కల్తీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారులను ఓడించాలి
నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : నంద్యాలలో నకిలీ విత్తనాలు, స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిలను ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై తీగల వంతెన బదులు వంతెనతో కూడిన బ్యారేజి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్లో కౌన్సిలర్ శ్యాంసుందర్లాల్ ఆధ్వర్యంలో ఆదివారం తెదేపాకు మద్దతుగా వివిధ వర్గాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ పోచా నకిలీ విత్తనాలతో ఎందరో రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. జగన్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదురుచూస్తోందన్నారు. నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే మాజీ ఎంపీ పెండెకంటి వెంకటసుబ్బయ్యను ఆదర్శంగా తీసుకుని ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే వారిని గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శులు తులసిరెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, కుడా మాజీ ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్ఐసీ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, భాజపా నాయకులు డా.ఇంటి ఆదినారాయణ, మేడా మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 16-05-2024]
నియోజకవర్గంలోని నందవరం మండలంలోని నాగలదిన్నె చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. -
స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
[ 16-05-2024]
పట్టణంలోని స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. -
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
[ 16-05-2024]
శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
క్రాస్ ఓటింగ్ భయం.. వైకాపాలో కలవరం
[ 16-05-2024]
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ‘అధికార’ పార్టీ నేతలను క్రాస్ ఓటింగ్ భయపెడుతోంది.. తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి వైకాపా కార్యకర్తలు స్వచ్ఛందంగా అండగా నిలిచినట్లు తెలుస్తోంది. -
రాయితీ కోత.. రైతుకు వాత
[ 16-05-2024]
పక్షం రోజుల్లో ఖరీఫ్ సీజన్ ఆరంభం కానుంది... ఇప్పటికే చిరు జల్లులు పలకరించాయి.. కర్షకులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తనాలు సమకూర్చుకొనే పనిలో పడ్డారు.. ఖరీఫ్ సీజన్కు అవసరమైన రాయితీ విత్తనాలను సిద్ధం చేసేందుకు వ్యవసాయశాఖ ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు అప్పగించింది. -
ఆళ్లగడ్డలో అలజడి
[ 16-05-2024]
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.. ఆళ్లగడ్డ పట్టణ ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఇంతలోనే మంగళవారం అర్ధరాత్రి అలజడి రేగింది.. మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ ప్రైవేటు అంగరక్షకుడిపై హత్యాయత్నం జరగడం కలకలం సృష్టించింది. -
నేతలకు రూ.కోట్లు కుమ్మరింత
[ 16-05-2024]
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపునకు గుట్టుచప్పుడు కాకుండా అడుగులు పడుతున్నాయి.. ఎన్నికల కోడ్కు కొన్ని రోజుల ముందుగా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో కొన్నింటికి బిల్లులు మంజూరయ్యాయి. -
ప్రజల పనులకు వెక్కిరింత
[ 16-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్ర‘జల’ కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. వేసవిలో 181 గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది.. నివారణకు రూ.23.12 కోట్లు నిధులు విడుదల చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులు (ఆర్డబ్ల్యూఎస్) ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి నివేదిక పంపించారు. -
స్ట్రాంగ్రూంలకు కట్టుదిట్టమైన భద్రత
[ 16-05-2024]
రాయలసీమ యూనివర్సిటీలోని మూడు బ్లాక్ల్లో 16 స్ట్రాంగ్రూంల్లో భద్రపరిచిన ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. బుధవారం ఆయన భద్రతా ఏర్పాట్లు పరిశీలించి వివరాలు వెల్లడించారు. -
తిరువీధిలో అహోబిలేశుడు
[ 16-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. అహోబిలేశుడు విశేష అలంకృతుడై వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. -
అలసత్వం వీడండి.. నాడు-నేడు పూర్తి చేయండి
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు కింద మొదలుపెట్టిన నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయి. మొదటి దశ పనులు 80 శాతం పూర్తయినప్పటికీ రెండో దశ పనులు మాత్రం 10 శాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. -
గెలుపే వారి గోల్
[ 16-05-2024]
క్రీడలపై ఆస్తి ఒక్కటే సరిపోదు.. నిత్యం సాధన చేయాలి. ఎంచుకున్న లక్ష్యం చేరుకోవాలనే తపనతో సాగాలి. ఆటలో గెలుపే కాదు.. గుర్తింపు ప్రధానమనే విషయం గుర్తించాలి. అవకాశాల కోసం ఎదురు చూడటం కాదు.. వెతుక్కుంటూ వెళ్లి అందుకోవాలి. -
ఫలితాలపై పందేల పోరు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల తంతు ముగియడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పందేలకు తెర లేసింది. రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వ్యాపారులు మొదలుకొని యువకుల వరకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు కాస్తున్నారు. -
అనధికార నిల్వలు.. ఆదాయానికి తూట్లు
[ 16-05-2024]
కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని షెడ్లలో కొందరు వ్యాపారులు వాము బస్తాలను అనధికారికంగా నిల్వ చేసుకుంటున్నారు. వాటిని తరలించాల్సి ఉన్నా ఇక్కడే నిల్వ చేస్తున్నారు. -
ఆదర్శం.. సేవారూపం
[ 16-05-2024]
ఆయన ఓ సాధారణ కూలి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అయినా ఆయన కూలికెళ్లగా రోజు వచ్చే రూ.వందల్లో కొంతమొత్తాన్ని పదుగురి సంక్షేమానికి వెచ్చిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మూగజీవాల పట్ల ప్రేమను చూపుతూ నేనున్నానని... మీకేం కాదని భరోసా ఇస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?