వారు ఆడిందే ఆట.. కాసుల వేట
కంచే చేను మేసినట్లుగా.. ఔషధ దుకాణాల్లో జరిగే అవినీతిని అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేసుకుని రూ.కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది.
జిల్లా ఔషధాల నియంత్రణ అధికారి కార్యాలయం
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: కంచే చేను మేసినట్లుగా.. ఔషధ దుకాణాల్లో జరిగే అవినీతిని అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేసుకుని రూ.కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అక్రమాలకు పాల్పడిన వారిపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. నల్గొండ జిల్లాలో 2018 నుంచి 2024 వరకు ఔషధ విక్రయ దుకాణాల తనిఖీల్లో నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసినట్లు సమాచారం. కొవిడ్ విజృంభించిన సమయంలో ఇంజక్షన్ల అమ్మకాల్లో సైతం రూ.లక్షలు పక్కదారి పట్టించారు. ఓ డీఐవో ప్రతి ఔషధాల సముదాయానికి రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు దరఖాస్తు దారుల స్థాయిని బట్టి వసూళ్లు చేసినట్లు సమాచారం. ఆయన ఆగడాలు తట్టుకోలేక మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఒకరు రూ.18 వేలు లంచం ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించారు.
కాసులిస్తే తనిఖీల్లేవు..
జిల్లాలో 1,200 ఔషధ విక్రయ కేంద్రాలున్నాయి. వాటి నుంచి ప్రతి నెలా అమ్మకాలు జరిగే స్థాయిని బట్టి ప్రాంతాల వారీగా అధికారులకు రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. దీని కోసం మధ్య వర్తులుగా కొందరు సంఘ నాయకులు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అధికారుల చేతికి మట్టి అంటకుండా సదరు నాయకులు నెలవారీ వసూళ్లు చేసి ఇస్తున్నట్లు కొందరు ఔషధ విక్రయ నిర్వాహకులు చెబుతున్నారు. మామూళ్లు ఇవ్వని వారిపై దాడులు నిర్వహిస్తూ అక్రమ కేసులు పెడుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో సీజ్ చేసిన దుకాణాలను తిరిగి తెరుచుకోవాలంటే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవల సీజ్ చేసిన ఔషధ దుకాణదారులు పేర్కొన్నారు. కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ చలానా రుసుం రూ.3వేలు ఉంటే, అధికారులకు రూ.10వేలకు పైగా చెల్లించాల్సి వస్తోందని పలువురు బాధితులు వాపోయారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్లదే హవా సాగుతుంది.
మా దృష్టికి రాలేదు
దాసు, ఔషధ నియంత్రణ పరిపాలన అధికారి
ఔషధ దుకాణాల తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. వాస్తవాలు తెలుసుకుని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. కొనుగోలు దారులకు ఇబ్బందులు కలిగిస్తే తమకు నేరుగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
[ 11-05-2024]
భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఓటు వేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ పేరు గల వ్యక్తిని తానేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -
మేమూ ఓటేశాం.. మరి మీరూ?
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చింది. పల్లెల్లో మైకుల హోరు తగ్గింది. ఇక పోలింగ్ క్రతువే మిగిలి ఉంది. అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది రోజుల్లో తేలనుంచి. సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు, శతశాతం పోలింగ్కు అధికారగణం సిద్ధపడుతున్నారు. -
లోక్సభలో గళమెత్తా ..ప్రజాక్షేత్రంలో పోరాడా
[ 11-05-2024]
దేశంలో లోక్సభ కీలకమైన చట్టసభ. నల్గొండ లోక్సభ స్థానం నుంచి 1998లో సీపీఐ తరఫున సురవరం సుధాకర్రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. -
అతిథి తరలి రాగా.. అదిరే జనజాతర..!
[ 11-05-2024]
నకిరేకల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. -
నేటితో ప్రచారం పరిసమాప్తం
[ 11-05-2024]
గత నెల రోజులకు పైగా క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుంది -
పరిధి దాటితే కటకటాలే
[ 11-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. -
ఎన్నికల ఫైనల్ మ్యాచ్కు ఇంకా రెండ్రోజులే
[ 11-05-2024]
భారత్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు కొనసాగుతుండగా.. లోక్సభ ఎన్నికల క్రీడలూ ఈ మధ్యే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన జట్ల (పార్టీల) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. -
నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ
[ 11-05-2024]
నకిలీ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.53.89 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగింది. -
మట్టపల్లిలో ముగిసిన విశ్వశాంతి మహాయాగం
[ 11-05-2024]
మట్టపల్లి క్షేత్రంలో 12 రోజులుగా నిర్వహిస్తోన్న విశ్వశాంతి మహాయాగం శుక్రవారం విశేష హోమాలు, ఆధ్యాత్మిక క్రతువులతో ముగిసింది. -
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం: జగదీశ్రెడ్డి
[ 11-05-2024]
కేసీఆర్ నాయకత్వంలోని భారాసతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 11-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
‘రాజ్యాంగం రద్దుకు భాజపా కుట్ర’
[ 11-05-2024]
మోదీ మళ్లీ గెలిస్తే దేశం సర్వనాశనం అవుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.