మూడు నెలలు ముహూర్తాలే లేవు!
రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు.
ఖమ్మం సాంస్కృతికం, న్యూస్టుడే: రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు. ఈనెల 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల ముహూర్తాలు లేవు. మౌఢ్యమి అంటే సూర్యుని కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడినప్పుడు శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని, దీని వల్ల ఆయా గ్రహాల గమనం తెలియకపోవడం వల్ల శుభ ముహూర్తాలు పెట్టడం కుదరని పండితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్ర పౌఢ్యమి ఈనెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు, గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగుతాయని తెలిపారు. జులై 6 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉండటంతో వివాహాది శుభకార్యాలు చేయకూడదని స్పష్టం చేశారు. గురు, శుక్ర మూఢాల్లో నూతన శుభకార్యక్రమాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.
మూగబోనున్న భాజాభజంత్రీలు
వేసవి కాలం వచ్చిందంటే సాధారణంగా వివాహాది శుభకార్యాల సందడి ఎక్కువగా ఉంటుంది. మే, జూన్, జులై నెలలతో పాటు ఆగస్టు 4వ తేదీ వరకు మూఢాల కారణంగా శుభ ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు, పూలుపండ్లు వంటివి చేసుకునే అవకాశం లేదు. దీంతో భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల చప్పుళ్లు, డీజే శబ్దాలు వంటి సందడి కన్పించదు. దీంతో వేద పురోహితులతో పాటు వ్యాపార వర్గాలు సైతం ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు, మేళతాళాల బృందాలు, ఫంక్షన్ హాళ్లు, ఇతర వివాహాలకు సంబంధించిన కొనుగోళ్లు మందగించిపోనున్నాయి.
గురు, శుక్ర మౌఢ్యమిలే కారణం...
ఆమంచి సురేశ్శర్మ, వేద పండితులు, ఖమ్మం
ఈ నెల 29 నుంచి మూడు నెలల పాటు శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. గురు, శుక్ర మౌఢ్యమి కారణంగా గ్రహాల గమనం తెలియకపోవడం వల్ల శుభ ముహూర్తాలు పెట్టే అవకాశం ఉండదు. వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో మంచి ముహూర్తాలు లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేడే
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఖమ్మం లోక్సభ స్థానంలో 35 మంది బరిలో నిలవగా 16,31,039 మంది ఓటేయనున్నారు. -
మీ ఓటు.. మీ స్వరం
[ 13-05-2024]
సమర్థవంతులైన ప్రజాప్రతినిధుల ఎన్నిక ఓటర్ల చైతన్యంతోనే సాధ్యమవుతుంది. -
వేరొకరు వేస్తే ఏం చేయాలి!
[ 13-05-2024]
ఓటరు తన ఓటుహక్కు వినియోగించుకునే సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను పరిశీలిస్తే.. -
పోలింగ్ ఏజెంట్లుగా ఎవరుండొచ్చు!
[ 13-05-2024]
ప్రతి పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా అభ్యర్థి పరిశీలించే అవకాశం ఉండదు. -
బాధ్యత భుజానికెత్తుకుంది..
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఓటర్లకు పలు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. -
ఎంపికలోనే అంతా..
[ 13-05-2024]
నేడే లోక్సభ పోలింగ్. ఎంపీగా గెలిచిన అభ్యర్థి దిల్లీ వెళ్లి కూర్చుంటారు. మనకు ఒరిగేదేముందనే అనాసక్తిని వీడాలి. -
మందు ప్రభావం అంతంతే..
[ 13-05-2024]
పోలింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుండగా ఆబ్కారీశాఖ అక్రమ మద్యం జాడ కోసం ముమ్మర తనిఖీలు చేపట్టింది. -
ఓటరన్నా.. మీ బాధ్యతలివే
[ 13-05-2024]
ఓటరు పోలింగ్ కేంద్రం సిబ్బంది, భద్రత బలగాలకు సహకరించాలి. -
అస్త్రశస్త్రాలు సిద్ధం..
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామగ్రిని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం సిబ్బందికి పంపిణీ చేశారు. -
ఇదిగో.. నోటా వాటా
[ 13-05-2024]
స్వేచ్ఛగా ఓటేసే హక్కును రాజ్యాంగం కల్పించింది. -
ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు: కలెక్టర్
[ 13-05-2024]
ఓటర్లను ప్రలోభపరిచినా, భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గౌతమ్ ఆదివారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నివాసంలో ఎంపీ స్వాతీమాలీవాల్పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి !
-
‘హమాస్ మద్దతుదారుల బృందంలోకి బైడెన్’.. ఆయుధ సరఫరా నిలిపివేతపై తీవ్ర వ్యతిరేకత
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్