భాజపాను గెలిపిస్తే పెనుముప్పు
‘భాజపా ఈసారి 400సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పార్టీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోల్పోయినట్లే’నని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను హెచ్చరించారు.
సేడం సభలో రేవంత్రెడ్డి ధ్వజం
ప్రసంగిస్తున్న ప్రియాంకా గాంధీ
ఈనాడు, బెంగళూరు : ‘భాజపా ఈసారి 400సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పార్టీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోల్పోయినట్లే’నని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్ణాటకలోని కలబురగి జిల్లా సేడంలో ఆయన మాట్లాడారు. భాజపా నేతలకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కారు వస్తేనే రాజ్యాంగ, రిజర్వేషన్ వ్యవస్థలకు రక్షణ సాధ్యమన్నారు. కాంగ్రెస్లో ఓ సాధారణ కార్యకర్తను కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టవచ్చని మల్లికార్జున ఖర్గే నిరూపించారని వివరించారు. గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షాలకు ఇచ్చిన మద్దతే ఇక్కడా మల్లికార్జున ఖర్గేకు దక్కాలని రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. కర్ణాటకలో గత లోక్సభ ఎన్నికల్లో భాజపా సభ్యులు 25 మంది గెలిచినా వారికి దక్కింది ఒక కేబినెట్ మంత్రి పదవి మాత్రమేనన్నారు. గుజరాత్లో 26 మంది ఎంపీల్లో ఏడుగురికి మంత్రి పదవులు దక్కాయని తప్పుపట్టారు. ఇది కర్ణాటకకు జరిగిన అన్యాయమని రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి కరవు పరిహారం, తాగునీటి కోసం ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వని భాజపా మళ్లీ ఓట్లడిగేందుకు మీ ముందుకు వస్తుందన్నారు.
ఎవరికీ భయపడను
గతంలో నాపై ఈడీ, ఐటీ అధికారులను పంపిన కేంద్రం ఇప్పుడు దిల్లీ పోలీసులతో నోటీసులు ఇప్పించే ప్రయత్నం చేస్తోందని రేవంత్రెడ్డి ఆరోపించారు. సామాజిక మాధ్యమంలో ఏదో పోస్ట్ చేశారన్న నెపంతో నాపై దిల్లీ పోలీసులను పంపారని తప్పుపట్టారు. మోదీ గారూ.. నేను ఇలాంటి బెదిరింపులకు భయపడనంటూ సవాలు చేశారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేస్తే ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉన్నారని వివరించారు. ‘నేను మీ పక్కనే ఉంటాను. మీకేదైనా అవసరం వస్తే ఓ ఫోను చేయండి వచ్చి వాలుతాను. లేదా హైదరాబాద్కు వచ్చిన నన్ను కలవండి’ అంటూ రేవంత్ భరోసా ఇచ్చారు.
సేడం సభలో మాట్లాడుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. చిత్రంలో రేవంత్రెడ్డి, ప్రియాంక తదితరులు
‘దేశానికి ఎంతో మంది ప్రధానులు వచ్చారు. వారంతా సత్యమార్గంలో నడిచారు. మోదీ మాత్రం ఏమీ చేయలేదు’ అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తప్పుపట్టారు. సేడం సభలో ఆమె ప్రసంగిస్తూ మహిళల మంగళసూత్రాల గురించి పదేపదే మాట్లాడే ప్రధాని మోదీ ఎన్డీఏ నేత ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆ వ్యక్తి తరఫున ప్రచారం చేసిన మోదీ, అమిత్ షాలు నేడు ఏం బదులిస్తారని ప్రశ్నించారు. ఒలింపిక్స్ క్రీడాకారులను వేధించినా, మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడినా మోదీ మౌనంగా ఉంటారని నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని రద్దు చేయటం, రైతుల రుణమాఫీకి నిధులు లేవని చెప్పే కేంద్ర సర్కారు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడిదారుల రుణాలు మాఫీ చేసిందని ఆరోపించారు. ఇదే సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అమలు చేయకుంటే మోదీ ప్రధాని, అమిత్ షా కేంద్ర మంత్రి అయ్యేవారు కాదన్నారు. వీరు నిత్యం కాంగ్రెస్ను విమర్శించటం తప్ప ప్రజలకు ఏం చేశారో వివరించరని అసహనం వ్యక్తం చేశారు. మేము అధికారంలోనికి వస్తే నారీ, యువ, రైతులు, శ్రామికులు, జాతులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. కలబురగి అభ్యర్థి రాధాకృష్ణ దొడ్డమని తరఫున ప్రచారం చేపట్టిన ఈ సభలో రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యుడు రణ్దీప్ సింగ్ సుర్జేవాలా, పలువురు రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుబ్బళ్లిలో మరో దారుణం
[ 16-05-2024]
ప్రేమ.. రక్తం కళ్లచూస్తోంది. అభిమానం, త్యాగం మరచి రోషం, కక్షలు పెంచుకుంటోంది. ప్రేమంటూనే.. మొన్నటికి మొన్న కళాశాల ప్రాంగణంలోనే నేహా అనే విద్యార్థినిని ఓ యువకుడు కడతేర్చి విద్యాపురిగా పేరున్న కర్ణాటకలోని హుబ్బళ్లి నగరానికి రక్తపు మరకలు అంటించాడు. -
ప్రజ్వల్ దాగుడుమూతలు.. చివరి క్షణంలో టికెట్ రద్దు!
[ 16-05-2024]
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘హాసన సెక్స్స్కాండల్’ కేసులో కీలక నిందితుడు- ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ లభించక ప్రత్యేక దర్యాప్తుదళం (సిట్) తలలు పట్టుకునే పరిస్థితి ఎదురవుతోంది. -
పాతికేళ్ల ప్రేమకు పెళ్లి ముడి
[ 16-05-2024]
ప్రజాపోరాటమే సుధ, మోహన్ కుమార్లను ఒక్క చోటుకు చేర్చింది. ఇద్దరూ కలిసి ప్రజా సమస్యలపై ఇన్నాళ్లూ పోరాటం కొనసాగించారు. ఇద్దరికీ అభిప్రాయాలు నచ్చి వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. -
జేఎస్ రెడ్డి సేవలు నిరుపమానం
[ 16-05-2024]
వయో సహజమైన అనారోగ్య సమస్యలతో ఇటీవల మరణించిన తెలుగు విజ్ఞాన సమితి పూర్వ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం బెంగళూరులో నివాళి అర్పించారు. -
పడమటి కనుమలకు హరిత తాపడం
[ 16-05-2024]
పడమటి కనుమల పేరు వింటేనే అంతులేని జీవవైవిధ్యత గుర్తుకు వస్తుంది. దేశంలోని జీవ వైవిధ్యతలో దాదాపు 25 శాతం ఈ కనుమల్లోనే ఉంది. మొత్తం 1.60 లక్షల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ కనుమలు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడులతో సరిహద్దులు పంచుకుంటాయి. -
సిలికాన్ సిటీ.. చెత్త కుండీ
[ 16-05-2024]
ఉద్యాననగరి బెంగళూరు చెత్త కుండీలా మారిపోతోందని బయాకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ‘రహదారులపై ఎక్కడంటే అక్కడ చెత్త కనిపిస్తోంది. -
మెట్రోలో ముచ్చెమటలు
[ 16-05-2024]
నమ్మ మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. బోగీల సంఖ్య పెంచాలనే ప్రయాణికుల డిమాండుకు బీఎంఆర్సీఎల్ అధికారులు స్పందించడం లేదు. ప్రస్తుతం నిత్యం ఆరులక్షల మంది మెట్రో సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. -
బరిలోకి నారా ప్రతాపరెడ్డి
[ 16-05-2024]
ఈశాన్య పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి బుడా (బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార) మాజీ అధ్యక్షుడు నారా ప్రతాపరెడ్డి బుధవారం కలబురగిలో నామినేషన్ దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?