విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భాజపా అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాజోలి: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భాజపా అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎంపీ రాములు, ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఇటిక్యాల మండల కేంద్రంలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభిస్తారన్నారు. ఇటిక్యాల మండలంతో పాటు, ఎర్రవల్లి, మానవపాడు, వడ్డేపల్లి, రాజోలి మండలంలో పర్యటన ఉంటుందన్నారు. జిల్లా అధికారులు, మండల, వివిధ మోర్చా నాయకులు అందరూ కలిసి, విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, అలంపూర్ నియోజకవర్గ కన్వీనర్ మెడికల్ తిరుమల్ రెడ్డి, ఇటిక్యాల మండలం అధ్యక్షులు షేక్ అబ్దుల్లా తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
[ 16-05-2024]
రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన వర్షంలో పిడుగు పడింది. -
వ్యక్తిపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు
[ 16-05-2024]
పొలం కౌలు విషయంలో వ్యక్తిపై దాడి చేసిన ముగ్గురిపై గురువారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. -
మహిళ అదృశ్యంపై కేసు నమోదు
[ 16-05-2024]
ఓటు వేసేందుకు వచ్చిన మహిళ అదృశ్యమైన సంఘటనపై గురువారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. -
కళాశాల మంజూరు చేయాలని వినతి
[ 16-05-2024]
రాజోలి మండలానికి జూనియర్ కళాశాల మంజూరు చేయాలని కోరూతూ కాలేజీ సాధన సమితి సభ్యులు గురువారం మంత్రి జూపల్లి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి విన్నవించారు. -
జాతీయ డెంగీ నివారణ దినోత్సవ ర్యాలీ
[ 16-05-2024]
జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన రాజోలి లో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
నీటి సంపులో జారిపడి వ్యక్తి మృతి
[ 16-05-2024]
నీటి సంపులో జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. -
సారూ.. పాలనపై ఇక దృష్టి పెట్టరూ..!
[ 16-05-2024]
పాలమూరులో అధికారులు రెండు నెలలుగా సార్వత్రిక ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. జిల్లా స్థాయి అధికారులతోపాటు కింది స్థాయి సిబ్బంది వరకు ఎన్నికల పనిలోనే ఉన్నారు. అధికారులు ఎన్నికల్లో తలమునకలు కావడంతో గ్రామాలు, పురపాలికల్లో పాలన ఎక్కడికక్కడ ఆగిపోయింది. -
విద్యుత్తు పొదుపు.. ప్రగతికి మలుపు
[ 16-05-2024]
మనిషి జీవితాన్ని సరళతరం చేసిన గొప్ప ఆవిష్కరణ విద్యుత్తు. గృహోపకరణాల నుంచి చరవాణి వరకు అంతా కరంటు మయమే. ఐదు నిమిషాలు సరఫరా నిలిచిపోతే ఊపిరాడనంత పని అవుతోంది. వేసవిలో ఏసీలు, కూలర్ల వినియోగం అధికం కావడంతో బిల్లులు గుండె గుభేల్మనేలా చేస్తున్నాయి. -
జూరాలకు కృష్ణా జలాలు చేరేనా..
[ 16-05-2024]
వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ డ్యాం నుంచి తెలంగాణకు విడుదల చేసిన 1.9 టీంఎసీల కృష్ణా జలాలు బుధవారం జూరాల ప్రాజెక్టుకు చేరాయి. -
మేకప్ ఆర్టిస్టు దారుణ హత్య
[ 16-05-2024]
నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కార్మికనగర్ ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నిమ్స్మేకు చెందిన ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా యువకుడి ఛాతీ, కడుపులో, వీపుపై కత్తితో పలుమార్లు పొడిచి హత్యచేశారు. -
అనుత్తీర్ణుల సన్నద్ధత ఏదీ?
[ 16-05-2024]
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఒక్క నారాయణపేట జిల్లాలోనే మంచి ఫలితాలు వచ్చాయి. వేలాది మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. వీరందరికీ జూన్ 3వ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. -
ఈ చిన్నారి ఎవరో!
[ 16-05-2024]
రెండు నెలల వయసున్న పసికందును ఎవరో నిర్దాక్షిణ్యంగా జిల్లా ఆసుపత్రిలో వదిలివెళ్లడం అక్కడున్న తల్లులకు కంటతడి తెప్పించింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో జిల్లా ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు నెలల వయసున్న బాబును వదిలి వెళ్లారు. -
విద్యార్థుల వెతలు పట్టవా
[ 16-05-2024]
మరికల్ మండలం పస్పుల శివారులో నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయం నిర్మాణ పనులు ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చాయి. ఇంకా వెనుక భాగాన ప్రహరీ నిర్మించాల్సి ఉంది. ముందు భాగాన ర్యాంప్ పనులతో పాటు ప్రహరీ పూర్తి చేయాలి. -
రైతుల శ్రమ.. దళారులకు జమ
[ 16-05-2024]
కొల్లాపూర్ ప్రాంత మామిడిపండ్లకు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ప్రభుత్వపరంగా మార్కెటింగ్ సౌకర్యం లేక విక్రయాలకు తిప్పలు పడుతున్నారు. ఏటా దళారులకు విక్రయించి నష్టపోతూనే ఉన్నారు. ఈ సారి పూత మురిపించినా.. కాపు తగ్గి దిగుబడి 50శాతం కూడా రాలేదు. -
సమన్వయంతోనే ప్రశాంత ఎన్నికలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల్లో బందోబస్తు విధులు నిర్వహించి తిరిగి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న కేంద్ర సాయుధ బలగాల అధికారులను జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి బుధవారం సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. -
అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా డీసీసీబీ
[ 16-05-2024]
అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (డీసీసీబీ) ప్రగతి పథంలో సాగుతోందని బ్యాంకు ఇన్ఛార్జి ఛైర్మన్ కొరమోని వెంకటయ్య అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ సాధించిన ప్రగతిపై బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి
[ 16-05-2024]
జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేసి రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
ఏ మీట నొక్కారోనన్న ఆందోళన !
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఈవీఎంల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్కు కొద్దిసేపు ముందు ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్