అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్ అరెస్టు
అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు.
ఖాతాదారుల సొమ్ము రూ.44 లక్షలు స్వాహా
మేనేజర్ పెంచల్రెడ్డి
అమడగూరు, న్యూస్టుడే : అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు వివరాలు.. నెల్లూరు నగరంలో గౌడ్ హాస్టల్ సమీపంలో నివాసం ఉంటున్న కమతం పెంచల్రెడ్డి 2021-22 సంవత్సరంలో అమడగూరు గ్రామీణ బ్యాంకు మేనేజర్గా పని చేశారు. ఆ సమయంలో పథకం ప్రకారం తనకు అనుకూలమైన ఖాతాదారులను ఎంపిక చేసుకుని వారికి రుణాలు మంజూరు చేశారు. రుణాలు మంజూరు చేశాక.. తన సొంత అవసరాలకు అక్రమ పద్ధతుల్లో రూ.44,10,000ను ఖాతాదారుల నుంచి వాడుకున్నాడు. ఈ బాగోతం బహిర్గతం అయిన తరువాత ఆయన్ను బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పట్లో మేనేజర్ మాయమాటలకు మోసపోయిన ఖాతాదారులు వివిధ దశల్లో బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఆయన స్థానంలో వచ్చిన మేనేజర్ పెంచల్రెడ్డి చేసిన అక్రమంపై 2022లో అమడగూరు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఇక్కడి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ఆయన గురించి సమాచారం చేరవేశారు. ఈ నేపథ్యంలో కౌలాలంపూర్ నుంచి ఇండియాకు తిరిగొస్తున్న పెంచల్రెడ్డిని శనివారం రాత్రి చెన్నై ఎయిర్పోర్ట్ అధికారుల సహాయంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను ఆదివారం ఉదయం కదిరిలో న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరచగా.. 13 రోజులు రిమాండ్ విధిస్తూ.. ఆదేశించారు దర్యాప్తులో భాగంగా నిందితుడిని కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదండి.. ఓటెత్తుదాం!
[ 13-05-2024]
ఎన్నికల ఘట్టం.. తుది అంకానికి చేరుకుంది. ఓటర్లు.. రానున్న అయిదేళ్లకు ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. -
సిబ్బందికి.. భోజన కష్టాలు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమని పదేపదే చెబుతున్న జిల్లా యంత్రాంగం.. ఈ బృహత్తర క్రతువులో కీలకంగా వ్యవహరించే పోలింగ్ సిబ్బందికి సక్రమంగా భోజన ఏర్పాట్లు చేయలేదు. -
చివరి రోజు.. ప్రలోభాల వల
[ 13-05-2024]
పోలింగ్కు ముందు రోజు.. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రలోభాలపర్వం సాగింది. తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. -
ఓటేయకుంటే.. ఓడిపోతాం!
[ 13-05-2024]
‘నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏదీ ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే.. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతో పోరాడి రాజులవుతారో? అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే’ -
అంతటా పటిష్ఠ ఏర్పాట్లు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. -
నాడు-నేడు చతికిల ‘బడి’
[ 13-05-2024]
నాడు- నేడు మనబడి పథకం ద్వారా పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. -
వంతెనలు లేక.. చింత
[ 13-05-2024]
చెర్లోవంగల్లుకు చెందిన షేక్ సర్దార్ 2021 నవంబరులో తన ఇంటి సమీపంలో కలుజువాగును తల్లిదండ్రులతో కలసి దాటే క్రమంలో ఉద్ధృతికి కొట్టుకుపోయారు. -
‘నిషా’దాంతం
[ 13-05-2024]
మద్యానికి బానిసైన యువకుడు నిత్యం తల్లితో గొడవకు దిగేవాడు. ఏ పనికి వెళ్లేవాడు కాదు. ఈ క్రమంలోనే మద్యానికి నగదు ఇవ్వలేదని ఆమెపై కత్తితో దాడి చేశాడు. -
ప్రయాణం.. ప్రయాస
[ 13-05-2024]
ఎన్నికల్లో సొంతూరులో ఓటు వేయడానికి వస్తున్న వారికి ఆర్టీసీ చుక్కల చూపించింది. సరిపడా బస్సులు నడపకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వలస ఓటర్ల కష్టాలు
[ 13-05-2024]
ఎన్నికల్లో ఓటు వేయడానికి వలసవాసులు స్వగ్రామాలకు చేరుకున్నారు. పోటీలో నిలిచిన ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థులు వలస ఓటర్లను గుర్తించి ఓటు వేయించుకోవడానికి స్వగ్రామాలకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. -
సుభాషిణి కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్గ్రేషియో ఇవ్వాలి
[ 13-05-2024]
ఎన్నికల విధులకు వెళుతూ రైలుప్రమాదంలో మరణించిన అంగన్వాడీ కార్యకర్త బట్టా సుభాషిణితోపాటు తనయుడు విజయకుమార్ కుటుంబానికి రూ.50 లక్షల వంతున
తాజా వార్తలు (Latest News)
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!