logo

భారాస పేదల పార్టీ

భారాస ఎప్పటికీ పేదలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 28 Apr 2024 05:47 IST

పార్టీ జెండా ఆవిష్కరించి నినాదాలు చేస్తున్న భారాస జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా,
ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, నాయకులు

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: భారాస ఎప్పటికీ పేదలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి పేదల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఆసరా పింఛన్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చిందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజలను విస్మరిస్తోందన్నారు. నిజామాబాద్‌ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో రైతుబంధు, రుణమాఫీ లేదని పేర్కొన్నారు. జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మేయర్‌ నీతూ కిరణ్‌, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్‌, నాయకులు లక్ష్మారెడ్డి, మురళి, ధర్మపురి, రాజు, సుజిత్‌, సత్యప్రకాష్‌, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని