ఆమె పరుగెడితే పతకమే
ఆమె వయసు 70 ఏళ్లు. అయినప్పటికీ తనకన్నా చిన్న వయసు వారితో పరుగులో పోటీపడుతోంది. బతికుంటే వందేళ్ల వరకు పరుగెడుతూనే ఉంటానని చెబుతోంది.
70 ఏళ్లలోనూ అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న బామ్మ
మలేసియాలో కాంస్య పతకం సాధించిన రామానుజమ్మ
న్యూస్టుడే, సిరిసిల్ల (విద్యానగర్): ఆమె వయసు 70 ఏళ్లు. అయినప్పటికీ తనకన్నా చిన్న వయసు వారితో పరుగులో పోటీపడుతోంది. బతికుంటే వందేళ్ల వరకు పరుగెడుతూనే ఉంటానని చెబుతోంది. ఆమె సిరిసిల్లకు చెందిన టమటం రామానుజమ్మ. గత 35 ఏళ్లుగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరుగు పోటీల్లో పాల్గొని వందల పతకాలు సాధించింది. పరుగుతో పాటు యోగా, కరాటేలోనూ సత్తా చాటుతోంది. ఇటీవల మలేసియాలో 35వ ఇంటర్నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో 50 కిలోల విభాగంలో 55 ఏళ్ల వయసు వారితో పోటీ పడి మరీ కాంస్య పతకం సాధించి ఔరా అనిపించింది.
రామానుజమ్మ భర్త టమటం భాషయ్య వైద్య, ఆరోగ్యశాఖలో సూపర్వైజర్గా పని చేసేవారు. ఆయన ప్రోత్సాహంతోనే అథ్లెట్గా మారింది. ఆయన 15 సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ పరుగెడుతూనే భర్త ఆశయాలను నెరవేరుస్తుంది. ఆమెకు ఇద్దరు కుమారులు. రామానుజమ్మకు చిన్ననాటి నుంచి క్రీడలంటే ఆసక్తి ఎక్కువ. అయినప్పటికీ పోటీల్లో పాల్గొనలేదు. భర్త ప్రోత్సాహంతో పరుగు పోటీల్లో తొలిసారిగా 45 ఏళ్ల వయసులో పాల్గొంది. అప్పుడు ప్రారంభించిన పరుగును ఇప్పటివరకూ ఆపలేదు. రాష్ట్ర స్థాయిలో 200 పతకాలు, జాతీయ స్థాయిలో 10 స్వర్ణం, 5 రజత పతకాలు, జిల్లా స్థాయిలో అనేక పతకాలు సాధించింది. క్రీడలతో పాటు రామానుజమ్మకు సేవాభావం ఎక్కువ. వృద్ధులకు కంటి ఆపరేషన్లు చేయించి సేవ చేసేవారు. అందుకు వయోశ్రేష్ఠ సమ్మాన్ పురస్కారం అందుకున్నారు. భక్తిభావం కూడా ఎక్కువే. మహిళలందరినీ ఒకేచోట చేర్చి తులసి, కుంకుమ, కోటి శివార్చన పూజలు నిర్వహించింది. తిరుమల శ్రీవారి సేవకు తీసుకెళ్లింది. అనేకసార్లు రక్తదానం చేసింది. ఆర్థిక ఇబ్బందులతో అనేకసార్లు అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు దూరమైంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ధైర్యంగా ముందుకెళ్లాలని పేర్కొంది.
పాస్పోర్టులో పొరపాటు వల్ల...
పాస్పోర్టులో చిన్న పొరపాటు వల్ల తన వయసు 55 అని పడటంతో 55 ఏళ్ల వారితో పరుగు పందెంలో పాల్గొంది. అయినా బెదరకుండా ధైర్యంగా తన కన్నా 15 ఏళ్లు చిన్న వారితో పోటీ పడి 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని తృతీయస్థానంలో నిలిచి.. కాంస్య పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు పండుగ పిలుస్తోంది!
[ 13-05-2024]
అలాంటిది ఓటు వేసే అవకాశం అయిదేళ్లకోసారి వచ్చినా క్షణాల్లో పని అయిపోవాల్సిందే. కొద్దిగా ఆలస్యమైనా అసహనం ముంచుకొస్తుంది.. అవసరమైతే ఓటుకు దూరంగా ఉంటాం కానీ.. ఏ మాత్రం నిరీక్షణను సహించబోం. -
ఓటుకు అంతా సిద్ధం!
[ 13-05-2024]
పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బందిఓటు హక్కును వినియోగించుకునేందుకు అంతా సిద్ధమైంది. నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్కు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల యంత్రాంగం చేపట్టింది. -
ఓటెయ్యని ఉద్యోగులు 349 మంది
[ 13-05-2024]
వారంతా విద్యావంతులు.. పైగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. -
మీ అస్త్రం వృథా కానీయొద్దు
[ 13-05-2024]
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు నేడు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటరు మహాశయులకు నమస్కారం. అయిదేళ్లకోసారి వచ్చే సదావకాశాన్ని సద్వినియోగపర్చుకునేందుకు ఉవ్విళ్లూరే వారందరికీ ఇదే నా స్వాగతం -
లోక్సభ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. -
పోలింగ్ ఏజెంట్లు కీలకం
[ 13-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటంలో పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే అభ్యర్థుల తరఫు ఏజెంట్ల పాత్ర కీలకం. -
విలువ తెలుసుకొని మసలుకో!
[ 13-05-2024]
ఎన్నికల్లో మనం ఓటు వేసేంత వరకు ఎన్నికల సంఘం వివిధ స్థాయిల్లో ఒక్కో ఓటరుకు సరాసరి రూ.100 వెచ్చిస్తోంది. -
బాధ్యతగా భావించి హక్కు సద్వినియోగం
[ 13-05-2024]
దేశవ్యాప్తంగా సార్వత్రిక పోరు ఉత్కంఠగా సాగుతోంది. నాలుగో విడతలో ఈ నెల 13న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. -
ఓటేద్దాం.. పదండి
[ 13-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు ఈవీఎంల్లో నమోదు కానున్నది. దీనికోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. -
1,500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు
[ 13-05-2024]
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు 1,500 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోతిని తప్పించబోయి ప్రమాదం.. బ్యాంకు ఉద్యోగులు మృతి
-
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్