logo

గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు.

Updated : 30 Apr 2024 06:39 IST

మాతృమూర్తిని కర్రతో మోదిన తనయుడు.. చికిత్స పొందుతూ మృతి

భారతమ్మ

ములుగు: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. ఎస్సై మధుకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తికి చెందిన పెద్దబోయిన బాలమల్లు, భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నరసింహులు ఉన్నారు. అందరికీ పెళ్లిల్లయ్యాయి. మద్యానికి బానిసైన నరసింహులు 9 ఏళ్ల కిందట తండ్రితో డబ్బుల విషయమై గొడవపడ్డాడు. ఇవ్వకపోవడంతో కర్రతో తండ్రి తలపై గట్టిగా కొట్టడంతో ఆయన మృతిచెందారు. ఈనెల 27న రాత్రి తాగిన మైకంలో తల్లి భారతమ్మ(55)తో కుమారుడు నరసింహులు గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తల్లిని బలంగా నెట్టేయడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా కర్రతో దాడి చేశాడు. గమనించిన చుట్టుపక్కల వారు భారతమ్మ కుమార్తెలకు సమాచారం అందించారు. వేరే గ్రామాల్లో ఉంటున్న వారు వచ్చి తల్లిని చికిత్సకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందింది. తమ్ముడు నరసింహులుపై ఆయన అక్క సరస్వతి మర్కూక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై హత్య కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని