తెలుగు రాష్ట్రాలకు ఓటర్ల పయనం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓటు హక్కు ఉన్న వారు బెంగళూరు నుంచి శుక్రవారం సాయంత్రం తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. భద్రత కోసం పోలీసులు, హోం గార్డులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది.
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓటు హక్కు ఉన్న వారు బెంగళూరు నుంచి శుక్రవారం సాయంత్రం తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. భద్రత కోసం పోలీసులు, హోం గార్డులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది. బసవజయంతికి శుక్రవారం సెలవు కాగా, రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉన్నాయి. సోమవారం సెలవు తీసుకుని ఆయా కంపెనీల ఉద్యోగులు తమ ఊళ్లకు వెళ్లారు. కొందరు గురువారం రాత్రే నగరం విడిచి వెళ్లారు. విశాఖ, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లవలసిన వారే ఎక్కువ మంది తమ ప్రాంతాలకు వెళ్లగా, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, విజయవాడ, గుంటూరుకు వెళ్లేందుకు ఆదివారం రాత్రికి బస్సు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు కేఎస్ ఆర్టీసీ కూడా ఆదివారం అదనపు బస్సులను సమకూర్చింది. కేఎస్ఆర్టీసీ కర్ణాటకలో కొన్ని సర్వీసులను రద్దు చేసి, ఆంధ్రప్రదేశ్కు నడిపేందుకు చర్యలు తీసుకుందన్నారు. కర్ణాటక సరిహద్దులలోని నియోజకవర్గాల ఓటర్లు బృందంగా బస్సులు, టెంపో ట్రావెలర్ బుక్ చేసుకుని వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. బెంగళూరుతో పాటు తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి, రాయచూరు, బీదర్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన వారు కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్షణక్షణం.. ఉత్కంఠే!
[ 04-06-2024]
విధానసభ ఎన్నికలు ముగిసి ఏడాది గడిచిందో లేదో అదే స్థాయి ప్రతిష్ఠాత్మకమైన లోక్సభ ఎన్నికల తుది ఘట్టం రానే వచ్చింది. రాష్ట్రంలో ఏప్రిల్ 26, మే 7న నిర్వహించిన రెండు విడతల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. -
రాత్రంతా.. కుండపోత వాన
[ 04-06-2024]
గాలి.. వాన.. భీకర ఉరుములు.. భయపెట్టే మెరుపులు.. బెంగళూరు నగరాన్ని వణికించాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు రహదారులు వాగులుగా మారాయి. భారీ గాలికి చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. -
వేగంగా బెంగళూరు రేవ్ పార్టీ కేసు విచారణ
[ 04-06-2024]
నగర శివార్లలో ఇటీవల సంచలనానికి కారణమైన రేవ్పార్టీలో పాల్గొన్న వారికి మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడనే ఆరోపణపై దేవరజీవనహళ్లి నివాసి ఇమ్రా షరీఫ్ అనే వ్యక్తిని సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
జోరుగా నామినేషన్ల దాఖలు
[ 04-06-2024]
విధానసభ నుంచి విధాన పరిషత్తులోని 11 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు కాంగ్రెస్, భాజపా, జనతాదళ్ అభ్యర్థులు సోమవారం నామపత్రాలను దాఖలు చేశారు. -
పెద్దలసభ ఎన్నికలు ప్రశాంతం
[ 04-06-2024]
విధానపరిషత్తులో ఖాళీగా ఉన్న మూడు ఉపాధ్యాయుల, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలకు సోమవారం శాంతియుతంగా ఎన్నికలు పూర్తయ్యాయి. -
క్షుద్రపూజలు ఒట్టిమాట
[ 04-06-2024]
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాశనాన్ని కోరుకుంటూ కేరళలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నేనే పూజలు చేయించానని జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఖండించారు. -
భారీ వర్షం.. పెను విపత్తు
[ 04-06-2024]
ఉద్యాననగరి.. చిగురుటాకులా వణికిపోయింది. రాష్ట్ర మంతా ఆదివారం రాత్రి వర్షాలతో మురిసిపోయింది. ఖరీఫ్ ప్రారంభానికి అవసరమైన వానలు వచ్చాయన్న ఆనందం ఓవైపు- ఇప్పటికే చేతికందాల్సిన ఉద్యానపంటలు నేలవాలాయనే ఆందోళన మరోవైపు చుట్టుముట్టడం ప్రకృతి వైపరిత్యానికి ప్రతీక. -
ప్రజ్వల్కు వైద్య పరీక్షలు
[ 04-06-2024]
లైంగిక దౌర్జనాలకు పాల్పడిన ఆరోపణలతో అరెస్టయిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు సోమవారం బౌరింగ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉమ్మడి కడప జిల్లాలో గెలిచేదెవరు... ఓడేదెవరు..?
-
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
-
ఉత్కంఠ మలుపుల్లో హిమాచల్ రాజకీయం
-
టెట్ మార్కుల కేటాయింపు ఎలా?
-
నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టిస్తారా?
-
ఏపీ చూపు.. ఉమ్మడి పశ్చిమగోదావరి వైపు.. ఇక్కడ అత్యధిక స్థానాలొచ్చిన పార్టీకే పట్టం