కాంగ్రెస్లో నాయకత్వం ద్విగుణీకృతం
కాంగ్రెస్లో నాయకులు, నాయకత్వం లేదంటూ ప్రధాని మోదీ ప్రచారం పచ్చి అబద్ధమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
కుష్ఠగిలో సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్లను గజమాలతో సత్కరిస్తున్న అభిమానులు
గంగావతి,న్యూస్టుడే: కాంగ్రెస్లో నాయకులు, నాయకత్వం లేదంటూ ప్రధాని మోదీ ప్రచారం పచ్చి అబద్ధమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కొప్పళ జిల్లా కుష్ఠగిలో సోమవారం ప్రజాధ్వని యాత్రలో పాల్గొని మాట్లాడారు. పదేళ్లలో అబద్ధాలు చెప్పే ప్రజలను ఆయన తప్పుదోవ పట్టించి అధికారంలోకి వస్తున్నారన్నారు. ప్రస్తుతం నాయకత్వం లేదనే కొత్త అబద్ధాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తమ పార్టీలో రాహుల్, ఖర్గే వంటి అనుభవజ్ఞులు ఉన్నారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికొకరు ప్రధాని అవుతారన్నదీ అబద్ధమే అన్నారు. రాష్ట్రంలో 2008 నుంచి 2013 దాకా అధికారంలో ఉన్న భాజపా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చలేదా అని ప్రశ్నించారు. తరువాత తాను ఐదేళ్ల సుస్థిర పాలన అందించినట్లు చెప్పారు. ఆరు దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్కు నాయకత్వ కొరత దుర్గతి పట్టలేదన్నారు. భాజపా అబద్ధాల కార్ఖానా అంటూ అదే వారి ఇంటిదేవుడు అన్నారు. పదేళ్లలో మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగానే నడిచారన్నారు. భాజపా నలభైశాతం అవినీతి దర్యాప్తునకు కమిషన్ వేశామంటూ దోషులుగా తేలితే కఠినచర్యలు తప్పవన్నారు. మోదీకి ఎన్నికలపుడే రాష్ట్రం గుర్తుకొస్తుందంటూ అతివృష్టి, కరవు సందర్భాల్లో తిరిగి చూడలేదన్నారు. పారిశ్రామికవేత్తలకు రూ.16వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఆయనకు రైతుల కష్టాలు తెలియవన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, మంత్రులు శివరాజ్ తంగడిగి, భైరతి బసవరాజ్, బసవరాజ్ రాయరెడ్డి, అభ్యర్థి రాజశేఖర్ హిట్నాళ, అమరేగౌడ, రాఘవేంద్ర హిట్నాళ సంగణ్ణ కరడి పాల్గొన్నారు.
భాజపాకు మరోసారి అధికారం అసాధ్యం
కూడ్లిగిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేదికపై ఐక్యత భావం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, మంత్రి జమీర్ అహ్మద్ఖాన్
హొసపేటె : కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రాదన్న నిజం ప్రధాని మోదీకి అర్థమైంది. వారిలో ఇప్పటినుంచే నిరాశ, నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. విజయనగర జిల్లా కూడ్లిగిలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజాధ్వని-2 ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మోదీ మరోసారి ప్రధాని కాబోరని పలు సంస్థల సమీక్షల ద్వారా తేలింది. కాని వాటి వివరాలను మాధ్యమాల్లో ప్రకటించకుండా మోదీ అడ్డుకుంటున్నారని దెప్పిపొడిచారు. ఓటమి భయంతో మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, దీనిపై ఓటర్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.భాజపా కూటమికి 200 స్థానాలు దక్కితే అదే గగనమని వ్యంగమాడారు. మతాలు, కులాల నడుమ ఏదో ఓ సాకుతో చిచ్చు పెట్టడం భాజపాకు వెన్నతో పెట్టిన విద్యఅని ధ్వజమెత్తారు. పదేళ్లలో మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన కానుక శూన్యం. భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు పెద్ద అబద్ధాల కోరు. ఆయనతో ఏదీ సాధ్యంకాదని ఎద్దేవాచేశారు. రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం పట్టని మోదీ మరో సారి ప్రధాని కావడం అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలు, నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయని తేల్చిచెప్పారు. ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాం ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా తనకి ఓ అవకాశం ఇవ్వండని భాజపా అభ్యర్థి శ్రీరాములు ఓటర్లను ప్రాధేయపడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. మంత్రులు జమీర్ అహ్మద్ఖాన్, రామలింగారెడ్డి మాట్లాడారు. వేదికపైన అఖండ బళ్లారి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుబ్బళ్లిలో మరో దారుణం
[ 16-05-2024]
ప్రేమ.. రక్తం కళ్లచూస్తోంది. అభిమానం, త్యాగం మరచి రోషం, కక్షలు పెంచుకుంటోంది. ప్రేమంటూనే.. మొన్నటికి మొన్న కళాశాల ప్రాంగణంలోనే నేహా అనే విద్యార్థినిని ఓ యువకుడు కడతేర్చి విద్యాపురిగా పేరున్న కర్ణాటకలోని హుబ్బళ్లి నగరానికి రక్తపు మరకలు అంటించాడు. -
ప్రజ్వల్ దాగుడుమూతలు.. చివరి క్షణంలో టికెట్ రద్దు!
[ 16-05-2024]
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘హాసన సెక్స్స్కాండల్’ కేసులో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ లభించక ప్రత్యేక దర్యాప్తుదళం (సిట్) తలలు పట్టుకునే పరిస్థితి ఎదురవుతోంది. -
పాతికేళ్ల ప్రేమకు పెళ్లి ముడి
[ 16-05-2024]
ప్రజాపోరాటమే సుధ, మోహన్ కుమార్లను ఒక్క చోటుకు చేర్చింది. ఇద్దరూ కలిసి ప్రజా సమస్యలపై ఇన్నాళ్లూ పోరాటం కొనసాగించారు. ఇద్దరికీ అభిప్రాయాలు నచ్చి వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. -
జేఎస్ రెడ్డి సేవలు నిరుపమానం
[ 16-05-2024]
వయో సహజమైన అనారోగ్య సమస్యలతో ఇటీవల మరణించిన తెలుగు విజ్ఞాన సమితి పూర్వ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం బెంగళూరులో నివాళి అర్పించారు. -
పడమటి కనుమలకు హరిత తాపడం
[ 16-05-2024]
పడమటి కనుమల పేరు వింటేనే అంతులేని జీవవైవిధ్యత గుర్తుకు వస్తుంది. దేశంలోని జీవ వైవిధ్యతలో దాదాపు 25 శాతం ఈ కనుమల్లోనే ఉంది. మొత్తం 1.60 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ కనుమలు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడులతో సరిహద్దులు పంచుకుంటాయి. -
సిలికాన్ సిటీ.. చెత్త కుండీ
[ 16-05-2024]
ఉద్యాననగరి బెంగళూరు చెత్త కుండీలా మారిపోతోందని బయాకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ‘రహదారులపై ఎక్కడంటే అక్కడ చెత్త కనిపిస్తోంది. -
మెట్రోలో ముచ్చెమటలు
[ 16-05-2024]
నమ్మ మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. బోగీల సంఖ్య పెంచాలనే ప్రయాణికుల డిమాండుకు బీఎంఆర్సీఎల్ అధికారులు స్పందించడం లేదు. ప్రస్తుతం నిత్యం ఆరులక్షల మంది మెట్రో సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. -
బరిలోకి నారా ప్రతాపరెడ్డి
[ 16-05-2024]
ఈశాన్య పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి బుడా (బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార) మాజీ అధ్యక్షుడు నారా ప్రతాపరెడ్డి బుధవారం కలబురగిలో నామినేషన్ దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ గెలుపు
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్