logo

రాష్ట్ర భవిష్యత్తుకు ఆలోచించి ఓటెయ్యండి

జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 02:41 IST

మాట్లాడుతున్న బీవీ జయనాగేశ్వరరెడ్డి

గోనెగండ్ల, న్యూస్‌టుడే: జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గోనెగండ్ల మండలం కొత్త బోదెపాడు, తిప్పనూరు, వేముగోడు గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. తెదేపా అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతిఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు. జగనన్న భూరక్ష పథకం ద్వారా భూముల రీసర్వే పేరుతో రైతులకు తీరని నష్టం మిగిల్చిందన్నారు. గ్రామాల్లో శాశ్వత తాగునీటి పరిష్కారానికి రూ.13 కోట్లతో గాజులదిన్నె తాగునీటి పథకం తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేశారన్నారు. రైతులకు సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఆర్డీఎస్‌ కుడి కాల్వ పనులకు ప్రతిపాదనలు చేస్తే పట్టించుకోలేదని మండిపడ్డారు. కన్వీనర్‌ నజీర్‌, తిరుపతయ్య, హనుమంతు, రామాంజనేయులు, బడేసా, రాముడు, సందీప్‌నాయుడు, శ్రీనువాసులు, సంజీవయ్యఆచారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని