదం కేసు మాఫీకి రూ.3 లక్షలు తీసుకుంటూ బుక్కయిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్సై.. -
నెలాఖరు నుంచి డీపీఎంఎస్ సేవలు బంద్
[ 04-06-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలో ఈ నెలాఖరు నుంచి డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం (డీపీఎంఎస్) సేవలు నిలిపివేయనున్నారు. -
ప్రహరీ కూలి ఇద్దరు చిన్నారుల దుర్మరణం
[ 04-06-2024]
ఇంటి యజమాని నిర్లక్ష్యం మూడు వలస కుటుంబాల్లో విషాదం నింపింది. -
విద్యుత్తు ఆపేసి.. సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టి ఎస్బీఐలో చోరీకి విఫలయత్నం
[ 04-06-2024]
ఇద్దరు యువకులు మాస్కులు, గ్లౌజులతో అర్ధరాత్రి బ్యాంకులోకి చొరబడ్డారు. విద్యుత్తు ఆపేసి.. సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టారు.. లాకర్కు రంధ్రం చేద్దామంటే సాధ్యపడలేదు. -
హైటెక్ పద్ధతిలో మాల్ ప్రాక్టీస్
[ 04-06-2024]
హైటెక్ పద్ధతిలో మాల్ప్రాక్టిస్కు పాల్పడిన ఇంజినీరింగ్ విద్యార్థికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల అపరాధ రుసుం విధించింది. -
ప్రతిష్ఠాత్మకం.. కంటోన్మెంట్ విజయం
[ 04-06-2024]
లోక్సభ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెల్లడి కానుంది. -
కౌంటింగ్ టేబుళ్లు 140.. రౌండ్లు 148
[ 04-06-2024]
చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
పాలిసెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
[ 04-06-2024]
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ మళ్లింపులు
[ 04-06-2024]
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల సమీపంలో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. -
అపార్టుమెంట్ ప్రహరీ కూలి.. చిక్కుకున్న కార్మికుడు
[ 04-06-2024]
అపార్టుమెంట్ ప్రహరీ కూలి కార్మికుడి కాళ్లపై పడడంతో అందులోనే ఇరుక్కుపోయాడు. -
అధిక వడ్డీ ఆశ.. రూ.25 కోట్లు టోకరా
[ 04-06-2024]
నూటికి రూ.10 వడ్డీ ఇస్తా.. మీ దగ్గర ఎంత ఉంటే అంత నా దగ్గర పెట్టుబడి పెట్ట్టండి.. మీ ఆశలు, ఆకాంక్షలు తీరుస్తానంటూ.. ఆ యువకుడు నమ్మబలికాడు. -
కదులుతున్న రైలును ఎక్కుతుండగా.. ప్రమాదవశాత్తు కిందపడి డెలివరీ బాయ్ దుర్మరణం
[ 04-06-2024]
కదులుతున్న ఎంఎంటీఎస్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు దాని కిందపడి ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ మృతి చెందాడు. -
మామ, బావమరిదిపై కత్తితో దాడి
[ 04-06-2024]
తనకు నలుగురు సోదరులున్నారంటూ తరుచూ భార్య బెదిరిస్తుండడంతో విసుగుచెందిన భర్త.. మామ, బావమరిదిలపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.