గోరంత ఇచ్చి.. కొండంత బాదుడు
జగన్ ముఖ్యమంత్రి పీటమెక్కితే రూ. పది వేల ఆర్థిక సాయం చేస్తారని ఆశపడి ఓట్లేసిన ఆటో డ్రైవర్లు ప్రస్తుతం అల్లాడిపోతున్నారు.
గతుకుల రోడ్లతో ఆటో‘పాట్లు’
ట్యాక్స్లు, జరిమానాలతో డ్రైవర్ల కుదేలు
జగన్ ముఖ్యమంత్రి పీటమెక్కితే రూ. పది వేల ఆర్థిక సాయం చేస్తారని ఆశపడి ఓట్లేసిన ఆటో డ్రైవర్లు ప్రస్తుతం అల్లాడిపోతున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఆటో డ్రైవరుకూ రూ. పదివేలు ఇస్తామని.. వాటితో బీమా, రోడ్డు పన్ను కట్టుకోవచ్చని చెప్పిన మాటలు బాగానే ఉన్నా.. మరోవైపు పన్నులు, అపరాధ రుసుములు, ఇన్సూరెన్సుల రూపంలో లాగేస్తారన్న విషయం అప్పుడు వారికి తెలియలేదు.
ఈనాడు, నెల్లూరు
ఓ చేత్తో ఇస్తూ.. మరో చేత్తో పిండేస్తారని ఊహించలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే డీజిల్, పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని పదేపదే జగన్ చెబుతుంటే.. అధికారంలోకి వస్తే వాటిని తగ్గిస్తారని ఆశపడిన వారికి నిరాశే మిగిలింది. సీఎం అయ్యాక పన్నులు పెంచడమే కాదు.. అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే ఆటోడ్రైవర్లకు చుక్కలు చూపడం మొదలైంది. వాహనమిత్ర పథకాన్ని ప్రకటించిన తర్వాత.. ఆటో రోడ్డెక్కితే చాలు.. ఎడాపెడా కేసులతో బడుగుజీవుల ఆదాయానికి కత్తెర వేయడం ప్రారంభమైంది.
రోడ్డెక్కితే అంతే..
జగన్ పాలనలో పెనాల్టీల బాదుడూ ఎక్కువే. బీమా లేకపోతే రూ.అయిదు వేలు, కోటు వేసుకోకపోతే రూ. 235 చొప్పున వసూలు చేస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.అయిదువేలు జరిమానా విధిస్తున్నారు. వాహనమిత్ర కింద ఏడాదికి ఇచ్చే రూ. పదివేలతో పోల్చితే.. నెలకు నమోదయ్యే కేసులు, జరిమానాల చెల్లింపునకే ఎక్కువ అవుతోంది. ఒక్కో ఆటోకు రూ. 3వేలకుపైగా జరిమానాలు విధిస్తున్న సందర్భాలు ఉన్నాయి.వారం పాటు ఆటో తోలినా.. ఇంత రాదని డ్రైవర్లు వాపోతున్నారు.
నిర్వహణ ఖర్చు మూడింతలు
నెల్లూరు : రహదారి గోతుల్లో ముందుకుసాగుతున్న ఆటోలు
వాహనమిత్ర లబ్ధిదారుల్లో అత్యధికులు ఆటో డ్రైవర్లే ఉంటున్నారు. ఆయా వాహనాల బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇతర అవసరాలకు సాయం అందిస్తూ.. వారికి అండగా నిలుస్తున్నామని వైకాపా నాయకులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా... జిల్లాలో అధ్వానంగా ఉన్న రహదారుల కారణంగా ఆటోలు గుల్లవుతున్నాయి. గోతుల్లో పడి వెనుక చక్రాల బేరింగ్లు తరచూ దెబ్బతింటున్నాయి. మూడేళ్లపాటు మన్నికగా ఉండాల్సిన క్లచ్ ప్లేట్లు ఏడాదికే పాడవుతున్నాయి. టైర్ల మన్నిక తగ్గిపోయి.. పంక్చర్లు నిత్యకృత్యమవుతున్నాయి. వాహన మైలేజీ తగ్గడంతో పాటు ఇంధన ఖర్చు పెరుగుతోంది. సాధారణంగా ఆటోలకు నెలకు రూ.వెయ్యికి మించి నిర్వహణ ఖర్చులు ఉండవని, గుంతల రోడ్ల కారణంగా నెలకు రూ. 3వేల నుంచి రూ. నాలుగు వేల వరకు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. కొత్త రోడ్లు వేసే సంగతేమోగానీ, తొలుత గోతులైనా పూడ్చాలని డ్రైవర్లు వేడుకుంటున్నారు. ఈ సమస్యపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు పదేపదే చెప్పినా ప్రయోజనం ఉండటం లేదని మండిపడుతున్నారు.
ఖర్చులు రెట్టింపు అయ్యాయి
వాహనమిత్ర ద్వారా రూ. పదివేలు ఇస్తున్నారు సరే.. అంతకు మించి ఖర్చులు పెరిగాయి. ఒక్క వాహన బీమానే రూ. 12వేలు అవుతోంది. ప్రయాణికులను ఎక్కించుకుంటేనే మాకు రోజు గడిచేది. అందుకు రోడ్డుపై ఎక్కడైనా ఆపితే.. వెంటనే ఫొటో తీస్తున్నారు. ఆటోలో ఉన్న వారిని దింపేందుకు ఆపితే.. వెంటనే ఆటో వెనుక కొడుతున్నారు. వాహనమిత్ర ఇవ్వకపోయినా పర్వాలేదు.. పెరుగుతున్న ఖర్చులు తగ్గిస్తే చాలు.
నర్సయ్య, ఆటోడ్రైవరు
కరెంటు బిల్లు వస్తోందని.. ఇవ్వడం లేదు
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు డబ్బు ఇస్తోందని ఆశతో దరఖాస్తు చేసుకున్నా. 300 యూనిట్ల కరెంట్ బిల్లు వస్తోందని ఆపేశారు. నాకే కాదు.. మా స్టాండ్లో 50 మంది ఉంటే.. అయిదారుగురికే వస్తోంది. వారు కూడా అంత సంతోషంగా ఏం లేరు. విపరీతంగా చలానాలు విధిస్తున్నారు. ఆటోను పోలీసులు ఎప్పుడు ఆపుతారో తెలియదు. ఆ రోజు కట్టే డబ్బులు.. ఆ వారమంతా సంపాదించే దానికంటే ఎక్కువగా ఉంటోంది.
తిరుపతయ్య, ఆటోడ్రైవరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20వేల మెజారిటీతో కావ్యకృష్ణారెడ్డి గెలుపు ఖాయం
[ 16-05-2024]
ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 20 వేల మెజారిటీతో గెలుస్తారని పట్టణంలోని 23వ వార్డుకు చెందిన నాయకులు ధీమా వ్యక్తం చేశారు. -
ఓటోత్సాహం
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోల్చితే.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. ఓటరులో చైతన్యం వెల్లివిరిసింది. ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు.. ఉపాధి కోసం వలస వెళ్లినవారూ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. -
సైబర్ వల.. సామాన్యులు విలవిల
[ 16-05-2024]
నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి వాట్సాప్ నంబరుకు లింక్ వచ్చింది. క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు జత చేయకుంటే సేవలు నిలిపివేస్తామన్నది సారాంశం. కంగారుపడిన ఆయన డెబిట్కార్డు నంబరు, ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో రూ. 80వేలు లాగేశారు. -
పోలింగ్పై.. వనితల ముద్ర
[ 16-05-2024]
‘జిల్లాలో పురుషులు 9,51,065 ఉండగా- ఇందులో 7,63,894 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీన్ని బట్టి సుమారు 20,325 మంది మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. -
క్రీడా పండగొచ్చింది
[ 16-05-2024]
వేసవి వచ్చింది.. పిల్లలకు ఎంతో ఇష్టమైన క్రీడా శిబిరాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి జూన్ 15 వరకు వీటిని నిర్వహించనున్నారు. నగరంలోని ఏసీ మైదానంలో అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని మైదానాలను వేసవి శిక్షణ శిబిరాలకు ఉపయోగించుకోనున్నారు. -
నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు
[ 16-05-2024]
జిల్లావ్యాప్తంగా ఎండలు పెరిగినా, నీటి ఎద్దడిపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా ఇన్ఛార్జి ఎస్ఈ మర్దనాలి తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలను బుధవారం వివరించారు. -
ఉపాధికి ఊతం.. ఐటీఐ
[ 16-05-2024]
పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యాలు తప్పనిసరి. అవి సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థులను పలు సంస్థలు కళాశాలల్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి తీసుకుంటున్నాయి. -
రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే
[ 16-05-2024]
‘రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే.. కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని అన్ని సర్వేలు తేల్చాయి.. రెండు రోజులుగా వైకాపా నేతల స్వరంలో మార్పు కనిపిస్తోంది’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. -
మూగజీవాల వేదన
[ 16-05-2024]
వైకాపా పాలనలో మూగజీవాల ఆలనాపాలన ప్రమాదంలో పడింది. తెదేపా ప్రభుత్వ పాలనలో పశువులకు అందించే వివిధ రకాల పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త పథకాలు తెచ్చిందా... అంటే అదీ లేదు. -
ఓటెత్తిన చైతన్యం.. ఎవరికో అనుకూలం
[ 16-05-2024]
నియోజకవర్గంలో ఈసారి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందోనని అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెండున్నర శాతం పెరిగింది. -
పట్టణ ప్రజలపై పన్నుపోటు
[ 16-05-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక నూతనంగా తీసుకొచ్చిన ఆస్తికి మార్కెట్ విలువ ఆధారిత పన్ను విధానం ప్రజల నెత్తిన గుదిబండలా మారింది. మార్కెట్ విలువలో నిర్దేశిత శాతం చేరుకునేంత వరకు ఏటా 15 శాతం పన్ను పెంచుతుండటంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -
జేఎస్ రెడ్డి సేవలు నిరుపమానం
[ 16-05-2024]
తెలుగు విజ్ఞాన సమితి పూర్వ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జేఎస్ రెడ్డికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం బెంగళూరులో నివాళి అర్పించారు. -
కరేడులో యువకుల ఘర్షణ
[ 16-05-2024]
కరేడులోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రెండు సామాజిక వర్గాల యువకులు గొడవపడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!