వంతెనలు కూలుతున్నా.. కునుకు వీడరా!
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు.
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు అని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. వంకలు, నదులపై నిర్మించిన వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నా జగన్ ఐదేళ్ల పాలనలో కనీసం వాటి మరమ్మతుకు అడుగు ముందుకు పడలేదు. దీంతో ఆ దారిలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు భయంభయంగా ప్రయాణం సాగించాల్సి వస్తోంది.
న్యూస్టుడే, బృందం
చెప్పినా పట్టించుకోరు:
బండిఆత్మకూరులో కుందూనదిపై నిర్మించిన వంతెన కింది భాగంలోని పిల్లర్లు దెబ్బతిన్నాయి. ఈ వంతెనను గత 30 సంవత్సరాల కిందట నిర్మించారు. అప్పటి నుంచి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. సమస్యను సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
రక్షణ జాతీయం
ఆళ్లగడ్డ, గ్రామీణం: బత్తలూరు-యర్రగుడిదిన్నె మధ్య 40వ జాతీయ రహదారిపై ఉన్న వంతెనకు రక్షణ గోడ ధ్వంసమైంది. వేగంతో వెళ్లే వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశముంది.
నేటికీ బ్రిటిష్ పాలనే..:
దేవనకొండ: కర్నూలు-బళ్లారి రహదారిలోని అలారుదిన్నె సమీపంలోని వంతెనను 1940లో బ్రిటిష్ వారు రూ.1.25లక్షలతో నిర్మించారు. వంతెన రక్షణ గోడలు శిథిలావస్థకు చేరాయి.
ప్రయాణం.. తప్పని అంతరాయం:
కొత్తపల్లి: దుద్యాల గ్రామ సమీపంలోని వంతెనకు రక్షణ గోడలు లేవు. వంతెన ఎత్తు తక్కువగా ఉండటంతో వర్షం వస్తే రహదారిపై నీరు ప్రవహిస్తుంది.
చినుకు పడితే.. వణుకే:
ఆత్మకూరు: ఆత్మకూరు-కొత్తపల్లికి వెళ్లే దారిలో వంతెన ఎత్తు తక్కువగా ఉండటంతో వర్షాలు కురిసినప్పుడు నీరు వంతెనపై ప్రవహిస్తుంది. ఆ దారిలో రాకపోకలు నిలిచిపోతున్నాయి.
పట్టించుకోని సర్కారు:
మద్దికెర-పత్తికొండ రహదారిలో బురుజుల వద్ద నిర్మించిన ప్రధాన వంతెనకు ఇరువైపులా వేసిన మట్టి పూర్తిగా కోతకు గురైంది. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలువురు వాహనచోదకులు ప్రమాదాలకు గురయ్యారు.
నాలుగేళ్లుగా ఇంతే.. :
బురుజుల-హోసూరు మధ్య ఉన్న కల్వర్టు శిథిలమై నాలుగేళ్లు గడిచింది. ఆర్అండ్బీ అధికారులు తాత్కాలిక మరమ్మతు పేరుతో మట్టివేసి పూడ్చేశారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారి వాగు పొంగి రహదారిపైకి వరద నీరు వస్తోంది.
పొంచి ఉన్న ప్రమాదం:
పత్తికొండ గ్రామీణం: చిన్నహుల్తి సమీపంలోని హంద్రీవాగుపై ఉన్న పురాతన వంతెన రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ఈ దారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మలుపు గమనించని వాహనాలు వాగులో పడే ప్రమాదముంది.
చోద్యం చూస్తున్నారు:
మంత్రాలయం గ్రామీణం: కౌతాళం మండలంలోని హాల్వి వద్ద కోసిగి రహదారిలో ఉన్న వంతెనకు రెండు వైపులా రక్షణ గోడలు లేకపోవడంతో వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారింది.
దెబ్బతిన్నా.. వదిలేశారు:
నంద్యాల బొమ్మలసత్రం: టంగుటూరు -బనగానపల్లికి వెళ్లే దారిలో అప్పలాపురం వద్ద దెబ్బతిన్న వంతెన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు
[ 16-05-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 16-05-2024]
నియోజకవర్గంలోని నందవరం మండలంలోని నాగలదిన్నె చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. -
స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
[ 16-05-2024]
పట్టణంలోని స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. -
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
[ 16-05-2024]
శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
క్రాస్ ఓటింగ్ భయం.. వైకాపాలో కలవరం
[ 16-05-2024]
నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ‘అధికార’ పార్టీ నేతలను క్రాస్ ఓటింగ్ భయపెడుతోంది.. తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి వైకాపా కార్యకర్తలు స్వచ్ఛందంగా అండగా నిలిచినట్లు తెలుస్తోంది. -
రాయితీ కోత.. రైతుకు వాత
[ 16-05-2024]
పక్షం రోజుల్లో ఖరీఫ్ సీజన్ ఆరంభం కానుంది... ఇప్పటికే చిరు జల్లులు పలకరించాయి.. కర్షకులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తనాలు సమకూర్చుకొనే పనిలో పడ్డారు.. ఖరీఫ్ సీజన్కు అవసరమైన రాయితీ విత్తనాలను సిద్ధం చేసేందుకు వ్యవసాయశాఖ ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు అప్పగించింది. -
ఆళ్లగడ్డలో అలజడి
[ 16-05-2024]
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.. ఆళ్లగడ్డ పట్టణ ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఇంతలోనే మంగళవారం అర్ధరాత్రి అలజడి రేగింది.. మాజీ మంత్రి, తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ ప్రైవేటు అంగరక్షకుడిపై హత్యాయత్నం జరగడం కలకలం సృష్టించింది. -
నేతలకు రూ.కోట్లు కుమ్మరింత
[ 16-05-2024]
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపునకు గుట్టుచప్పుడు కాకుండా అడుగులు పడుతున్నాయి.. ఎన్నికల కోడ్కు కొన్ని రోజుల ముందుగా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో కొన్నింటికి బిల్లులు మంజూరయ్యాయి. -
ప్రజల పనులకు వెక్కిరింత
[ 16-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్ర‘జల’ కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. వేసవిలో 181 గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది.. నివారణకు రూ.23.12 కోట్లు నిధులు విడుదల చేయాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులు (ఆర్డబ్ల్యూఎస్) ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి నివేదిక పంపించారు. -
స్ట్రాంగ్రూంలకు కట్టుదిట్టమైన భద్రత
[ 16-05-2024]
రాయలసీమ యూనివర్సిటీలోని మూడు బ్లాక్ల్లో 16 స్ట్రాంగ్రూంల్లో భద్రపరిచిన ఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జి.కృష్ణకాంత్ తెలిపారు. బుధవారం ఆయన భద్రతా ఏర్పాట్లు పరిశీలించి వివరాలు వెల్లడించారు. -
తిరువీధిలో అహోబిలేశుడు
[ 16-05-2024]
వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. అహోబిలేశుడు విశేష అలంకృతుడై వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. -
అలసత్వం వీడండి.. నాడు-నేడు పూర్తి చేయండి
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు కింద మొదలుపెట్టిన నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయి. మొదటి దశ పనులు 80 శాతం పూర్తయినప్పటికీ రెండో దశ పనులు మాత్రం 10 శాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. -
గెలుపే వారి గోల్
[ 16-05-2024]
క్రీడలపై ఆస్తి ఒక్కటే సరిపోదు.. నిత్యం సాధన చేయాలి. ఎంచుకున్న లక్ష్యం చేరుకోవాలనే తపనతో సాగాలి. ఆటలో గెలుపే కాదు.. గుర్తింపు ప్రధానమనే విషయం గుర్తించాలి. అవకాశాల కోసం ఎదురు చూడటం కాదు.. వెతుక్కుంటూ వెళ్లి అందుకోవాలి. -
ఫలితాలపై పందేల పోరు
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల తంతు ముగియడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పందేలకు తెర లేసింది. రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు, ఇతర వ్యాపారులు మొదలుకొని యువకుల వరకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోరుగా పందేలు కాస్తున్నారు. -
అనధికార నిల్వలు.. ఆదాయానికి తూట్లు
[ 16-05-2024]
కర్నూలు వ్యవసాయ మార్కెట్లోని షెడ్లలో కొందరు వ్యాపారులు వాము బస్తాలను అనధికారికంగా నిల్వ చేసుకుంటున్నారు. వాటిని తరలించాల్సి ఉన్నా ఇక్కడే నిల్వ చేస్తున్నారు. -
ఆదర్శం.. సేవారూపం
[ 16-05-2024]
ఆయన ఓ సాధారణ కూలి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అయినా ఆయన కూలికెళ్లగా రోజు వచ్చే రూ.వందల్లో కొంతమొత్తాన్ని పదుగురి సంక్షేమానికి వెచ్చిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మూగజీవాల పట్ల ప్రేమను చూపుతూ నేనున్నానని... మీకేం కాదని భరోసా ఇస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!