రాహుల్గాంధీని ప్రధానిని చేస్తే పేదలకు మేలు
కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్గాంధీని ప్రధానిగా చేస్తేనే పేదల సమస్యలు తీరుతాయని అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నభమ్ తూకి అన్నారు. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చండూరు మండలంలోని జోగిగూడెం, తిమ్మారెడ్డిగూడెంలలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నభమ్ తూకి
చండూరు మండలం తిమ్మారెడ్డిగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నభమ్ తూకి
చండూరు, న్యూస్టుడే: కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్గాంధీని ప్రధానిగా చేస్తేనే పేదల సమస్యలు తీరుతాయని అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నభమ్ తూకి అన్నారు. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చండూరు మండలంలోని జోగిగూడెం, తిమ్మారెడ్డిగూడెంలలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో భాజపా ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపి పేదల నడ్డి విరిచిందని విమర్శించారు. భాజపాను, తెలంగాణలో భారాసను గద్దె దింపేందుకు కాంగ్రెస్తో కలిసి పని చేయాలని ప్రజలను కోరారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి తనకు ప్రియమిత్రుడని తెలిపారు. అతను చైనా, మయన్మార్, భూటాన్ దేశాల సరిహద్దులో సైనికుల కోసం 250 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాడని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర మహిళలు తయారు చేసిన చేనేత జర్కిన్, మఫ్లర్ను రాజగోపాల్రెడ్డికి బహూకరించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్నేత, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి: కలెక్టర్
[ 13-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2061 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. -
ఈ రోజు మనదే..!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక క్రతువైన పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది -
స్వయంవరంలో.. ఆ ఇద్దరు
[ 13-05-2024]
ఇది ఐదేళ్ల ఒప్పంద వేడుక. దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు వధువులు (ఎంపీ స్థానాలు) స్వయంవరం ప్రకటించుకున్నారు -
గడప దాటిస్తే.. గండం గడిచినట్లే
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చింది. ఇన్నాళ్లుగా ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ప్రచారం ఒక ఎత్తైతే.. పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం ఇంకో ఎత్తు. కొన్నేళ్లుగా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. -
ఎన్నికల కేసులో ఇరుక్కోకు తమ్ముడూ..!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ నేతలు చెప్పారనో.. ప్రలోభాలకు లొంగిపోయో ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. -
ఆదర్శ కళాశాలలు పిలుస్తున్నాయ్..!
[ 13-05-2024]
ఆదర్శ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం ఈ నెల 9న ప్రకటన విడుదల చేసింది. -
మనోళ్లు ఓటేసేదిక్కడే!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. -
పకడ్బందీగా... ప్రణాళికగా
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు: ఎస్పీ
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు -
పదండి..ఓటేద్దాం..!
[ 13-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. తుది ఏర్పాట్లను పూర్తి చేసింది -
పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
[ 13-05-2024]
భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్కు ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్, ఆర్వో హన్మంతు కె.జెండగే పరిశీలించారు -
అంతా గుట్టుగా..!
[ 13-05-2024]
రసవత్తర పోరుకు వేదికగా మారిన భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిపెట్టాయి