logo

ఉమ్మడి కూటమితోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం

ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 00:32 IST

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అఖిలప్రియ

గోవిందపల్లె (శిరివెళ్ల), న్యూస్‌టుడే: ఉమ్మడి కూటమితోనే ఏపీ అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడుస్తుందని నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. మండలంలోని వనికెన్‌దిన్నె, గోవిందపల్లె గ్రామాల్లో భూమా అఖిలప్రియ సోమవారం సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించడంతోపాటు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని తెదేపా ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం మాట్లాడుతు సీఎం జగన్మోహన్‌రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఎన్నికల్లో గెలిచి ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామంటూనే విద్యుత్తు బిల్లులను సాకుగా చూపి అర్హులను పథకాలకు దూరం చేశారని, వైకాపాలో మంత్రులు, ఎమ్మెల్యేలు అమలుకాని హామీలనిచ్చి ఎన్నికల్లో ఓట్లు అడిగే పరిస్థితులు లేకుండా చేసుకున్నారని విమర్శించారు. ఏపీలో ప్రజలందరూ మరోమారు సీఎంగా చంద్రబాబును చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెదేపా అధికారంలోకి రాగానే పార్టీలకు అతీతంగా అర్హులందరికి సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సంగిరెడ్డి నాగేశ్వరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రవిచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుబ్బరాయుడు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని