మడిగల్లోనే దశాబ్దాలుగా..!
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి.
ప్రభుత్వ ఆస్పత్రి ముందున్న వాణిజ్య దుకాణాలు
దేవరకొండ, న్యూస్టుడే: దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. అద్దెలు విపరీతంగా పెరిగాయి. చిన్న మడిగకు కూడా రూ.10వేలకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.అయితే దేవరకొండ ఏరియా ఆసుపత్రి ముందు పురపాలికకు సంబంధించిన వాణిజ్య దుకాణాల్లో దశాబ్దాలుగా ఖాళీ చేయకుండా, లీజు చెల్లించకుండా వ్యాపారులు అలాగే ఉండిపోయారు. దేవరకొండ పురపాలక పరిధిలోని ఏరియా ఆస్పత్రి ముందు కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారిపై ఎనిమిది, పాత బజార్, మాయాబజార్లోని కొన్ని వాణిజ్య దుకాణాల్లో యజమానులు దశాబ్దాలుగా తిష్ఠ వేశారు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఎనిమిది వాణిజ్య దుకాణాలను 1998 మార్చి 18న వ్యాపారస్తులకు అప్పటి గ్రామపంచాయతీ అధికారులు లీజుకు ఇచ్చారు. మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత సంబంధిత లీజును 2001లో రద్దు చేశారు. కానీ వ్యాపారస్తులు అలాగే దుకాణాలు నిర్వహించుకుంటున్నారు. 2012లో దేవరకొండ నగర పంచాయతీగా రూపుదిద్దుకున్న తర్వాత ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రస్తుతం ఉన్న వాణిజ్య దుకాణాలు సైతం మరొకరికి లీజు పేరుతో విక్రయాలకు పాల్పడుతున్నారు. వాణిజ్య వ్యాపారుల నుంచి లీజు వసూలు చేయకపోవడంతో పాటు వాటిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక పురపాలిక అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పురపాలిక అధికారులే ఆ మడిగలకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వడం గమనార్హం.
ఏరియా ఆసుపత్రి ముందు కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై
మడిగల్లో హోటల్ ఏర్పాటుకు చేపడుతున్న నూతన నిర్మాణం
నోటీసులు ఇచ్చాం: భాస్కర్రెడ్డి, పురపాలిక కమిషనర్
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు ఉన్న ఎనిమిది వాణిజ్య దుకాణ వ్యాపారులకు నోటీసులు జారీ చేశాం. వారి నుంచి సమాధానం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటే వజ్రాయుధమనె.. ప్రజాస్వామ్యానిదే విజయమనె..!
[ 14-05-2024]
నల్గొండ, భువనగిరి రెండు లోక్సభ స్థానాల్లోనూ పోలింగ్ అంకం సోమవారం ప్రశాంతంగా ముగిసింది. -
వెబ్కాస్టింగ్ ద్వారా అధికారుల పర్యవేక్షణ
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తీరును కలెక్టరేట్లోని కంట్రోల్రూం ద్వారా అధికారులు పర్యవేక్షించారు. -
ఫలించిన ఎన్నికల ప్రణాళిక
[ 14-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎస్సెల్బీసీ ఎప్పటికి పూర్తయ్యేనో..!
[ 14-05-2024]
ఎన్నికలు ఏవైనా సరే.. లోక్సభ కావొచ్చు.. అసెంబ్లీ కావొచ్చు.. గత నాలుగు దశాబ్దాలుగా మారుమూల దేవరకొండ గిరిజన ప్రాంతంలో అన్ని రాజకీయ పార్టీల నినాదం ఎస్సెల్బీసీ సొరంగం నిర్మాణం పూర్తిపైనే. -
అభివృద్ధి చేసే నాయకులను వదులుకోవద్దు: ఎంపీ ఉత్తమ్
[ 14-05-2024]
ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అమ్యూలమైన ఓటుహక్కును వినియోగించుకున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఈ ఎన్నికలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా చిన్న ఘటన జరగకుండా లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. -
పరిశీలించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. -
ఇచ్చిందే కొసరంత.. అందులోనే కోత..!
[ 14-05-2024]
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బు, మద్యం పంపిణీ చేస్తుంటారు. -
బందోబస్తును పర్యవేక్షించి.. సూచనలు అందించి
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచే పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొన్నాయి. -
తప్పిన పెను ప్రమాదం
[ 14-05-2024]
ఆలేరులోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది.