కరీంనగర్లో 6.. పెద్దపల్లిలో 4
దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు.
లోక్సభ ఎన్నికల్లో భిన్న పార్టీలకు ప్రజాదరణ
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం : దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు. కరీంనగర్ నుంచి ఆరు, పెద్దపల్లిలో నాలుగు పార్టీలకు లోక్సభలో ప్రాతినిధ్యం దక్కింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస, భాజపాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
కాంగ్రెస్.. 11 పర్యాయాలు
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటివరకు సార్వత్రిక, ఉప ఎన్నికలు కలిసి 19 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండగా కాంగ్రెస్ మద్దతుతో ఎన్.సి.ఎఫ్. అభ్యర్థి ఎం.ఆర్.కృష్ణ గెలిచారు. అనంతరం 1957(ద్విసభ్య), 1962, 1967, 1977, 1980, 1984, 1989, 1991లలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత వెనుకబడిన హస్తం పార్టీ 2009లో మరోసారి గెలిచింది. మధ్యలో రెండు సార్లు ఓడిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పూర్వ వైభవం సంతరించుకోవాలని ప్రయత్నిస్తోంది.
పీడీఎఫ్, తెదేపా.. ఒక్కోసారి
విద్యాసాగర్రావు
1952లో జరిగిన మొదటి ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుల మద్దతుతో బరిలోకి దిగిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి గెలిచారు. అనంతరం ఆ పార్టీకి మరోసారి అవకాశం దక్కలేదు. 1996 సాధారణ ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసిన ఎల్.రమణ విజయ కేతనం ఎగురవేశారు. ఆ పార్టీకి కూడా మరోసారి అవకాశం రాలేదు.
టీపీఎస్.. ఎమ్మెస్సార్
కేసీఆర్
1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి(ప్రాంతీయ పార్టీ) పక్షాన ఎం.సత్యనారాయణరావు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరి 1977, 1980లలో గెలిచారు.
నాడు చెన్నమనేని.. నేడు బండి
భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో మూడు సార్లు జెండా ఎగురవేసింది. 1998, 1999లలో గెలిచిన పార్టీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్రావు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. అనంతరం రెండు దశాబ్దాల తర్వాత 2019లో పార్టీ నేత బండి సంజయ్ గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కేసీఆర్.. వినోద్కుమార్
2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో జత కట్టిన తెరాస(ప్రస్తుత భారాస) గెలిచింది. పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్తో విభేదించి రాజీనామా చేయడంతో 2006, 2008లలో ఉప ఎన్నికలు వచ్చాయి. రెండు పర్యాయాలు ఆయన సొంతంగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఆ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలుపొందారు. ఉప ఎన్నికలతో కలిసి మొత్తం నాలుగు సార్లు ఈ స్థానాన్ని భారాస తన ఖాతాలో వేసుకొంది. పార్టీ అభ్యర్థిగా వినోద్కుమార్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు.
హస్తం.. సగానికంటే అధికం
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సాధారణ, ఒక ఉప ఎన్నికతో కలిపి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1962 నుంచి 9 సార్లు కాంగ్రెస్ గెలుపొందింది. 1962, 1977, 1980, 1989, 1991, 1996, 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. జి.వెంకటస్వామి నాలుగు సార్లు ఎన్నికై కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. ఆయన తనయుడు వివేక్ 2009లో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో వెంకçËస్వామి మనవడు వంశీ కాంగ్రెస్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
తెదేపా నాలుగుసార్లు
పెద్దపల్లిలో తెలుగుదేశం పార్టీ 1983, 1984, 1998, 1999లలో గెలుపొందింది. 1998, 1999లలో వరుసగా రెండు సార్లు పార్టీ అభ్యర్థి డా.సుగుణకుమారి విజయం సాధించడం విశేషం.
భారాస హ్యాట్రిక్ కొట్టేనా!
తెరాస(ప్రస్తుత భారాస) 2014, 2019లలో గెలుపొందింది. 2014లో బాల్క సుమన్, 2019లో వెంకటేశ్నేత ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం భారాస అభ్యర్థిగా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలోకి దిగారు.
తెప్రసకూ ఆదరణ
1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి వి.తులసీరాం ఎన్నికయ్యారు. ఆయన తర్వాత కాంగ్రెస్లో చేరి 1977లో రెండోసారి గెలిచారు.
బోణీ కొట్టని భాజపా
పెద్దపల్లి నుంచి ఇప్పటివరకు భాజపా గెలవలేదు. గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం దక్కలేదు. ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా గోమాసె శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదిగిదిగో నవ లోకం
[ 11-05-2024]
ఉమ్మడి జిల్లాలో యువ రక్తం ఉరకలేస్తోంది.. ఆకాశమే హద్దంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. యువ ఓటర్లు దేశ భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. -
గులాబీ శ్రేణుల్లో జోష్
[ 11-05-2024]
సిరిసిల్ల పట్టణంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
గడప గడపకు కార్యకర్తలు
[ 11-05-2024]
ప్రధాన పార్టీల ముఖ్య నేతల ప్రచారాలు ముగిశాయి.. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.. పోలింగ్కు మధ్యలో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.. -
దూరమైనా తప్పక ఓటేస్తాం!
[ 11-05-2024]
ఇప్పటికీ అనేక అనుబంధ గ్రామాలకు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయి. 200 మంది ఓటర్లకుపైగా ఉన్నా.. రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లాల్సి వస్తోంది. -
రూ.20.93 లక్షల నగదు పట్టివేత
[ 11-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.20.93 లక్షల నగదును పట్టుకొని, సీజ్ చేసి ఎన్నికల పరిశీలన అధికారులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 11-05-2024]
వ్యవసాయ బావిలో పడి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్ పట్టణ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. -
కొట్లాడి అలసిపోయా
[ 11-05-2024]
అందుబాటులో ఉండి సేవలందించినా ఓడగొట్టారు, ఎన్నికల్లో కొట్లాడి కొట్లాడి అలసిపోయా ఇక ఓపిక లేదంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి సాగు నీరందిస్తాం
[ 11-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి సమస్య పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి, కాలువ చివరి ఆయకట్టు వరకు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 11-05-2024]
రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా దగా చేసిన కాంగ్రెస్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ పేర్కొన్నారు. -
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
ప్రజలకు ఉచిత హామీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని, భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ అన్నారు. -
కోల్బెల్టు కేంద్రంగా అభ్యర్థుల వ్యూహాలు
[ 11-05-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి కోల్బెల్టు ప్రాంతాలు ప్రచార కేంద్రాలుగా మారాయి. అభ్యర్థులు తమ వ్యూహాలను ఇక్కడి నుంచే రచిస్తున్నారు. -
గెలుపే ఎజెండా.. కునుకు లేకుండా..
[ 11-05-2024]
ప్రచారం చివరి రోజుకు వచ్చేసింది.. సభలు.. సమావేశాలు.. చేరికలతో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు.. ముఖ్య నాయకులకు కంటిమీద కునుకు కరవైంది..
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్