‘పదేళ్లలో అభివృద్ధి శూన్యం’
పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, ఆర్ఎస్ఎస్, ఎన్డీయే కూటమిని ఓడించాలని తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం (టీడీఎస్ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్రెడ్డి అన్నారు.
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టీడీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్రెడ్డి
నిజామాబాద్ అర్బన్, న్యూస్టుడే: పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, ఆర్ఎస్ఎస్, ఎన్డీయే కూటమిని ఓడించాలని తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం (టీడీఎస్ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రం ప్రగతినగర్ మున్నూరుకాపు కల్యాణ మండపంలో శనివారం బహిరంగ సభ నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ పదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. భారత జాతీయవాదుల ఉద్యమం జాతీయ కన్వీనర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ గాలిలో కలిసిపోయిందన్నారు. కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ఠ స్థాయికి చేరాయని, భాజపాను ఓడించి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు, యువత, కార్మికులు, రైతులపై ఉందని పేర్కొన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్(ప్రజాపంథా) నాయకుడు చంద్రశేఖర్, న్యూడెమోక్రసీ నేత జేవీ.చలపతిరావు, ఆల్ ఇండియా ఫ్రీడం ఫైటర్స్ వెల్ఫేర్ జాతీయ అధ్యక్షుడు సర్దార్ భక్తావర్ సింగ్, టీడీఎస్ఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త గోవర్ధన్, జిల్లా నాయకులు వనమాల కృష్ణ, పాపయ్య, శ్రీనివాస్, సాయిబాబా, ప్రభాకర్, నరేందర్, దాస్, సుధాకర్, శివకుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
[ 11-05-2024]
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, భారాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
సాయంత్రానికి మైకులు బంద్
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పార్టీలకు కీలక ఘట్టమైన ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. మార్చి 16న షెడ్యూల్.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడగా.. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి 29 మంది బరిలో దిగారు. -
అర్హులందరికీ రేషన్కార్డులు ఇప్పిస్తా
[ 11-05-2024]
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘భాజపా సర్కారు రైతుల్ని మోసగించింది’
[ 11-05-2024]
కేంద్రంలోని భాజపా సర్కారు రైతులను మోసగించిందని, ప్రజలకు ఆదాయం పెంచుతామని చెప్పి అన్ని రకాల ధరల్ని రెట్టింపు చేసిందని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. డి -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగియనుంది. మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
‘కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు’
[ 11-05-2024]
కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి ఓ వర్గానికి కల్పిస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బాన్సువాడలో శుక్రవారం జహీరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి, ఎంపీ బీబీపాటిల్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. -
కార్నర్ సమావేశంగా మార్పు
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ సమావేశ స్థలాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం తలపెట్టిన కాంగ్రెస్ జనజాతర సభను కార్నర్ సమావేశంగా మార్చినట్లు పేర్కొన్నారు. -
‘ఆశీర్వదిస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా’
[ 11-05-2024]
ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భారాస జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి ఝరాసంగంలో పాత బస్టాండు కూడలి వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
ఏడాదిన్నర తర్వాత హత్య కేసు ఛేదన
[ 11-05-2024]
ఏడాదిన్నర కిందట మూసేసిన కేసును సాంకేతికతను వినియోగించి పోలీసులు ఛేదించారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో డీఎస్పీ నాగేశ్వర్రావుతో కలిసి శిక్షణ ఐపీఎస్ కాజోల్ సింగ్ వివరాలు వెల్లడించారు. -
బిడ్డా.. ఓటు మరవొద్దు!
[ 11-05-2024]
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. రాజ్యాంగం మనకు వజ్రాయుధం వంటి ఓటుహక్కును కల్పించింది. దానిని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. ప్రతి ఓటు గెలుపోటములను నిర్దేశిస్తుంది. -
తప్పులకు తావు లేదిక
[ 11-05-2024]
ఉపాధ్యాయుల హాజరుకు మొన్నటి వరకు బయోమెట్రిక్ విధానం అమలులో ఉండేది. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు విధానం అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సందేశం.. ఆచరణీయం
[ 11-05-2024]
ఎన్నికల్లో ప్రలోభాలు ఎక్కువగా ఉంటాయనే అపవాదు ఉంది. దానిని తొలగించడానికి వివిధ రూపాల్లో ఎవరో ఒకరు స్పందిస్తుంటారు. తాజాగా లోక్సభ ఎన్నికల్లో అలాంటి అవగాహన పెంచే సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
హోటల్ వ్యాపారం మాటున డ్రగ్స్ దందా
[ 11-05-2024]
ప్రేమలో విఫలమైన ఒక చెఫ్ డ్రగ్స్కు అలవాటుపడి.. దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కారు. కేసు వివరాలను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్