వేసవి శిబిరాలు.. విజ్ఞాన వీచికలు
వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు.
సద్వినియోగంతో సత్ఫలితం
వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు. నచ్చిన రంగంలో ఆసక్తి చూపుతూ.. అవసరమైన శిక్షణ పొందుతుంటారు. అలాంటి వారికి ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు శిబిరాలను ఏర్పాటుచేశాయి. సద్వినియోగం చేసుకుంటే ఫలితం దక్కనుంది. వేసవి నేపథ్యంలో ప్రత్యేకంగా కొనసాగిస్తున్న, ఏర్పాటు కానున్న శిబిరాలపై ‘న్యూస్టుడే’ కథనం.
బాల సంస్కార్
- సిద్దిపేటలోని షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణం
- ఉదయం 8.30 - 12.30 గంటలు
ఈ నెల 25న షురూ కాగా, మే 14 వరకు కొనసాగనుంది. 15 అంశాలు నేర్పనున్నారు. యోగా, చిత్రలేఖనం, అబాకస్, నీతి కథలు, శ్లోకాలు, ఆటపాటలు, సృజనాత్మక నైపుణ్యాలు, ఇతిహాస పురాణాలు, తదితర అంశాలు చెబుతున్నారు. 5-16 ఏళ్లలోపు వారికి అవకాశం కల్పించగా.. 140 మంది హాజరవుతున్నారు. తోట సంధ్య నేతృత్వంలో మూడేళ్లుగా నిర్వహిస్తున్నారు.
కూచిపూడి నృత్యం
- సిద్దిపేటలో గోల్డెన్ బేకరీ వెనుక వైపు ఎన్సీఆర్ హాస్టల్ ఎదురుగా..
- సాయంత్రం 5.30 - 7 గంటల వరకు
మే 1న ప్రారంభమై జూన్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. కూచిపూడిలో ప్రాథమిక అంశాలపై తర్ఫీదు అందించనున్నారు. అడుగులు, ముద్రికలు, శ్లోకాలపై సాధన చేయిస్తారు. శిక్షకురాలు డా. గోనె మౌనిక నేతృత్వంలో శిక్షణ కొనసాగనుంది.
సంగీత శిక్షణ శిబిరం
- సిద్దిపేట మోహినిపురా వెంకటేశ్వర ఆలయం వద్ద వికాస తరంగిణి భవనం
- ఉదయం 8.30-10 గంటలు
అన్నమాచార్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి మొదలైన శిబిరం మే 10 వరకు కొనసాగనుంది. అన్నమయ్య పవన్ నేతృత్వంలో వాగ్గేయకారుల కీర్తనలు, స్త్రోత్రాలు, శోక్లాలు, శాస్త్రీయ సంగీతం నేర్పిస్తున్నారు.
చేతిరాత శిక్షణ
- సిద్దిపేట పీఆర్టీయూ భవన్ (పాత కలెక్టరేట్ సమీపంలో)
- ఉదయం 8-11 గం. వరకు..
ఈ నెల 26 నుంచి మే 5 వరకు కొనసాగుతుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో చేతిరాతతో పాటు చిత్రలేఖనం, తెలుగు పద్యాలు, హిందీ దోహాలు, నీతి కథలు, దేశభక్తి గేయాలు, సంస్కృత శ్లోకాలను నేర్పిస్తున్నారు. శిక్షకుడు ఎజాస్అహ్మద్ 60 మందికి తర్ఫీదు ఇస్తున్నారు. 1995 నుంచి ఏటా వేసవిలో శిబిరాలు నిర్వహిస్తున్నారు.
సృజనాత్మకత, కళానైపుణ్యం
- జహీరాబాద్లోని శ్రామిక్ విజ్ఞాన కేంద్రం
- ఉదయం 9 - 12 గంటల వరకు
ఈ నెల 24 షురూ కాగా, మే 26 వరకు శిబిరం కొనసాగనుంది. పిల్లల జాతర పేరిట జహీరాబాద్, కోహీర్, మొగుడంపల్లి మండలాల్లోని 14 గ్రామాల్లో వీటిని ఏర్పాటుచేశారు. ఒక్కో శిబిరంలో 30-40 మంది వరకు ఉన్నారు. ఆట పాటలతో బోధన, మట్టి, కాగితాలతో బొమ్మల తయారీ నేర్పిస్తున్నారు.
చిత్రలేఖనం
- సిద్దిపేటలోని కోమటిచెరువు వద్ద రుస్తుం ఆర్ట్ గ్యాలరీ
- ఉదయం 9 - 10 గంటల వరకు
మే 2 నుంచి 12వరకు శిబిరం కొనసాగనుంది. నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం సారథ్యంలో చిత్రలేఖనంలో భాగంగా కలరింగ్, డ్రాయింగ్, మోడ్రన్ ఆర్ట్, పోర్టరైట్, ల్యాండ్స్కేప్ తదితర అంశాలపై నేర్పించనున్నారు.
బ్యాడ్మింటన్
- రామాయంపేట ఇండోర్ స్టేడియం
- ఉదయం, సాయంత్రం
మే 1 నుంచి జూన్ 5 వరకు కొనసాగనుంది. పోలీసుల సహకారంతో రామాయంపేట బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెలకువలు నేర్పించనున్నారు. 14 ఏళ్లలోపు బాల, బాలికలకు అవకాశం ఉంటుంది.
స్పోకెన్ ఇంగ్లీషు
- నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో..
- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
సోమవారం తరగతులు మొదలయ్యాయి. 6 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు అర్హులు. నర్సాపూర్ ఎంపీపీ కార్యాలయం నుంచి కళాశాల వరకు ఉచిత బస్సు సౌకర్యం సైతం కల్పించారు.
క్రికెట్
- సిద్దిపేటలోని క్రీడా మైదానం
- ఉదయం 6-9 గంటల వరకు..
ఈ నెల 20న మొదలైన శిబిరం మే 20 వరకు కొనసాగనుంది. హెచ్సీఏ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరోవైపు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం నిత్యం 150 మందికి పైగా హాజరవుతున్నారు. నిర్వాహకుడు మల్లికార్జున్ నేతృత్వంలో శిక్షకులు సాధన చేయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీలు రాక.. తూకం వేయక
[ 16-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. కేంద్రాల్లో తూకం వేశాక, రోజుల తరబడి వడ్లను మిల్లులకు తరలించకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. -
వడ్లు తరలించాలని ధర్నా
[ 16-05-2024]
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, తరలించాలని డిమాండ్ చేస్తూ చిట్కుల్లో బుధవారం రైతులు రోడ్డెక్కారు. -
నిధులున్నా నిస్తేజం
[ 16-05-2024]
ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు సర్కార్ కృషి చేస్తోంది. ఇందుకోసం నిధులు విడుదల చేసినా, పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
ఫలితాలపై జోరుగా పందేలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే కేంద్రీకృతమైంది. -
తరలిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ..
[ 16-05-2024]
జిల్లా కేంద్రం మెదక్ పట్టణానికి మంజూరైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆరేళ్లలో మూడు ప్రాంతాలకు మార్చారు. -
అప్రమత్తతే శరణ్యం.. ఆరోగ్యం సంపూర్ణం
[ 16-05-2024]
నిలువ, మురుగు నీరు ఆవాసంగా దోమలు పెరుగుతాయి. పూలకుండీలు, కూలర్లు, తాగి, వాడి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లలో ఆవాసం ఏర్పర్చుకొని పగటిపూట దోమలు కాటేస్తాయి. ఫలితంగా తీవ్రమైన కండరాల నొప్పి, వికారం, జ్వరం, కళ్లు ఎర్రబారటం లక్షణాలతో బాధపడుతుంటారు. -
ఫలితమిచ్చే చుక్క.. 37.110 లీటర్ల వినియోగం ఎంచక్కా!
[ 16-05-2024]
వేలిపై చుక్క.. ఫలితం ఇచ్చును ఎంచక్కా.. అనుకుంటూ.. ఈ నెల 13న రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు వరుస కట్టి హక్కు వినియోగించుకున్నారు. -
వేతన బకాయిలు కావాలని కార్మికుడి నిరసన
[ 16-05-2024]
వేతన బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో బుధవారం కార్మికుడు చిమ్నీ (పొగ గొట్టం) ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. -
కారు ఢీకొని భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
[ 16-05-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద (కొండాపురం మలుపు రోడ్డు) భువనగిరి-గజ్వేల్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. -
జాతీయ రహదారి విస్తరణ పనులు షురూ
[ 16-05-2024]
తెలంగాణ-కర్ణాటకలను అనుసంధానిస్తూ 161బి నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. -
పెరుగుతున్న ఖర్చులు.. తగ్గుతున్న రాబడి
[ 16-05-2024]
ప్రజలకు ఆనందాన్ని పంచుతున్న సినిమా థియేటర్లకు కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా పరిస్థితులకు ముందు ప్రేక్షకులతో కిటకిటలాడిన సినిమా హాళ్లు ప్రస్తుతం కళ తప్పాయి. -
పెట్రోల్లో నీళ్లు వచ్చాయని ఆందోళన
[ 16-05-2024]
ములుగు పెట్రోల్ బంక్లో తరచూ నీళ్లు వస్తున్నాయని బుధవారం వినియోగదారులు ఆందోళనకు దిగారు. ములుగుకు చెందిన తోడేటి వెంకటస్వామి తన ద్విచక్ర వాహనంలో ములుగు గ్రామంలో ఉన్న బంకులో పెట్రోలు పోయించుకున్నాడు. -
అందని వస్త్రం.. అందేనా ఏకరూపం
[ 16-05-2024]
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ప్రభుత్వమే ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తుంది. అందుకు ముందు నుంచి ప్రణాళికతో వ్యవహరిస్తుంటారు. -
అధిక లాభాలతో బురిడీ
[ 16-05-2024]
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.1.98 లక్షలు కాజేసిన ఘటన ములుగు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!