logo

తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో  విఫలమైందని,  తెదేపాతోనే  రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు.

Published : 28 Apr 2024 12:49 IST

ఎమ్మిగనూరు  : ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో  విఫలమైందని,  తెదేపాతోనే  రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 23 వ వార్డులో  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం తెదేపా సూపర్ సిక్స్ పథకాలను  మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. అర్హులైన వారికి  నెలకు రూ.4 వేలు పింఛను  అందిస్తామన్నారు. ఆయన వెంట తెదేపా నాయకులు  కొండయ్య చౌదరి, రామ్ దాస్ గౌడ్, సుందర్ రాజు, తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని