పర్యాటక ధామం.. శిల్పకళా తోరణం
సిద్దిపేట పర్యాటక ధామంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఎన్నో అందాలతో కోమటిచెరువు పర్యాటకులను ఆకర్షిస్తోంది. పట్టణానికి మణిహారంగా మారిన ఈ ప్రాంతం పర్యాటకానికి చిరునామాగా నిలుస్తోంది.
కోమటిచెరువు చెంతన రూ.25 కోట్లతో నిర్మాణం
శిల్పారామం నమూనా చిత్రాలు
న్యూస్టుడే, సిద్దిపేట: సిద్దిపేట పర్యాటక ధామంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఎన్నో అందాలతో కోమటిచెరువు పర్యాటకులను ఆకర్షిస్తోంది. పట్టణానికి మణిహారంగా మారిన ఈ ప్రాంతం పర్యాటకానికి చిరునామాగా నిలుస్తోంది. జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాల వారు సందర్శిస్తూ.. అబ్బురపడుతున్నారు. దీనికి మరో తలమాణికమైన హంగు సమకూరనుంది. మంత్రి హరీశ్రావు చొరవతో చెరువు చెంతన (బైపాస్ మార్గంలో) రూ.25 కోట్లతో శిల్పారామం ఏర్పాటుకానుంది.
సుందర పట్టణం..
శిల్పారామం నమూనా చిత్రాలు
జిల్లా కేంద్రం.. అనేక నిర్మాణాలతో ఆదర్శ ఒరవడిని కొనసాగిస్తోంది. ఇదే తరుణంలో శిల్పారామం మరో నగగా మెరవనుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ, తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లో కనిపించే శిల్పారామం.. మన చెంతన సాక్షాత్కరించనుంది. హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. చెరువు వద్ద నెక్లెస్ రింగు రోడ్డులో (బైపాస్) నిర్మించనున్నారు. వృత్తి నైపుణ్య జీవన విధానాలు.. ఆకృతులు.. అనేక అంశాల్లో కనువిందు చేసేలా పనులు చేపట్టనున్నారు. నేడు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
పల్లె వాతావరణం ప్రతిబింబించేలా..
శిల్పారామం.. 6 నుంచి 15 ఎకరాల్లో నిర్మాణం కానుంది. పల్లె వాతావరణం, సకల కళలకు నిలయంగా ప్రతిబింబించనుంది. అన్ని రకాల సంస్కృతులు, సంప్రదాయాలకు పెద్దపీట వేయనున్నారు. హస్తకళలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత కళలు, హస్తకళా వస్తువులు అందుబాటులోకి తేనున్నారు. పల్లె సోయగం, వైభవాన్ని చాటనున్నారు. క్రాఫ్ట్స్, కల్చరల్ మ్యూజియాలు, ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం, వర్క్షాప్స్, రీసెర్చ్-డిజైన్ కేంద్రాలు నిర్మిస్తారు. కళాకారులు, సందర్శకులకు వసతి సదుపాయాలు ఉంటాయి.
21 అంశాల సమాహారం..
పర్యాటక శోభను సంతరించుకునే శిల్పారామం.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలువనుంది. వివిధ ఆటలు ఆడేందుకు వీలుగా సదుపాయాలు కల్పించనున్నారు. 21 అంశాలు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. వాటర్ ఫౌంటెయిన్, ఫుడ్ కోర్టు, బజార్ స్టాల్స్, రాక్ గార్డెన్, బాంకెట్ హాల్, గోకార్టింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్కల్ప్టర్స్, గజిబౌల్స్, కిడ్స్ పూల్ ఏరియా, కాటేజస్, డెక్, ఈత కొలను, బంపర్ కార్సు, జోర్బింగ్, ఫిష్ స్పా, గోల్ఫ్ కోర్టు, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ కోర్టు, ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణాలు చేపట్టనున్నారు. తద్వారా మినీ బీచ్ను తలపించనుందని అధికారులు చెబుతున్నారు. 1500 మంది కూర్చునేలా భారీ ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుబడితే.. మెదక్ మనదవదా
[ 11-05-2024]
‘సిద్దిపేట ప్రజలు ఎలాంటి పులులో నాకు తెలుసు. వారు పట్టుబడితే.. జట్టు కడితే లక్ష మెజార్టీ లెక్కే కాదు. మెదక్ లోక్సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి లక్ష మెజార్టీ గ్యారంటీ. -
అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా: వెంకట్రామిరెడ్డి
[ 11-05-2024]
పార్లమెంట్ సభ్యుడిగా ఒక్కసారి అవకాశం ఇస్తే, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని భారాస మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం చేగుంట, నార్సింగిలో నిర్వహించిన రోడ్షోలో పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలు విస్మరించి.. గారడీ మాటలా?
[ 11-05-2024]
మాజీ సీఎం కేసీఆర్ ఎవరినీ లెక్క చేయకపోవడంతో ఆయనను ప్రజలు గద్దె దించి, రేవంత్రెడ్డికి పట్టం గడితే, ఆయనకు కూడా అయిదు నెలలకే అధికారం తలకెక్కిందని మాజీ మంత్రి, భాజపా మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే ప్రజల అభ్యున్నతి
[ 11-05-2024]
కాంగ్రెస్తోనే ప్రజల అభ్యున్నతి సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. శుక్రవారం చిన్నశంకరంపేటలో మెదక్ లోక్సభ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. -
రసవత్తర పోరు.. నేటితో ఆఖరు
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అవకాశం ఇవ్వాలని భాజపా.. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని భారాస ప్రచారం చేపట్టాయి. -
సాంకేతికత వినియోగం.. ఎన్నికలు పారదర్శకం
[ 11-05-2024]
అన్ని రంగాల్లో అభివృద్ధిపై సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం దీని వినియోగం అంతటా పెరిగింది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ప్రస్తుత ఎన్నికల్లోనూ విస్తృతంగా వినియోగిస్తుండటం విశేషం. -
బైకులు ఢీకొని ద్విచక్ర వాహనదారుడి దుర్మరణం
[ 11-05-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరో బైకు ఢీకొన్న ఘటనలో ఒక వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి ఎస్సై నరేష్ వివరాల ప్రకారం.. జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలో శుక్రవారం జహీరాబాద్ వైపు వస్తున్న బైకును వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. -
సైనికులు.. వజ్రాయుధం సంధించేలా..
[ 11-05-2024]
కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. కంటి మీద కునుకు లేకుండా రాత్రి వేళ సైతం విధులు నిర్వహిస్తారు. -
ప్రీలాంచ్ పేరిట రూ.15 కోట్లకు మోసం
[ 11-05-2024]
‘హైవే ప్యారడైజ్’ పేరుతో ప్రీలాంచ్ ఆఫర్లు ప్రకటించి దాదాపు రూ.15 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి మోసగించిన తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన ఓబిలి పాపన్నగారి రామచంద్రారెడ్డిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
సొంతూళ్లకు కార్మికులు
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు సొంతూళ్లకు పయనమయ్యారు. రెండు రోజులుగా ఎక్కువ మంది తరలుతుండటంతో చాలా పరిశ్రమల్లోని ఉత్పత్తి బ్లాక్లు వెలవెలబోతున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నారు. -
పల్లెల్లో ఓటరు చైతన్యం
[ 11-05-2024]
గ్రామాలతో పోల్చితే పట్టణ వాసుల్లో చైతన్యం ఎక్కువ. ఓటింగ్ సమయంలో పరిస్థితి ఇందుకు భిన్నం. పట్టణాల్లో పోలింగ్ తక్కువగా నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు విలువ తెలియని వారు సైతం బాధ్యతగా తమ హక్కును అందరూ వినియోగించుకుంటున్నారు. -
హామీ ఇచ్చిన వైద్య కళాశాల ఏమైంది?
[ 11-05-2024]
‘చెప్పుకోవడానికి చేసిన పనులు పథకాలు లేక భాజపా అభ్యర్థి బండి సంజయ్ ఇంటింటికీ చిత్ర పటాలు పంపిణీ చేశారు.. పటాలు పేదల కడుపులు నింపుతాయా? పిల్లల బతుకులు. -
భాజపాది విభజన రాజకీయం
[ 11-05-2024]
తెలంగాణ విభజన హామీలు చేయకుండా విభజన రాజకీయాలు చేస్తున్న భాజపాను బొందపెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలి
[ 11-05-2024]
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. రాబందులుగా పీక్కుతినే కేంద్రంలోని భాజపా, తెలంగాణలోని భారాస పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. -
సచిత్రం.. ఓటరు గైడ్ మార్గదర్శనం
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు చీటీలతో పాటు పంపిణీ చేస్తున్న గైడ్ చిన్న పుస్తకం సమగ్ర వివరాలతో సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించారు. బూత్ లెవల్ అధికార్లు ఇంటింటికి తిరుగుతూ అందించారు. -
రూ.75 వేల నగదు పట్టివేత
[ 11-05-2024]
జిల్లా సరిహద్దు అక్కన్నపేటలోని స్టాటికల్ సర్వేలెన్స్ చెక్పోస్టు వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.75వేల నగదును పట్టుకున్నట్లు ఎస్సై వివేక్ తెలిపారు.