‘పశ్చిమ’ రైతుకు జగన్ ఉరి
నిత్యం కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత పల్లెలను సస్యశ్యామలం చేసేందుకు 2003లో తెదేపా ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి బీవీ మోహన్రెడ్డి రూ.177 కోట్లతో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
గురురాఘవేంద్రకు నిధులివ్వని ప్రభుత్వం
‘ఎత్తిపోయిన’ పథకాలు
న్యూస్టుడే, ఎమ్మిగనూరు, కర్నూలు జలమండలి
తెదేపా తెచ్చింది
నిత్యం కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంత పల్లెలను సస్యశ్యామలం చేసేందుకు 2003లో తెదేపా ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి బీవీ మోహన్రెడ్డి రూ.177 కోట్లతో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వృథాగా పోతున్న జలాలను 11 ఎత్తిపోతల పథకాలతోపాటూ సూగూరు జలాశయం ద్వారా నీటిని తోడి ఆయకట్టుకు పారించడం దీని ప్రధాన లక్ష్యం.
వైకాపా ఎండబెట్టింది
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, నిర్వహణకు బిల్లులు మంజూరు చేయడం లేదు.. అడిగితే అరకొరగా కేటాయిస్తున్నారు.. నిర్వహణ లేక మోటార్లు మూలన పడ్డాయి. పొలాలకు నీళ్లు అందకపోవడంతో గత ఐదేళ్లలో ఆయకట్టు రైతులు రూ.350 కోట్ల వరకు నష్టపోయారు.
మూడు నియోజకవర్గాలు
45,790 ఎకరాలు
గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు ద్వారా 5.373 టీఎంసీల తుంగభద్ర వరద జలాల(5.373 టీఎంసీలు)ను ఎత్తిపోసి 45,790 ఎకరాలకు సాగునీరు అందించాలి. కోసిగి, మంత్రాలయం, నందవరం, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, కోడుమూరు, సి.బెళగల్, కల్లూరు, గూడూరు మండలాల పరిధిలోని ఎల్లెల్సీ ఆయకట్టు పరిధిలో సాగునీరందించాలి. ఈ నేపథ్యంలో మూగలదొడ్డి, పూలచింత, చిలకలడొణ, సోగనూరు, కృష్ణదొడ్డి, రేమట, మునగాల, చింతమాన్పల్లె, దుద్ది, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించారు. నదీలో నీళ్లు ఉన్న సమయంతోపాటు పొలాలకు నీటిని తరలించాలి.
కేటాయింపులకే పరిమితం
విద్యుత్తు సమస్యతోపాటు, బిల్లుల బకాయిలపై జగన్ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. నిర్వహణ లేక విద్యుత్తు మోటార్లు సక్రమంగా పని చేయడం లేదు. సుమారు రూ.150 కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నాయని 2023లో ఎమ్మిగనూరు గురురాఘవేంద్ర ప్రాజెక్టు కార్యాలయాలకు కరెంటు నిలిపివేశారు. ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తదితర ప్రజాప్రతినిధులు నేరుగా ఐఏబీ సమావేశంలో నిధుల కోసం గొడవ పడ్డారు. దీంతో గురురాఘవేంద్ర ప్రాజెక్టు నిర్వహణకు గతేడాది అరకొరగా రూ.15 కోట్లు నుంచి రూ.20 కోట్ల వరకు నిధులు కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఈ నిధులు విడుదలైంది లేదు.
చుక్కనీరు రాలేదు - తిక్కన్న, మాచాపురం
నాకు చిలకలడొణ ఎత్తిపోతల పథకం కింద ఐదెకరాల పొలం ఉంది. ఐదేళ్లలో పంట చేతికొచ్చే సమయానికి పంట దిగుబడులకు సాగునీరు పారడం లేదు. ఏటా నష్టపోతున్నాం. పంట దిగుబడి వచ్చే సమయానికి నీళ్లు సరిగా రావు. పంపుహౌస్లో నీళ్లు సరిగా ఎత్తిపోయడం లేదు. ఐదేళ్లలో సాగునీరు సక్రమంగా రాకపోవడంతో సుమారు రూ.15 లక్షలకుపైగా నష్టపోయాను.
ఏడు వేల ఎకరాలు ప్రశ్నార్థకం
ఎమ్మిగనూరు పరిధిలో పూలచింత, చిలకలడొణ, సోగనూరు ఎత్తిపోతల పథకాల ద్వారా 13,131 ఎకరాలకు సాగునీరు పారించాలి. ఇందుకు రూ.45.89 కోట్లు ఖర్చు చేశారు. వీటికి రెండుచోట్ల పంప్హౌస్ ద్వారా నీటిని తోడేస్తున్నారు. ఇక్కడ విద్యుత్తు సరఫరా సక్రమంగా ఉండదు. మోటార్లు కాలిపోతే రూ.లక్షలు ఖర్చును రైతులు భరించాల్సి వస్తోంది.
ఐదేళ్లలో అరకొరగా నిధులు విడుదల చేయడంతో రైతులు మూడు ఎత్తిపోతల పథకాల పరిధిలో సుమారు రూ.35 లక్షలు సొంతంగా వసూళ్లు చేసుకుని ఖర్చు పెట్టుకున్నారు. దీని పరిధిలో సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరందడం లేదు. ఐదేళ్లలో రూ.250 కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. మూడింటిలో పూలచింత ఎత్తిపోతలకు నిర్మించిన రాతి కట్ట కిందకు జారిపోయింది. కాల్వలో నీరు వచ్చిన జలచౌర్యం చేస్తున్నారు. కట్ట పొడవునా ముళ్లపొదలు నిండిపోయాయి. సోగనూరు ఎత్తిపోతల పథకం ద్వారా అరకొరగా నీటిని పంపింగ్ చేస్తారు. పంప్హౌస్ వద్ద రాతి మట్టికట్ట సక్రమంగా నిర్మించలేదు. కాలువలు తీయకపోవడంతో చెరువులోకి నీరు పారడం లేదు. కట్ట కింది భాగంలో రాళ్లు ఊడి నీటిలో కలిశాయి. రాతికట్ట పొడవునా ముళ్ల పొదలతో నిండిపోయాయి.
రైతులకు రూ.550 కోట్ల నష్టం
మంత్రాలయం పరిధిలో దుద్ది, మూగలదొడ్డి, సూగూరు, బసలదొడ్డి, మాధవరం పథకాల కింద 35,065 ఎకరాల ఆయకట్టు సాగునీరు పారించాలి. ఇందుకు అప్పట్లో గత ప్రభుత్వం రూ.70 కోట్లు ఖర్చు పెట్టింది. వీటి ఎత్తిపోతల పథకాల నిర్వహణ అధ్వానంగా ఉంది. విద్యుత్తు బిల్లులు, మోటార్లు కాలిపోవడం, పథకాల్లో నిండిపోయిన ముళ్లపొదలు, రాతిపరుపు కుంగిపోవడం వంటి సమస్యలతో సాగునీరు అందడం లేదు. ఐదేళ్లలో రైతులు సుమారు రూ.350 కోట్లకుపైగా నష్టపోయారు. మాధవరం, దుద్ది, బసలదొడ్డి ఎత్తిపోతల పథకాలకు నిధులు విడుదల చేయకపోవడంతో కొన్ని నెలలుగా సాగునీటిని ఎత్తిపోయక చెరువులు వెలవెలబోయాయి.
కోడుమూరు పరిధిలో చింతమాన్పల్లె, రేమట, మునగాల, కృష్ణదొడ్డి ఎత్తిపోతల పథకాల్ని రూ.56 కోట్లతో నిర్మించి 16,080 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారించాలన్నది లక్ష్యం. వీటి పరిధిలో ఎత్తిపోతల పథకంలో భాగంగా మోటార్ల మరమ్మతులు, పూడికతో నిండిన కాలువలు, పథకం నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో సాగునీరు సక్రమంగా పారడం లేదు. 7 వేల ఆయకట్టుకు సాగునీరు పారక రూ.200 కోట్లకుపైగా నష్టపోతున్నారు.
పనిచేయని మోటార్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడా అంటివి.. యాడుంది ప్రగతి జాడ
[ 11-05-2024]
కరవు కాటకాలు, వలసలతో విలవిలలాడే కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ తెరపైకి తీసుకొచ్చిన ‘ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ (ఆడా)ను ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది -
రాష్ట్రాన్ని జగన్ ఎడారిగా మార్చారు
[ 11-05-2024]
జిల్లా ప్రజలకు ఏమి చేస్తామో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పలేకపోయారని.. పచ్చని చెట్లను నరికించి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చిన జగన్కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
చదువులమ్మ వాకిట అవస్థల పాఠం
[ 11-05-2024]
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ.. విద్యనందిస్తున్నామని చెబుతోంది జగన్ ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. -
ప్రగతి నినాదం... విధ్వంస విధానం.. ఏది కావాలో ఎంచుకో
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఘట్టం చివరి దశకొచ్చింది.. నేటితో ప్రచారం ముగియనుంది.. ‘తెర’ వెనక మంతనాలు మొదలు కానున్నాయి.. మహిళా సంఘాలకు ఎర వేస్తారు.. -
వైకాపాకు ఉద్యోగుల పోటు
[ 11-05-2024]
ప్రభుత్వం ఆటంకం కల్పించే యత్నాలను ఛేదించి.. హక్కు వినియోగానికి బారులు తీరారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రలోభాలకు లొంగలేదు.. బారులు తీరి పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు.. -
సాయంత్రం 6 వరకు పోలింగ్
[ 11-05-2024]
‘సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్కు ముందు 72 గంటలు అత్యంత కీలకం. -
సీమంతైనా మేలు చేయని జగన్
[ 11-05-2024]
కృష్ణా వెనుక జలాల ఆధారంగా నిర్మించిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన జల వనరులను గాలికొదిలేసింది. -
అరాచకపాలనకు ముగింపు పలకాల్సిందే: తెదేపా
[ 11-05-2024]
మే 13న జరిగే పోలింగ్తో రాష్ట్రంలో వైకాపా అరాచకపాలనకు ముగింపు పలకాల్సిందేనని డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. -
అవుకు అధికారంలో అలజడి
[ 11-05-2024]
నంద్యాల జిల్లా అవుకులో వైకాపా నాయకులు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ రసాబాసగా మారడంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. వైకాపా నాయకుల మధ్య ఆధిపత్యపు పోరే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. -
యువకుడి ఆత్మహత్య
[ 11-05-2024]
కర్నూలులోని ఎఫ్సీఐ కాలనీకి చెందిన గుండ్రెడ్డి జయచంద్రారెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మహేశ్వరరెడ్డి, మాధవి దంపతులు తమ పిల్లల చదువుల కోసం కర్నూలు వచ్చారు. -
పతాకస్థాయికి ప్రలోభాల పర్వం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు ప్రలోభాల ప్రక్రియకు తెరతీశారు. రాత్రి వేళల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటరు స్లిప్పులు పరిశీలించి డబ్బులు అందజేస్తున్నారు. -
ఎన్నికల నిర్వహణకు పంచాయతీ నిధులు
[ 11-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో పంచాయతీ నిధులన్నీ పక్కదారి పట్టాయి. గ్రామాల్లో కనీసం వసతులు కల్పించేందుకు వీలులేని పరిస్థితి. చాలా ప్రాంతాల్లో సర్పంచులు అప్పులు చేసి పనులు చేయించారు. -
వైకాపాకు ఉద్యోగుల పోటు
[ 11-05-2024]
ప్రభుత్వం ఆటంకం కల్పించే యత్నాలు ఛేదించి.. హక్కు వినియోగానికి బారులు తీరారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రలోభాలకు లొంగలేదు.. బారులు తీరి పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎర్ర బంగారానికి’ యుద్ధం సెగ.. కేజీ ధర @ రూ.5 లక్షలు
-
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా