logo

బెళగావిలో నేనే అభ్యర్థిని!

బెళగావి లోక్‌సభ ఎన్నికల్లోనే తానే అభ్యర్థిని అని భావించి ఓటర్లు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

Published : 29 Apr 2024 01:11 IST

మృణాల్‌కు సిద్ధరామయ్య మనోబలం 

కాంగ్రెస్‌ నాయకులను భారీ హారంతో సత్కరిస్తున్న స్థానిక నేతలు

బెళగావి, న్యూస్‌టుడే : బెళగావి లోక్‌సభ ఎన్నికల్లోనే తానే అభ్యర్థిని అని భావించి ఓటర్లు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. బెళగావి లోక్‌సభ అభ్యర్థి మృణాల్‌ హెబ్బాళ్కర్‌ తరఫున ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హుబ్బళ్లిలో ఓడిపోయిన జగదీశ్‌ శెట్టర్‌ను బెళగావిలోనూ ఓడించి, వెనక్కు పంపించాలని స్థానికులకు పిలుపునిచ్చారు. తానే ఇక్కడ పోటీ చేస్తున్నట్లు భావించి, ఎక్కువ మెజార్టీతో మృణాల్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బెళగావి అభివృద్ధికి మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ శ్రమిస్తున్నారని, ఆమె కుమారుడ్ని గెలిపిస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకకు వచ్చి అబద్ధాలు చెప్పి పారిపోతుంటారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మంత్రులు లక్ష్మీ హెబ్బాళ్కర్‌, సతీశ్‌ జార్ఖిహొళి, భైరతి సురేశ్‌, మాజీ మంత్రి వినయ్‌ కులకర్ణి, జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని