logo

విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భాజపా అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Updated : 29 Apr 2024 18:13 IST

రాజోలి: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భాజపా అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎంపీ రాములు, ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఇటిక్యాల మండల కేంద్రంలో విజయ సంకల్ప యాత్ర ప్రారంభిస్తారన్నారు. ఇటిక్యాల మండలంతో పాటు, ఎర్రవల్లి, మానవపాడు, వడ్డేపల్లి, రాజోలి మండలంలో పర్యటన ఉంటుందన్నారు. జిల్లా అధికారులు, మండల, వివిధ మోర్చా నాయకులు అందరూ కలిసి, విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్,  అలంపూర్ నియోజకవర్గ కన్వీనర్ మెడికల్ తిరుమల్ రెడ్డి, ఇటిక్యాల మండలం అధ్యక్షులు షేక్ అబ్దుల్లా తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని