ధరావతు.. ప్రజాదరణకు గుర్తు
మీ పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు. ప్రజల మద్దతు లేని వ్యక్తిని పోటీలో నిలబెట్టారంటూ తరచూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో వినిపించే మాటలు.
ఎన్నికల్లో ఇదే కీలకాంశం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల : మీ పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు. ప్రజల మద్దతు లేని వ్యక్తిని పోటీలో నిలబెట్టారంటూ తరచూ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లో వినిపించే మాటలు. డిపాజిట్కు అంత ప్రాముఖ్యం ఉంటుంది మరి. కేవలం అభ్యర్థి కట్టిన డబ్బు తిరిగి రావడమే కాదు, అతడికి, పార్టీకి ఉన్న ప్రజాదరణ, నియోజకవర్గంలో అభ్యర్థికి ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. అసలేంటీ డిపాజిట్? ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో పోటీలో నిలిచినవారు, డిపాజిట్ కోల్పోయారనే విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం.
నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సమయంలో నోటాకు వేసినవి, పోస్టల్ ఓట్లలో చెల్లకుండా పోయిన ఓట్లను తొలగిస్తారు. ఆ తర్వాత ఉన్న చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు సాధించిన వారికి డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. అంతకంటే తక్కువ మొత్తంలో ఓట్లు సాధించిన వారి డిపాజిట్ను జప్తు చేస్తారు. 2018 ఎన్నికల్లో అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి 26 మంది పోటీ పడ్డారు. వీరిలో డిపాజిట్ దక్కింది ముగ్గురికి మాత్రమే. మిగతా 23 మంది డిపాజిట్ కోల్పోయారు. హుజూరాబాద్, మంథని నియోజకవర్గాల్లో తక్కువగా 11 మంది చొప్పున పోటీలో నిలవగా రెండు చోట్లా 9 మంది చొప్పున డిపాజిట్ కోల్పోయారు. 2014లో రామగుండంలో 27 మంది పోటీలో ఉండగా 25 మందికి డిపాజిట్ రాలేదు.
ప్రజాపాతినిధ్య చట్టం 1961 నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తారు. ఆ నియోజకవర్గంలో పోలింగ్ జరిగి చెల్లుబాటైన ఓట్లలో ఎన్నికల సంఘం నిర్ణయించిన మేరకు ఓట్లు సాధిస్తే వారి డిపాజిట్ను తిరిగి ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.5,000, మిగతా సామాజిక వర్గాల వారు రూ.10 వేలు డిపాజిట్గా చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2018 ఎన్నికల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 193 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు. ఫలితాల తర్వాత 154 మంది డిపాజిట్ కోల్పోయారు. 2014 ఎన్నికల్లోనూ 168 మందికి 140 మంది డిపాజిట్ గల్లంతైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నాయకుడికి తీవ్ర గాయాలు
[ 11-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ రోడ్డు షోకు వెళ్లుతుండగా జమ్మికుంటలో భారాస శ్రేణులు ఘన స్వాగతం పలికారు. -
భారాస అభ్యర్థిని గెలిపించాలి..!
[ 11-05-2024]
పెద్దపల్లి ఎంపీగా భారాస పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని ఆ పార్టీ మండల నాయకులు కోరారు. -
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి
[ 11-05-2024]
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కమాన్ పూర్ మాజీ ఎంపీపీ కోలేటి మారుతి కోరారు. -
ఇదిగిదిగో నవ లోకం
[ 11-05-2024]
ఉమ్మడి జిల్లాలో యువ రక్తం ఉరకలేస్తోంది.. ఆకాశమే హద్దంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. యువ ఓటర్లు దేశ భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. -
గులాబీ శ్రేణుల్లో జోష్
[ 11-05-2024]
సిరిసిల్ల పట్టణంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
గడప గడపకు కార్యకర్తలు
[ 11-05-2024]
ప్రధాన పార్టీల ముఖ్య నేతల ప్రచారాలు ముగిశాయి.. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.. పోలింగ్కు మధ్యలో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.. -
దూరమైనా తప్పక ఓటేస్తాం!
[ 11-05-2024]
ఇప్పటికీ అనేక అనుబంధ గ్రామాలకు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయి. 200 మంది ఓటర్లకుపైగా ఉన్నా.. రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లాల్సి వస్తోంది. -
రూ.20.93 లక్షల నగదు పట్టివేత
[ 11-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.20.93 లక్షల నగదును పట్టుకొని, సీజ్ చేసి ఎన్నికల పరిశీలన అధికారులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 11-05-2024]
వ్యవసాయ బావిలో పడి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్ పట్టణ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. -
కొట్లాడి అలసిపోయా
[ 11-05-2024]
అందుబాటులో ఉండి సేవలందించినా ఓడగొట్టారు, ఎన్నికల్లో కొట్లాడి కొట్లాడి అలసిపోయా ఇక ఓపిక లేదంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి సాగు నీరందిస్తాం
[ 11-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి సమస్య పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి, కాలువ చివరి ఆయకట్టు వరకు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 11-05-2024]
రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా దగా చేసిన కాంగ్రెస్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ పేర్కొన్నారు. -
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
ప్రజలకు ఉచిత హామీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని, భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ అన్నారు. -
కోల్బెల్టు కేంద్రంగా అభ్యర్థుల వ్యూహాలు
[ 11-05-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి కోల్బెల్టు ప్రాంతాలు ప్రచార కేంద్రాలుగా మారాయి. అభ్యర్థులు తమ వ్యూహాలను ఇక్కడి నుంచే రచిస్తున్నారు. -
గెలుపే ఎజెండా.. కునుకు లేకుండా..
[ 11-05-2024]
ప్రచారం చివరి రోజుకు వచ్చేసింది.. సభలు.. సమావేశాలు.. చేరికలతో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు.. ముఖ్య నాయకులకు కంటిమీద కునుకు కరవైంది..
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు
-
‘ఎర్ర బంగారానికి’ యుద్ధం సెగ.. కేజీ ధర @ రూ.5 లక్షలు
-
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!