logo

తెదేపాతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం

తెదేపాతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

Published : 28 Apr 2024 02:41 IST

మాట్లాడుతున్న పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తెదేపాతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని కె.మార్కాపురం, పర్ల, బస్తిపాడు గ్రామాల్లో ఆమె శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కె.మార్కాపురం గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డితోపాటు పలువురు తెదేపాలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు పాండునాయుడు, రామనాయుడు, రాజు, సురేశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. కల్లూరు 32వ వార్డు ముజఫర్‌నగర్‌కు చెందిన నిర్మల, పెద్దక్క, ఆదిలక్ష్మి తదితరులు పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి సమక్షంలో శనివారం తెదేపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని