ప్రజ్వల్ రాజకీయ భవితపై నీలినీడలు
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సొంతపార్టీ జనతాదళ్ నేతల నుంచే డిమాండ్లు వెల్లువెత్తడం అనూహ్య పరిణామంగా మారింది.
ప్రజ్వల్ రేవణ్ణను భాజపా నేతలు ఉపేక్షించారంటూ బెంగళూరు పీసీసీ కార్యాలయంలో వివరిస్తున్న మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్క లంబా, రాష్ట్ర అధ్యక్షురాలు పుష్పా అమర్నాథ్
హాసన, న్యూస్టుడే : లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సొంతపార్టీ జనతాదళ్ నేతల నుంచే డిమాండ్లు వెల్లువెత్తడం అనూహ్య పరిణామంగా మారింది. ఈ అంశంపై దళపతులు హెచ్.డి.దేవేగౌడ, కుమారస్వామి ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారన్న సమాచారం రాష్ట్రాన్ని కుదిపేసే అంశం. మరోవైపు.. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించేందుకు ‘సిట్’ అధికారులు సాంకేతికంగా ముందడుగు వేశారు. బీకే సింగ్ నేతృత్వంలోని సుమన్ పన్నేకర్, సీమాలాట్కర్లతో కూడిన దర్యాప్తు బృంద అధికారులు హొళెనరసీపుర ఠాణాలో కేసు నమోదు చేసిన బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. లైంగిక దౌర్జన్యం జరిగిన రేవణ్ణ నివాసంలోనూ మహజరు నిర్వహించిన అనంతరం రేవణ్ణ, ప్రజ్వల్ను విచారిస్తారు. సిట్ అధికారులు పెన్డ్రైవ్లు, ఇతర సాక్ష్యాలను సేకరించి, దర్యాప్తు చేస్తున్నట్లు హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ తెలిపారు. అదే సమయంలో.. తమను అరెస్టు చేయకుండా విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హెచ్డీ రేవణ్ణ న్యాయస్థానంలో అర్జీ వేసుకునేందుకు సన్నాహాలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం విదేశాలకు వెళ్లాలని ప్రజ్వల్ ముందుగా నిర్ణయించుకున్నారని, కేసు నమోదు కావడంతోనే పరారయ్యాడనేది అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తునకు భయపడడం లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల కిందటి సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయాలు, కుట్ర కోణం ఉన్నట్లు ఆరోపించారు.
ఉపేక్షించనేల?
ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జనతాదళ్ నేత, గురుమఠ్కల్ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర డిమాండు చేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి ఆయన ఓ లేఖ రాశారు. వరికంకి తలపై పెట్టుకున్న మహిళ చిహ్నం ఉన్న మన పార్టీలో ఇలా మహిళలపై లోక్సభ సభ్యుడు లైంగిక దౌర్జన్యానికి పాల్పడడం సిగ్గు చేటని ఆక్రోశించారు. అశ్లీల వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మేమంతా ఓటర్లకు ముఖం చూపించేందుకు సిగ్గు పడవలసి వస్తోందని మరో ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ వ్యాఖ్యానించారు. విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇంటి నుంచి బయటకు రావడం లేదని ఆయన ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రియాంక నిప్పులు
ప్రజ్వల్పై కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన జ్వాల రగిలించారు. పీసీసీ తన ఎక్స్ కార్ప్ ఖాతాలో మోదీ తీరును విమర్శించింది. ప్రజ్వల్ వ్యవహార శైలిని గత ఏడాది డిసెంబరులోనే అధిష్ఠానం దృష్టికి భాజపా నాయకుడు దేవరాజేగౌడ తీసుకువెళ్లినా, ఆ విషయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించింది. ఎన్నికలకు పది రోజుల ముందుగా ప్రజ్వల్ను పొగుడుతూ చేసిన ప్రసంగాలు మర్చిపోయారా అంటూ మోదీపై ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. ఈ వ్యవహారానికి దూరంగా ఉండాలని భాజపా నేతలు ఇప్పటికే తీర్మానించారు.
ఇన్నేళ్లూ మిన్నకున్నారే?
రేవణ్ణ, ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతూ వస్తే.. ఇన్నేళ్లు ఎందుకు మాట్లాడలేదని బాధితురాలి అత్త, ఇతర కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కుటుంబ సభ్యులు, భవానీ రేవణ్ణ తమకు పలు సందర్భాల్లో అండగా నిలిచారని చెప్పారు. హాసనలో వారు విలేకరులతో సోమవారం మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసిన బాధితురాలికి ఆర్థిక సాయం చేస్తామని ఎవరో వెనుక నిలబడి కేసు పెట్టించారని ఆరోపించారు. ఎన్నికల సమయం కావడంతోనే ఈ ఆరోపణలు చేయించారని విమర్శలు గుప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుబ్బళ్లిలో మరో దారుణం
[ 16-05-2024]
ప్రేమ.. రక్తం కళ్లచూస్తోంది. అభిమానం, త్యాగం మరచి రోషం, కక్షలు పెంచుకుంటోంది. ప్రేమంటూనే.. మొన్నటికి మొన్న కళాశాల ప్రాంగణంలోనే నేహా అనే విద్యార్థినిని ఓ యువకుడు కడతేర్చి విద్యాపురిగా పేరున్న కర్ణాటకలోని హుబ్బళ్లి నగరానికి రక్తపు మరకలు అంటించాడు. -
ప్రజ్వల్ దాగుడుమూతలు.. చివరి క్షణంలో టికెట్ రద్దు!
[ 16-05-2024]
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘హాసన సెక్స్స్కాండల్’ కేసులో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ లభించక ప్రత్యేక దర్యాప్తుదళం (సిట్) తలలు పట్టుకునే పరిస్థితి ఎదురవుతోంది. -
పాతికేళ్ల ప్రేమకు పెళ్లి ముడి
[ 16-05-2024]
ప్రజాపోరాటమే సుధ, మోహన్ కుమార్లను ఒక్క చోటుకు చేర్చింది. ఇద్దరూ కలిసి ప్రజా సమస్యలపై ఇన్నాళ్లూ పోరాటం కొనసాగించారు. ఇద్దరికీ అభిప్రాయాలు నచ్చి వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. -
జేఎస్ రెడ్డి సేవలు నిరుపమానం
[ 16-05-2024]
వయో సహజమైన అనారోగ్య సమస్యలతో ఇటీవల మరణించిన తెలుగు విజ్ఞాన సమితి పూర్వ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం బెంగళూరులో నివాళి అర్పించారు. -
పడమటి కనుమలకు హరిత తాపడం
[ 16-05-2024]
పడమటి కనుమల పేరు వింటేనే అంతులేని జీవవైవిధ్యత గుర్తుకు వస్తుంది. దేశంలోని జీవ వైవిధ్యతలో దాదాపు 25 శాతం ఈ కనుమల్లోనే ఉంది. మొత్తం 1.60 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ కనుమలు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడులతో సరిహద్దులు పంచుకుంటాయి. -
సిలికాన్ సిటీ.. చెత్త కుండీ
[ 16-05-2024]
ఉద్యాననగరి బెంగళూరు చెత్త కుండీలా మారిపోతోందని బయాకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ‘రహదారులపై ఎక్కడంటే అక్కడ చెత్త కనిపిస్తోంది. -
మెట్రోలో ముచ్చెమటలు
[ 16-05-2024]
నమ్మ మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. బోగీల సంఖ్య పెంచాలనే ప్రయాణికుల డిమాండుకు బీఎంఆర్సీఎల్ అధికారులు స్పందించడం లేదు. ప్రస్తుతం నిత్యం ఆరులక్షల మంది మెట్రో సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. -
బరిలోకి నారా ప్రతాపరెడ్డి
[ 16-05-2024]
ఈశాన్య పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి బుడా (బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార) మాజీ అధ్యక్షుడు నారా ప్రతాపరెడ్డి బుధవారం కలబురగిలో నామినేషన్ దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM