సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది.
గత వానాకాలంలో వరి నాట్లు వేస్తున్న కూలీలు
నల్గొండ గ్రామీణం, న్యూస్టుడే: నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. విత్తనాలకు రాయితీ ప్రతిపాదనలు తయారు చేసి సర్కారుకు వ్యవసాయ శాఖ పంపింది. ఇప్పటికే ధాన్యం విక్రయాలు జోరందుకున్నాయి. కొనుగోళ్లు పూర్తి కాగానే రైతులు వానాకాలం సాగు పనుల్లో నిమగ్నం అవుతారు. యాసంగిలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. పొలాల్లో చెరువు మట్టి ట్రాక్టర్లలో తీసుకెళ్లి చల్లుతున్నారు. వ్యవసాయశాఖ కూడా ముందస్తుగా సమాయత్తం అవుతుంది. నకిలీ పత్తి విత్తనాలు నిరోధించే దిశగా అధికారులు దృష్టి సారించారు. సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. గత ఏడాది వానాకాలం సీజన్ స్థితిగతులు, మార్కెట్లో లభించిన ధరల అంచనాల ప్రాతిపదికన వ్యవసాయశాఖ ఈ సారి ప్రణాళికను రూపొందించింది.
విత్తనాలకు ప్రతిపాదనలు పంపాం..
శ్రవణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, నల్గొండ
జిల్లాలో వానాకాలం సాగుకు సమాయత్తం చేస్తున్నాం. పత్తి మినహా సాగయ్యే మిగిలిన పంటలకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తుంది. ఏమేరకు ఆయా పంటలు సాగవుతాయో అంచనాలు రూపొందించాం. వాటికి అవసరమయ్యే విత్తనాల వివరాలు ప్రభుత్వానికి పతిపాదనలు పంపాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి: కలెక్టర్
[ 13-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2061 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. -
ఈ రోజు మనదే..!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక క్రతువైన పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది -
స్వయంవరంలో.. ఆ ఇద్దరు
[ 13-05-2024]
ఇది ఐదేళ్ల ఒప్పంద వేడుక. దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు వధువులు (ఎంపీ స్థానాలు) స్వయంవరం ప్రకటించుకున్నారు -
గడప దాటిస్తే.. గండం గడిచినట్లే
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చింది. ఇన్నాళ్లుగా ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసిన ప్రచారం ఒక ఎత్తైతే.. పోలింగ్ రోజు ఓటర్లను ఇంటి గడప దాటించి పోలింగ్ కేంద్రానికి రప్పించి ఓట్లేయించడం ఇంకో ఎత్తు. కొన్నేళ్లుగా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. -
ఎన్నికల కేసులో ఇరుక్కోకు తమ్ముడూ..!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల వద్ద యువత జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ నేతలు చెప్పారనో.. ప్రలోభాలకు లొంగిపోయో ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. -
ఆదర్శ కళాశాలలు పిలుస్తున్నాయ్..!
[ 13-05-2024]
ఆదర్శ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రభుత్వం ఈ నెల 9న ప్రకటన విడుదల చేసింది. -
మనోళ్లు ఓటేసేదిక్కడే!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. -
పకడ్బందీగా... ప్రణాళికగా
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు: ఎస్పీ
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు -
పదండి..ఓటేద్దాం..!
[ 13-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. తుది ఏర్పాట్లను పూర్తి చేసింది -
పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
[ 13-05-2024]
భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్కు ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్, ఆర్వో హన్మంతు కె.జెండగే పరిశీలించారు -
అంతా గుట్టుగా..!
[ 13-05-2024]
రసవత్తర పోరుకు వేదికగా మారిన భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిపెట్టాయి
తాజా వార్తలు (Latest News)
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!