విదేశాల్లో ఉన్నా వదిలేదే లే!
కరీంనగర్ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు.
భూ దందారాయుళ్లపై పోలీసుల నజర్
ఈనాడు, కరీంనగర్ : కరీంనగర్ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు. ఇలా కేసు నమోదై కొన్నాళ్లుగా అందుబాటులో లేని వారి వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. అమాయక ప్రజలను మోసం చేయడంతోపాటు డబ్బుల వసూళ్లకు పాల్పడిన తీరుతో వరుసగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదవుతున్నాయి. దాదాపుగా 1,800 మంది వరకు భూ బాధితులు వేర్వేరుగా తమ సమస్యల్ని సీపీ దృష్టికి వివరిస్తూ ఫిర్యాదులు అందజేశారు. దీంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) ఏర్పాటు చేసి భూ మాఫియా ఆగడాలపై సీపీ అభిషేక్ మహంతి ప్రత్యేక నిఘా పెట్టించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, ఆధారాలు సేకరించి కొందరు కార్పొరేటర్లతోపాటు కీలకమైన నాయకుల్ని కటకటాల్లోకి నెట్టారు. ఈ సందర్భంలోనే నమోదైన కొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్న కొందరు పరారీలో ఉన్నారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు విదేశాల్లో తలదాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు వారి ఇళ్లకు వెళ్లి చెప్పి చూశారు. అయినా వారు స్వదేశానికి రాకపోవడంతో వారికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా దాదాపు 10కిపైగా ఫిర్యాదులు వచ్చిన ఓ నాయకుడు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఈ తరహా చర్యలకు సిద్ధమవుతున్నారు. రెండ్రోజుల కిందట కూడా మరో నేతపై మూడో ఠాణాలో ఫిర్యాదు అందింది. గతంలోనూ భూ దందాలో భాగమయ్యాడని కేసు నమోదైన ఆయన కూడా దుబాయిలో తలదాచుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు వారి ఇంటికి వెళ్లి విచారించినట్లు తెలిసింది. ఇక కరీంనగర్ నియోజకవర్గ స్థాయిలోని ఓ కీలక నాయకుడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనను ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదిగిదిగో నవ లోకం
[ 11-05-2024]
ఉమ్మడి జిల్లాలో యువ రక్తం ఉరకలేస్తోంది.. ఆకాశమే హద్దంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. యువ ఓటర్లు దేశ భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. -
గులాబీ శ్రేణుల్లో జోష్
[ 11-05-2024]
సిరిసిల్ల పట్టణంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
గడప గడపకు కార్యకర్తలు
[ 11-05-2024]
ప్రధాన పార్టీల ముఖ్య నేతల ప్రచారాలు ముగిశాయి.. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.. పోలింగ్కు మధ్యలో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.. -
దూరమైనా తప్పక ఓటేస్తాం!
[ 11-05-2024]
ఇప్పటికీ అనేక అనుబంధ గ్రామాలకు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయి. 200 మంది ఓటర్లకుపైగా ఉన్నా.. రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లాల్సి వస్తోంది. -
రూ.20.93 లక్షల నగదు పట్టివేత
[ 11-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.20.93 లక్షల నగదును పట్టుకొని, సీజ్ చేసి ఎన్నికల పరిశీలన అధికారులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 11-05-2024]
వ్యవసాయ బావిలో పడి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్ పట్టణ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. -
కొట్లాడి అలసిపోయా
[ 11-05-2024]
అందుబాటులో ఉండి సేవలందించినా ఓడగొట్టారు, ఎన్నికల్లో కొట్లాడి కొట్లాడి అలసిపోయా ఇక ఓపిక లేదంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి సాగు నీరందిస్తాం
[ 11-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి సమస్య పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి, కాలువ చివరి ఆయకట్టు వరకు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 11-05-2024]
రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా దగా చేసిన కాంగ్రెస్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ పేర్కొన్నారు. -
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
ప్రజలకు ఉచిత హామీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని, భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ అన్నారు. -
కోల్బెల్టు కేంద్రంగా అభ్యర్థుల వ్యూహాలు
[ 11-05-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి కోల్బెల్టు ప్రాంతాలు ప్రచార కేంద్రాలుగా మారాయి. అభ్యర్థులు తమ వ్యూహాలను ఇక్కడి నుంచే రచిస్తున్నారు. -
గెలుపే ఎజెండా.. కునుకు లేకుండా..
[ 11-05-2024]
ప్రచారం చివరి రోజుకు వచ్చేసింది.. సభలు.. సమావేశాలు.. చేరికలతో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు.. ముఖ్య నాయకులకు కంటిమీద కునుకు కరవైంది..