విలీనం చేసి.. జగన్ నిలువునా ముంచి
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి.
ప్రయోజనాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగులు
బకాయిల చెల్లింపులోనూ నిర్లక్ష్యం
కర్నూలులో ఆందోళన చేస్తున్న కార్మికులు (పాత చిత్రం)
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుంది. అవసరమైన సదుపాయాలు సమకూరుతాయి.
ముఖ్యమంత్రి చెప్పిన మాటలు..
కర్నూలు బి.క్యాంపు, న్యూస్టుడే : ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విలీనానికి ముందు కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారమయ్యేవి. విలీనం తర్వాత ఆర్థిక ప్రయోజనాలు ఆగిపోయాయి. జీతాలు సైతం సరిగా రాని పరిస్థితి ఏర్పడింది. చివరికి బకాయిల కోసం కార్మికులు ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోయామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 బస్సు డిపోలు ఉన్నాయి. 975 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రతిరోజూ సుమారు 3 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తుంటారు. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం విలీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మేలు జరుగుతుందని భావించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత ఉద్యోగులు, కార్మికులకు కష్టాలు తెలిసొచ్చాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేసినా ప్రయోజనం లేకపోయింది.
25 శాతం ఇచ్చి..
ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వేతన సవరణ చేపట్టింది. ఇప్పటివరకు బకాయిలు పూర్తి చెల్లించకపోవడం గమనార్హం. ఒకేసారి చెల్లించలేమని.. నాలుగు విడతల్లో ఇస్తామని పేర్కొంది. మొదటి విడతతో 25 శాతం చెల్లింపులు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో సుమారు 3,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కేవలం రూ.కోటి మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఇంకనూ రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు రావాల్సి ఉందని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడుతున్నారు.
- కర్నూలు-1, కర్నూలు-2 నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్, కోవెలకుంట్ల, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు తదితర డిపోలకు చెందిన కార్మికులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారు.
భత్యాలు కనుమరుగు
2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు పలు ప్రతిపాదనలు పెట్టింది. విలీనమైతే ఎన్నో ప్రయోజనాలు వస్తాయని ఆశలు రేకెత్తించింది. ఇందులో భాగంగా 2020 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రజారవాణా సంస్థగా మార్చి విలీనం చేసుకుంది. అప్పటినుంచి కార్మికులకు కష్టాలు అధికమయ్యాయి. ప్రభుత్వంలో విలీనం కాకముందు గ్యారేజీ ఉద్యోగులకు రాత్రి భత్యం, డీజిల్ పొదుపు చేసే కార్మికులకు ప్రతి నెలా ప్రోత్సాహకాలను అందరి సమక్షంలో అందించేవారు. అదనపు విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు అదనపు జీతం, గ్యారేజీలో పనిచేసేవారికి ప్రత్యేక అలవెన్స్, సాంకేతిక వేతనం, మహిళా కండక్టర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక నిధులు మంజూరయ్యేవి. ప్రస్తుతం ఇవేమీ వర్తించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- గతంలో ప్రతి రెండేళ్లకోసారి కండక్టర్లు, డ్రైవర్లకు మూడు జతల ఖాకీ దుస్తులు ఇచ్చేవారు. దీంతోపాటు పాదరక్షల కోసం సంస్థ రూ.వెయ్యి ఇచ్చేది. విలీనం తర్వాత గ్యారేజీ కార్మికులు, ఉద్యోగులు తమ సొంత డబ్బులతో బూట్లు, ఖాకీ దుస్తులు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది.
- బస్సులు దూర ప్రాంతాలకు వెళ్లి మధ్యలో ఆగిపోతే వాటికి మరమ్మతులు చేయించేందుకు.. గ్యారేజీ నుంచి బస్సు మొరాయించిన ప్రదేశానికి వెళ్లేందుకు మెకానిక్లకు డబ్బులు ఇచ్చేవారు. వారి సమయానికంటే ఎక్కువగా పనిచేస్తే ఓటీ వచ్చేది. ప్రస్తుతం ఇవేమీ మంజూరు కావడం లేదు.
కేసుల పరిష్కారమెప్పుడో..
ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వందల సంఖ్యలో కేసులు పెండింగ్ ఉన్నాయి. విధి నిర్వహణలో లోపాలు ఉన్న సమయంలో అధికారులు కేసులు నమోదు చేసేవారు. విలీనం కాకముందే డిపోలో ఉండే కార్మికుల కేసులు డిపో మేనేజర్స్థాయిలో పరిష్కారం అయ్యేవి. అక్కడ పరిష్కారంకాకుంటే డిప్యూటీ చీప్ మెకానికల్ ఇంజినీరు/డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్స్థాయిలో పరిష్కరించేవారు. రీజినల్ మేనేజర్దే తుది నిర్ణయం. 2020 తర్వాత పరిస్థితి దయనీయంగా మారింది. ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి.
ఆరోగ్య సేవలు అంతంతే..
ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వైద్యసేవలు అందించేందుకుగాను ఆర్టీసీ డిస్పెన్సరీ ఏర్పాటుచేశారు. ఇక్కడ అవసరమైనవారికి వైద్యసేవలు అందిస్తారు. ఆరోగ్య పరిస్థితులను బట్టి అక్కడ వైద్యుల సిఫారసు మేరకు కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే వైద్యానికయ్యే ఖర్చు మొత్త ఆర్టీసీ సంస్థ భరించేది. ఉద్యోగి తమ గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోయేది. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో కష్టాలు ఎదురయ్యాయి. ఏటా ప్రభుత్వానికి రూ.1,200 చెల్లించినా పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డెంగీ నివారణ దినోత్సవం.. అవగాహన ర్యాలీ
[ 16-05-2024]
గోనెగండ్లలోని ప్రభుత్వ వైద్యశాలలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం నిర్వహించారు. -
అహోబిలంలో ఘనంగా వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు
[ 16-05-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 16-05-2024]
నియోజకవర్గంలోని నందవరం మండలంలోని నాగలదిన్నె చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. -
స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
[ 16-05-2024]
పట్టణంలోని స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. -
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
[ 16-05-2024]
శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
క్రాస్ ఓటింగ్ భయం.. వైకాపాలో కలవరం
[ 16-05-2024]
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ‘అధికార’ పార్టీ నేతలను క్రాస్ ఓటింగ్ భయపెడుతోంది.. తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి వైకాపా కార్యకర్తలు స్వచ్ఛందంగా అండగా నిలిచినట్లు తెలుస్తోంది. -
రాయితీ కోత.. రైతుకు వాత
[ 16-05-2024]
పక్షం రోజుల్లో ఖరీఫ్ సీజన్ ఆరంభం కానుంది... ఇప్పటికే చిరు జల్లులు పలకరించాయి.. కర్షకులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తనాలు సమకూర్చుకొనే పనిలో పడ్డారు.. ఖరీఫ్ సీజన్కు అవసరమైన రాయితీ విత్తనాలను సిద్ధం చేసేందుకు వ్యవసాయశాఖ ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు అప్పగించింది. -
ఆళ్లగడ్డలో అలజడి
[ 16-05-2024]
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.. ఆళ్లగడ్డ పట్టణ ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఇంతలోనే మంగళవారం అర్ధరాత్రి అలజడి రేగింది.. మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ ప్రైవేటు అంగరక్షకుడిపై హత్యాయత్నం జరగడం కలకలం సృష్టించింది. -
నేతలకు రూ.కోట్లు కుమ్మరింత
[ 16-05-2024]
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపునకు గుట్టుచప్పుడు కాకుండా అడుగులు పడుతున్నాయి.. ఎన్నికల కోడ్కు కొన్ని రోజుల ముందుగా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో కొన్నింటికి బిల్లులు మంజూరయ్యాయి. -
ప్రజల పనులకు వెక్కిరింత
[ 16-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్ర‘జల’ కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. వేసవిలో 181 గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది.. నివారణకు రూ.23.12 కోట్లు నిధులు విడుదల చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులు (ఆర్డబ్ల్యూఎస్) ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి నివేదిక పంపించారు. -
స్ట్రాంగ్రూంలకు కట్టుదిట్టమైన భద్రత
[ 16-05-2024]
రాయలసీమ యూనివర్సిటీలోని మూడు బ్లాక్ల్లో 16 స్ట్రాంగ్రూంల్లో భద్రపరిచిన ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. బుధవారం ఆయన భద్రతా ఏర్పాట్లు పరిశీలించి వివరాలు వెల్లడించారు. -
తిరువీధిలో అహోబిలేశుడు
[ 16-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. అహోబిలేశుడు విశేష అలంకృతుడై వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. -
అలసత్వం వీడండి.. నాడు-నేడు పూర్తి చేయండి
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు కింద మొదలుపెట్టిన నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయి. మొదటి దశ పనులు 80 శాతం పూర్తయినప్పటికీ రెండో దశ పనులు మాత్రం 10 శాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. -
గెలుపే వారి గోల్
[ 16-05-2024]
క్రీడలపై ఆస్తి ఒక్కటే సరిపోదు.. నిత్యం సాధన చేయాలి. ఎంచుకున్న లక్ష్యం చేరుకోవాలనే తపనతో సాగాలి. ఆటలో గెలుపే కాదు.. గుర్తింపు ప్రధానమనే విషయం గుర్తించాలి. అవకాశాల కోసం ఎదురు చూడటం కాదు.. వెతుక్కుంటూ వెళ్లి అందుకోవాలి. -
ఫలితాలపై పందేల పోరు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల తంతు ముగియడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పందేలకు తెర లేసింది. రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వ్యాపారులు మొదలుకొని యువకుల వరకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు కాస్తున్నారు. -
అనధికార నిల్వలు.. ఆదాయానికి తూట్లు
[ 16-05-2024]
కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని షెడ్లలో కొందరు వ్యాపారులు వాము బస్తాలను అనధికారికంగా నిల్వ చేసుకుంటున్నారు. వాటిని తరలించాల్సి ఉన్నా ఇక్కడే నిల్వ చేస్తున్నారు. -
ఆదర్శం.. సేవారూపం
[ 16-05-2024]
ఆయన ఓ సాధారణ కూలి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అయినా ఆయన కూలికెళ్లగా రోజు వచ్చే రూ.వందల్లో కొంతమొత్తాన్ని పదుగురి సంక్షేమానికి వెచ్చిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మూగజీవాల పట్ల ప్రేమను చూపుతూ నేనున్నానని... మీకేం కాదని భరోసా ఇస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్