logo

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం సదాశివపేట పట్టణంలో చోటుచేసుకొంది.

Published : 28 Apr 2024 09:49 IST

సదాశివపేట, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం సదాశివపేట పట్టణంలో చోటుచేసుకొంది. సదాశివపేట సీఐ మహేశ్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. చింతా వినీత్‌(23) బీటెక్‌ చదువుతున్నాడు. జూదమాడటంతో పాటు క్రికెట్‌ బెట్టింగులకు అలవాటుపడ్డాడు. బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని