గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు.
మాతృమూర్తిని కర్రతో మోదిన తనయుడు.. చికిత్స పొందుతూ మృతి
భారతమ్మ
ములుగు: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. ఎస్సై మధుకర్రెడ్డి తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన పెద్దబోయిన బాలమల్లు, భారతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నరసింహులు ఉన్నారు. అందరికీ పెళ్లిల్లయ్యాయి. మద్యానికి బానిసైన నరసింహులు 9 ఏళ్ల కిందట తండ్రితో డబ్బుల విషయమై గొడవపడ్డాడు. ఇవ్వకపోవడంతో కర్రతో తండ్రి తలపై గట్టిగా కొట్టడంతో ఆయన మృతిచెందారు. ఈనెల 27న రాత్రి తాగిన మైకంలో తల్లి భారతమ్మ(55)తో కుమారుడు నరసింహులు గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తల్లిని బలంగా నెట్టేయడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా కర్రతో దాడి చేశాడు. గమనించిన చుట్టుపక్కల వారు భారతమ్మ కుమార్తెలకు సమాచారం అందించారు. వేరే గ్రామాల్లో ఉంటున్న వారు వచ్చి తల్లిని చికిత్సకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందింది. తమ్ముడు నరసింహులుపై ఆయన అక్క సరస్వతి మర్కూక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై హత్య కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీలు రాక.. తూకం వేయక
[ 16-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. కేంద్రాల్లో తూకం వేశాక, రోజుల తరబడి వడ్లను మిల్లులకు తరలించకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. -
వడ్లు తరలించాలని ధర్నా
[ 16-05-2024]
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, తరలించాలని డిమాండ్ చేస్తూ చిట్కుల్లో బుధవారం రైతులు రోడ్డెక్కారు. -
నిధులున్నా నిస్తేజం
[ 16-05-2024]
ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు సర్కార్ కృషి చేస్తోంది. ఇందుకోసం నిధులు విడుదల చేసినా, పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
ఫలితాలపై జోరుగా పందేలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే కేంద్రీకృతమైంది. -
తరలిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ..
[ 16-05-2024]
జిల్లా కేంద్రం మెదక్ పట్టణానికి మంజూరైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆరేళ్లలో మూడు ప్రాంతాలకు మార్చారు. -
అప్రమత్తతే శరణ్యం.. ఆరోగ్యం సంపూర్ణం
[ 16-05-2024]
నిలువ, మురుగు నీరు ఆవాసంగా దోమలు పెరుగుతాయి. పూలకుండీలు, కూలర్లు, తాగి, వాడి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లలో ఆవాసం ఏర్పర్చుకొని పగటిపూట దోమలు కాటేస్తాయి. ఫలితంగా తీవ్రమైన కండరాల నొప్పి, వికారం, జ్వరం, కళ్లు ఎర్రబారటం లక్షణాలతో బాధపడుతుంటారు. -
ఫలితమిచ్చే చుక్క.. 37.110 లీటర్ల వినియోగం ఎంచక్కా!
[ 16-05-2024]
వేలిపై చుక్క.. ఫలితం ఇచ్చును ఎంచక్కా.. అనుకుంటూ.. ఈ నెల 13న రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు వరుస కట్టి హక్కు వినియోగించుకున్నారు. -
వేతన బకాయిలు కావాలని కార్మికుడి నిరసన
[ 16-05-2024]
వేతన బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో బుధవారం కార్మికుడు చిమ్నీ (పొగ గొట్టం) ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. -
కారు ఢీకొని భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
[ 16-05-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద (కొండాపురం మలుపు రోడ్డు) భువనగిరి-గజ్వేల్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. -
జాతీయ రహదారి విస్తరణ పనులు షురూ
[ 16-05-2024]
తెలంగాణ-కర్ణాటకలను అనుసంధానిస్తూ 161బి నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. -
పెరుగుతున్న ఖర్చులు.. తగ్గుతున్న రాబడి
[ 16-05-2024]
ప్రజలకు ఆనందాన్ని పంచుతున్న సినిమా థియేటర్లకు కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా పరిస్థితులకు ముందు ప్రేక్షకులతో కిటకిటలాడిన సినిమా హాళ్లు ప్రస్తుతం కళ తప్పాయి. -
పెట్రోల్లో నీళ్లు వచ్చాయని ఆందోళన
[ 16-05-2024]
ములుగు పెట్రోల్ బంక్లో తరచూ నీళ్లు వస్తున్నాయని బుధవారం వినియోగదారులు ఆందోళనకు దిగారు. ములుగుకు చెందిన తోడేటి వెంకటస్వామి తన ద్విచక్ర వాహనంలో ములుగు గ్రామంలో ఉన్న బంకులో పెట్రోలు పోయించుకున్నాడు. -
అందని వస్త్రం.. అందేనా ఏకరూపం
[ 16-05-2024]
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ప్రభుత్వమే ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తుంది. అందుకు ముందు నుంచి ప్రణాళికతో వ్యవహరిస్తుంటారు. -
అధిక లాభాలతో బురిడీ
[ 16-05-2024]
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.1.98 లక్షలు కాజేసిన ఘటన ములుగు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం