ఈ రోజు ఇలా.. రేపు అలా..
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి.
ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహంలో మార్పులు చేర్పులు
న్యూస్టుడే, గజ్వేల్: పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. ప్రచారానికి కొద్ది రోజుల సమయమే ఉండటంతో విస్తృతంగా నాయకులు, అభ్యర్థులు తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. పగలు ఎండలు మండుతుండటంతో ఉదయం, సాయంత్రం వేళలను సద్వినియోగం చేసుకుంటున్నారు. స్థానిక నేతలు తప్పకుండా ప్రతి ఓటరునూ కలవాలని చెబుతున్నారు. అభ్యర్థి, పార్టీ విధివిధానాలు, హామీల గురించి వివరించి కచ్చితంగా తమ పార్టీకే ఓటు వేసేలా ఒప్పించాలని తర్ఫీదు ఇస్తున్నారు. ప్రచారం సమయం ముగిశాక రాత్రి ఆరోజు జరిగిన తీరు.. మరుసటి రోజు అందిపుచ్చుకోవాల్సిన అంశంపై సమావేశమై చర్చిస్తున్నారు.
స్వతంత్రుల కార్యకర్తలతో సేకరణ.. మెదక్ పార్లమెంటు పరిధిలో 2,124 బూత్లు ఉన్నాయి. కాంగ్రెస్, భారాస, భాజపా నేతలు బూత్ స్థాయి బాధ్యులను నియమించారు. వారి పరిధిలో 100 ఓట్లకు ఒకరిని బాధ్యులుగా ఏర్పాటు చేశారు. మూడు పార్టీలకు కలిసి 6,372 మంది బూత్ బాధ్యులు, వంద ఓటర్లకు ఒకరు చొప్పున 54,384 మందితో సహా మొత్తం 60,756 మంది ముఖ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్య కార్యకర్తలు మరో 500 మంది వరకు ఉన్నారు. వారి ద్వారా సమాచార సేకరణ చేస్తున్నారు. నేతలు ఎక్కడ ప్రచారం చేశారు? ఎంత మంది ఓటర్లను కలిశారు? అనే విషయాలను వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాటిల్లో పంపించుకుంటున్నారు. కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఒక్కో సభ్యుడికి రోజుకు భోజనం, సెల్ రీఛార్జితో కలిపి దాదాపు రూ.1000 వరకు ఖర్చు చేస్తున్నారు.
వివాదాస్పద అంశం విస్తృతి.. ప్రధాన పార్టీలు సామాజిక మాధ్యమ బాధ్యులను ఏర్పాటు చేశారు. ప్రచారానికి వస్తున్న నేతల ప్రసంగాలను అనుకూలంగా చేస్తున్నారు. ప్రత్యర్థి నేతల ప్రసంగాల్లో వివాదాస్పదమైన అంశాన్ని వెతికి మరీ వ్యంగ్యంగా మలిచి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వదులుతున్నారు. వీటి తయారీ కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు అంచనా. ఓటర్లను ప్రభావితం చేసేలా అభిప్రాయాలు, స్పందనలు, చిత్రాలను పోటాపోటీగా సామాజిక మాధ్యమ వారియర్స్ ప్రచారం చేస్తున్నారు.
కరవు వచ్చింది: భారాస.. కాంగ్రెస్ రాగానే కరవు వచ్చిందని భారాస ప్రచారం చేస్తోంది. గ్యారంటీలు, రుణమాఫీ అమలు కాలేదని చెబుతోంది. అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి రూ.వంద కోట్ల ట్రస్టు పెట్టి పేదలను ఆదుకుంటారంటోంది. తెలంగాణ అభివృద్ధికి భాజపా ఏమీ ఇవ్వలేదని.. భాజపా అభ్యర్థివి మాటలే కానీ చేతలు లేవని విమర్శిస్తోంది.
అమలు చేశాం: కాంగ్రెస్.. వంద రోజుల పాలనే ఎన్నికలకు రెఫరెండం అని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామంటోంది. పంద్రాగస్టున రుణమాఫీ చేసి తీరుతామంటోంది. కాళేశ్వరం కుంగుపాటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై భారాసను విమర్శిస్తోంది. బీసీ బిడ్డ నీలం మధు అని నాయకులు ప్రచారం చేస్తున్నారు.
కల్లోలాలు లేని దేశం: భాజపా.. పదేళ్లపాటు దేశంలో ఎక్కడా కల్లోలాలు లేని పాలన సాగించిన ఘనత భాజపాదేనని.. ప్రధాని నరేంద్ర మోదీ రక్ష అని ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ స్థాయి పురోగతి, శ్రీరాముడికి గుడి, మతపరమైన రిజర్వేషన్లపై వ్యతిరేకత, రాజ్యాంగమే పవిత్ర గ్రంథం అంశాలపై వివరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీలు రాక.. తూకం వేయక
[ 16-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. కేంద్రాల్లో తూకం వేశాక, రోజుల తరబడి వడ్లను మిల్లులకు తరలించకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. -
వడ్లు తరలించాలని ధర్నా
[ 16-05-2024]
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, తరలించాలని డిమాండ్ చేస్తూ చిట్కుల్లో బుధవారం రైతులు రోడ్డెక్కారు. -
నిధులున్నా నిస్తేజం
[ 16-05-2024]
ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు సర్కార్ కృషి చేస్తోంది. ఇందుకోసం నిధులు విడుదల చేసినా, పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
ఫలితాలపై జోరుగా పందేలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే కేంద్రీకృతమైంది. -
తరలిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తూ..
[ 16-05-2024]
జిల్లా కేంద్రం మెదక్ పట్టణానికి మంజూరైన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆరేళ్లలో మూడు ప్రాంతాలకు మార్చారు. -
అప్రమత్తతే శరణ్యం.. ఆరోగ్యం సంపూర్ణం
[ 16-05-2024]
నిలువ, మురుగు నీరు ఆవాసంగా దోమలు పెరుగుతాయి. పూలకుండీలు, కూలర్లు, తాగి, వాడి పడేసిన కొబ్బరి బొండాలు, టైర్లలో ఆవాసం ఏర్పర్చుకొని పగటిపూట దోమలు కాటేస్తాయి. ఫలితంగా తీవ్రమైన కండరాల నొప్పి, వికారం, జ్వరం, కళ్లు ఎర్రబారటం లక్షణాలతో బాధపడుతుంటారు. -
ఫలితమిచ్చే చుక్క.. 37.110 లీటర్ల వినియోగం ఎంచక్కా!
[ 16-05-2024]
వేలిపై చుక్క.. ఫలితం ఇచ్చును ఎంచక్కా.. అనుకుంటూ.. ఈ నెల 13న రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు వరుస కట్టి హక్కు వినియోగించుకున్నారు. -
వేతన బకాయిలు కావాలని కార్మికుడి నిరసన
[ 16-05-2024]
వేతన బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో బుధవారం కార్మికుడు చిమ్నీ (పొగ గొట్టం) ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. -
కారు ఢీకొని భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
[ 16-05-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద (కొండాపురం మలుపు రోడ్డు) భువనగిరి-గజ్వేల్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. -
జాతీయ రహదారి విస్తరణ పనులు షురూ
[ 16-05-2024]
తెలంగాణ-కర్ణాటకలను అనుసంధానిస్తూ 161బి నంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. -
పెరుగుతున్న ఖర్చులు.. తగ్గుతున్న రాబడి
[ 16-05-2024]
ప్రజలకు ఆనందాన్ని పంచుతున్న సినిమా థియేటర్లకు కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా పరిస్థితులకు ముందు ప్రేక్షకులతో కిటకిటలాడిన సినిమా హాళ్లు ప్రస్తుతం కళ తప్పాయి. -
పెట్రోల్లో నీళ్లు వచ్చాయని ఆందోళన
[ 16-05-2024]
ములుగు పెట్రోల్ బంక్లో తరచూ నీళ్లు వస్తున్నాయని బుధవారం వినియోగదారులు ఆందోళనకు దిగారు. ములుగుకు చెందిన తోడేటి వెంకటస్వామి తన ద్విచక్ర వాహనంలో ములుగు గ్రామంలో ఉన్న బంకులో పెట్రోలు పోయించుకున్నాడు. -
అందని వస్త్రం.. అందేనా ఏకరూపం
[ 16-05-2024]
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ప్రభుత్వమే ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తుంది. అందుకు ముందు నుంచి ప్రణాళికతో వ్యవహరిస్తుంటారు. -
అధిక లాభాలతో బురిడీ
[ 16-05-2024]
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.1.98 లక్షలు కాజేసిన ఘటన ములుగు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?