ఆత్మకూరు ఉప ఎన్నికకు..ముహూర్తం ఖరారు
ఆత్మకూరు ఉప ఎన్నికకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆత్మకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గుండెపోటుతో ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతిచెందారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
బెజవాడ గోపాలరెడ్డి.. ఆనం సంజీవరెడ్డి(పాతచిత్రాలు)
ఈనాడు డిజిటల్, నెల్లూరు ఆత్మకూరు ఉప ఎన్నికకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఆత్మకూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గుండెపోటుతో ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతిచెందారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019లో వైకాపా అభ్యర్థిగా గౌతమ్రెడ్డి పోటీ చేసి ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై దాదాపు 22,276 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గౌతమ్రెడ్డి మృతిచెందిన మూడు నెలల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేయడంతో ఆత్మకూరులో రాజకీయ సందడికి తెర లేచింది. అటు ఎన్నికలు.. ఇటు భద్రత యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎన్నికా.. ఏకగ్రీవమా!
వైకాపా అభ్యర్థిగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ద్వితీయ కుమారుడు, గౌతమ్రెడ్డి సోదరుడు విక్రమ్రెడ్డి పేరును ఇప్పటికే పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. అప్పటినుంచి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలిసి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష తెదేపా దాదాపుగా పోటీలో ఉండే అవకాశం లేదు. మృతిచెందిన వారి కుటుంబసభ్యులు పోటీ చేస్తే తాము పోటీ చేయమని ఇప్పటికే ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన బద్వేలు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ప్రస్తుతం కూడా అదే పంథా కొనసాగించే అవకాశముందని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నెల్లూరులో పర్యటించినప్పుడు.. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో తమ పార్టీ ఉంటుందని ప్రకటించారు. గురువారం నెల్లూరులో జరిగే ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. మేకపాటి రాజమోహన్రెడ్డి మేనల్లుడు బిజువేముల రవీంద్రారెడ్డి పలుమార్లు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తాను పోటీ చేస్తానని తెలిపారు. మరికొంత మంది ఆశావహులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో ఎన్నిక అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరు దశాబ్దాల తర్వాత..
సంగం : ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు దశాబ్దాల తర్వాత రెండోసారి ఉప ఎన్నిక జరుగుతుండటం విశేషం. జిల్లాలో మరెక్కడా రెండుసార్లు ఉప ఎన్నిక జరిగిన దాఖలాల్లేవు.
1958లో తొలిసారి : 1952లో ఆత్మకూరు నియోజకవర్గం ఏర్పడింది. 1955లో మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన బెజవాడ గోపాలరెడ్డి.. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి 1958 వరకు మంత్రిగా కొనసాగారు. 1958లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో ఆనం సంజీవరెడ్డి కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ప్రత్యర్థి జి.సి.కొండయ్యపై 45 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనంపై జగన్ బాదుడు!
[ 11-05-2024]
ప్రతిపక్ష హోదాలో ఊరూరా తిరుగుతూ.. ధరలు, పన్నులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే వాటిని రెట్టింపు చేశారు. -
పేదల జాగాల్లో భూచోళ్లు
[ 11-05-2024]
వెంకటాచలం మండలం చౌటపాళెం పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 1062, 1063లో యర్రగుంట వద్ద వేసిన లేఅవుట్లో తొలుత యర్రగుంట, చౌటపాళెం గ్రామాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో భయం భయం!
[ 11-05-2024]
జిల్లాలో కీలక సేవలందించే ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం, తదితర భవనాల నిర్వహణను యంత్రాంగం పూర్తిగా గాలికొదిలేసింది. -
గుంతలు.. గంతలు
[ 11-05-2024]
రహదారులు అభివృద్ధి చేశామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. అయిదేళ్లలో చాలావరకు కనీసం మరమ్మతులు చేపట్టలేదు. కొన్నింటికి తట్టమట్టి పోసిన దాఖలాలు లేవు. -
రంగు మార్తాండ.. ప్రచార యావ
[ 11-05-2024]
గ్రామాల్లో సక్రమంగా మురుగు కాలువలు లేవు. వాటిని శుభ్రం చేయించడానికి సొమ్ములు లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. -
ఇచ్చేది గోరంత... వసూలు కొండంత
[ 11-05-2024]
‘అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని జగన్ చెప్పిన మాటలను నమ్మినందుకు నట్టేట ముంచారు. నవరత్నాలు కాదు.. -
ముస్లిం రిజర్వేషన్లు ఆపాలని యత్నించారు: ఆనం
[ 11-05-2024]
ముస్లిం రిజర్వేషన్లు ఆపాలంటూ కోర్టుకెళ్లిన ఆర్.కృష్ణయ్యని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎం.పి.గా చేశారని ఆత్మకూరు తెదేపా అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. -
మూడు రోజుల్లో సర్వేపల్లికి కాకాణి నుంచి విముక్తి
[ 11-05-2024]
మరో మూడు రోజుల్లో మంత్రి కాకాణి అరాచక పాలన నుంచి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు విముక్తి పొందనున్నారని తెదేపా అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 11-05-2024]
తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని తెదేపా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. -
12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు
[ 11-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు కార్డుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. -
రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్
[ 11-05-2024]
ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కేంద్రాలు మూసివేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి నాగమల్లేశ్వరి ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?