ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు.
నాంపల్లి, న్యూస్టుడే: అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం, ఉత్సాహం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆర్నెల్లకే ఈ ఎన్నికలు రావడంతో స్తబ్ధత నెలకొంది. అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మూడు ప్రధాన పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం బయటికి ఒకలా.. లోపల మరోలా వ్యవహరిస్తున్నారని ఆయా పార్టీల కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఎవరికెవరి మద్దతు..
లోక్సభ ఎన్నికల్లో ఎవరు.. ఎవరికి మద్దతిస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు రోడ్డు షోలు, ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో స్తబ్ధత నెలకొనడంతో ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడంలేదనే అభిప్రాయం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న సమావేశం నిర్వహించినా.. కార్యకర్తల సమీకరణ పోటీపడి చేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఒకరి పేరు చెప్పి మరొకరికి ఓట్లు వేయమనే సరళి కొనసాగుతోందా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్థిక భారం.. సంశయంగా..
లోక్సభ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలంటే ఎక్కడ ఆర్థిక భారం మీదపడుతుందనే ఉద్దేశంతో కొందరు నాయకులు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా దూరం దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ద్వితీయ శ్రేణి నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ముఖ్య నాయకులూ పెద్దగా ఆసక్తి చూపడంలేదనే చర్చకు దారితీస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎక్కువ నియోజకవర్గాల్లో ద్విముఖ పోరు ఉండగా.. లోక్సభ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్యన పోరు ఆసక్తిగా మారనుందని ప్రధాన పార్టీల నాయకులే అంచనా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి ఓట్లు ఎవరికి నష్టం కలిగిస్తాయనేది అభ్యర్థులకూ, అంతరంగికులకూ అంతు చిక్కని అంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటే వజ్రాయుధమనె.. ప్రజాస్వామ్యానిదే విజయమనె..!
[ 14-05-2024]
నల్గొండ, భువనగిరి రెండు లోక్సభ స్థానాల్లోనూ పోలింగ్ అంకం సోమవారం ప్రశాంతంగా ముగిసింది. -
సిరా చుక్కలో.. భవిష్యత్తు లెక్క..!
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18వ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేలా, పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఎన్నికల సంఘం వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్ది ఆహ్వానించింది. -
ఓటు విలువ గుర్తించి.. ఖండాలు దాటొచ్చి
[ 14-05-2024]
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే.. ఓటు అనే ఆయుధాన్ని అందరూ సంధించాల్సిందే. వజ్రాయుధం లాంటి ఓటుహక్కు వినియోగించడానికి విదేశాల నుంచి వచ్చారు.. పలువురు ఓటర్లు. -
టెండర్ ఓటు వేసిన దంపతులు
[ 14-05-2024]
తమ ఓటును ఇది వరకే వేరొకరు వేయడంతో దంపతులు అవాక్కయిన ఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన ఇక్కె లక్ష్మీనారాయణ, ఉమారాణి దంపతులు లోక్సభ ఎన్నికల్లో -
ఈవీఎంల మొరాయింపు.. ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
శాసనసభ ఎన్నికల వేళ ఓటర్లలో, నాయకుల్లో, అభ్యర్థుల్లో కనిపించిన ఉత్సాహం లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జనగామ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం తగ్గింది. -
ఇటు ఖాళీగా.. అటు నిండుగా
[ 14-05-2024]
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. నిన్నటి వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వేలాది వాహనాలు బారులు తీరాయి. -
వెబ్కాస్టింగ్ ద్వారా అధికారుల పర్యవేక్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తీరును కలెక్టరేట్లోని కంట్రోల్రూం ద్వారా అధికారులు పర్యవేక్షించారు. -
ఫలించిన ఎన్నికల ప్రణాళిక
[ 14-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎస్సెల్బీసీ ఎప్పటికి పూర్తయ్యేనో..!
[ 14-05-2024]
ఎన్నికలు ఏవైనా సరే.. లోక్సభ కావొచ్చు.. అసెంబ్లీ కావొచ్చు.. గత నాలుగు దశాబ్దాలుగా మారుమూల దేవరకొండ గిరిజన ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీల నినాదం ఎస్సెల్బీసీ సొరంగం నిర్మాణం పూర్తిపైనే. -
అభివృద్ధి చేసే నాయకులను వదులుకోవద్దు: ఎంపీ ఉత్తమ్
[ 14-05-2024]
ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అమ్యూలమైన ఓటుహక్కును వినియోగించుకున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఈ ఎన్నికలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా చిన్న ఘటన జరగకుండా లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
పరిశీలించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. -
ఇచ్చిందే కొసరంత.. అందులోనే కోత..!
[ 14-05-2024]
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బు, మద్యం పంపిణీ చేస్తుంటారు. -
బందోబస్తును పర్యవేక్షించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. -
తప్పిన పెను ప్రమాదం
[ 14-05-2024]
ఆలేరులోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది.