ఒక్కసారే గెలిచి.. ప్రజల మధ్యే నిలిచి
రాజకీయాల్లో అవకాశాలు, అదృష్టం కలిసి వస్తే ఒక్కసారిగా అందలమెక్కుతారు. ఆ తర్వాత పరిస్థితులు మారి కాలం కలిసిరాక పదవులు దక్కకపోవడంతో రాజకీయాల నుంచి కనుమరుగైపోతారు.
మాజీ ఎమ్మెల్యే కమలమ్మ జీవితం
నకిరేకల్, న్యూస్టుడే
రాజకీయాల్లో అవకాశాలు, అదృష్టం కలిసి వస్తే ఒక్కసారిగా అందలమెక్కుతారు. ఆ తర్వాత పరిస్థితులు మారి కాలం కలిసిరాక పదవులు దక్కకపోవడంతో రాజకీయాల నుంచి కనుమరుగైపోతారు. ఒక్కసారే ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా.. ఆ తర్వాత ఎలాంటి పదవులు రాకున్నా.. నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే మూసపాటి కమలమ్మ. సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూ .. చివరివరకు కాలినడకన, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసేవారు. అది ఏ వేదికైనా.. సొంత పార్టీ వారైనా.. ప్రతిపక్షాలైనా.. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను కడిగిపారేయడం ఆమె మనస్తత్వం. ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నతాధికారుల వద్దకు నేరుగా ప్రజా సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేశారు. పదవులు లేకున్నా..ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం ప్రశ్నిస్తూ ఆదర్శంగా నిలిచారు స్థానికులు కమలక్కగా పిలుచుకునే కమలమ్మ.
1972లో నకిరేకల్కు వచ్చిన నాటి ప్రధాని ఇందిరకు బొట్టుపెట్టి స్వాగతిస్తున్న కమలమ్మ
ఇదీ ప్రస్థానం..
1942లో హైదరాబాద్లో కమలమ్మ జన్మించారు. ఆమె తండ్రి నాగయ్యయాదవ్ నిజాం సంస్థానంలో పనిచేసేవారు. బీఏ వరకు చదివి 1960లో కమలమ్మ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. కాంగ్రెస్ సేవాదళ్ కమాండర్గా పనిచేశారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నల్గొండ జైలుకు వెళ్లారు. 1962 నుంచి 1970 వరకు నల్గొండ జడ్పీ కో-ఆప్షన్ సభ్యురాలుగా పనిచేశారు. 1970లో ఇందిరాగాంధీతో కలిసి సామాజిక కార్యకర్తల మహాసభల కోసం ఫిలిప్పీన్స్, జపాన్, బ్యాంకాక్, చైనా దేశాల్లో పర్యటించారు.
యోధుడిని ఓడించిన చరిత్ర..
నకిరేకల్ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వరుస విజయాల యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్న మార్క్సిస్టు నేత నర్రా రాఘవరెడ్డిని ఓడించిన చరిత్ర కమలమ్మది. 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలమ్మ నర్రా రాఘవరెడ్డిపై 3,836 ఆధిక్యంతో విజయం సాధించారు. 1978 ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి మరణించేంత వరకు ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేశారు. నాలుగు దశబ్దాల క్రితమే మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించారు. విద్యుత్తు సమస్యలు పరిష్కరించారు. నకిరేకల్లో తొలి ఆర్టీసీ బస్స్టేషన్ నిర్మాణానికి కృషిచేశారు.
- తన 72వ ఏటా 2014 డిసెంబరు 18న కమలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.
ఆ ఘనత ఆమెదే...
రాజకీయాల్లో నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. నకిరేకల్ శివాజీనగర్లోని సొంత ఇంట్లో సాధారణ జీవితాన్ని కొనసాగించారు. స్థానికంగా పలువురు నాయకులుగా ఎదిగేందుకు దోహదపడ్డారు. నకిరేకల్కు 1972 నవంబరులో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీ నరసింహరావును తీసుకొచ్చిన ఘనత కమలమ్మకే దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు