ఎల్లలు దాటిన నాట్యాభినయం
భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు.
ప్రపంచ వేదికల్లో ఇందూరు కళాకారుల ప్రతిభ
నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం
భారతీయ సంస్కృతిలో నృత్యానికి విశేష ఆదరణ ఉంది. దానిపై ఇందూరు కళాకారులు మక్కువ పెంచుకుని అంతర్జాతీయ వేదికల్లో నాట్యాభినయం చేస్తూ మురిపిస్తున్నారు. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ, తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెస్తూ అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ‘న్యూస్టుడే’ కథనం.
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం
జిల్లా కేంద్రంలోని జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో శాస్త్రీయ నృత్యంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 2016లో పేరిణి శాస్త్రీయ నృత్యంపై సర్టిఫికెట్ కోర్సు ప్రారంభమైంది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చిన ప్రముఖ నాట్య కళాకారిణి జయప్రద పేరిణి అధ్యాపకురాలిగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 110 మంది విద్యార్థులు నృత్య పాఠాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 90 మంది ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు.
కూచిపూడిలో సాయిరవళి
జిల్లా కేంద్రానికి చెందిన బి.సాయిరవళి ఉన్నత విద్యలో ఎమ్మెస్సీ పూర్తి చేసి గణితంలో బంగారు పతకం అందుకున్నారు. జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయుల్లో కూచిపూడిలో ప్రతిభ చాటారు. హైదరాబాద్లోని గోదాదేవి నాట్య సమ్మోహనం వేదికపై ప్రతిభ చాటి ఉత్తమ నాట్యకళాకారిణిగా సత్కారం అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడి డిప్లొమా, భరతనాట్యంలో ధ్రువీకరణ కోర్సు పూర్తి చేశారు. అందెల రవళి పేరిట నాట్యాలయాన్ని స్థాపించి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్తో పాటు ముంబయి, దిల్లీ, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, బెంగళూరు, అండమాన్ నికోబార్తో పాటు మారిషస్, శ్రీలంక, బ్యాంకాక్, మలేషియాలోని అంతర్జాతీయ వేదికల్లో నృత్యాభినయంతో ఆకట్టుకున్నారు.
సాఫ్ట్వేర్ కొలువు వదిలి..
జిల్లా కేంద్రానికి చెందిన దేవులపల్లి చందన ఎంసీఏ పూర్తి చేసి విప్రోలో సాఫ్ట్వేర్ కొలువు సాధించింది. నాట్యంపై మక్కువతో ఉద్యోగం వదిలి ఇదే రంగంలో రాణిస్తున్నారు. జానపదం, కూచిపూడి, భరతనాట్యంలో వైవిధ్యతను ప్రదర్శించారు. కూచిపూడి, ఆంధ్రనాట్యంలో డిప్లొమా, భరతనాట్యంలో సర్టిఫికెట్ కోర్సు, కర్ణాటక గాత్రంలో డిప్లొమా చేశారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, హైదరాబాద్, విజయవాడ (కూచిపూడి కళాక్షేత్రం) గుంటూరు, తిరుపతి(నాద నీరాజనం), ముంబయి, అండమాన్నికోబార్, హరియాణా వంటి ప్రాంతాల్లోని వేదికలపై నృత్యం చేసి శెభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఏర్పాటు చేసిన జానపద మహాబృంద నాట్యంలో తన శిష్య బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారి వేదికపై శాస్త్రీయ నృత్యంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు. సిలికానాంధ్ర వారి కూచిపూడి మహా నాట్య సమ్మేళనంలో నాట్యం చేసి మూడు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను అందుకున్నారు.
ఉత్తమ అభిజ్ఞ
బోధన్ పట్టణానికి చెందిన భారతుల ఉత్తమ అభిజ్ఞ నాట్యంలో దిట్ట. విద్యార్థి దశ నుంచే అభినయంలో ప్రతిభ కనబరుస్తూ ఏకంగా 19 పురస్కారాలు అందుకొన్నారు. అందులో రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైన నృత్యాల్లో భాగస్వామ్యం ఉండటం విశేషం. అభిజ్ఞ ఐదేళ్ల వయసులోనే గిన్నిస్ రికార్డు ధ్రువపత్రం అందుకుంది. మొత్తం రెండు గిన్నిస్ రికార్డులు, మార్వలెస్ బుక్, ఇండియా, హైరేంజ్, ఫెంటాస్టిక్ తెలుగు, నోబుల్, ఏషియన్ వరల్డ్, ఛాంపియన్స్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. కీర్తి కిరణం, శ్రీతాళ్లపాక అన్నమాచార్య నృత్య పురస్కారంతోపాటు ప్రపంచ తెలుగు మహాసభలు, ఇస్కాన్ వంటి సంస్థల వేదికలపైనా నృత్య ప్రదర్శనలతో అనేక ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
న్యూస్టుడే, బోధన్ పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులు... విజ్ఞాన దీపికలు
[ 15-05-2024]
గిరిరాజ్ కళాశాల విద్యార్థులు పరిశోధనల్లో రాణిస్తున్నారు. ఇందూరు సాహిత్యం, చారిత్రక, పర్యాటక, ప్రజా సంక్షేమం విషయాల సేకరణ, క్షేత్ర పర్యటనలు వంటి అంశాల్లో రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. -
చివరి ఆయకట్టుకు నీరందించండి
[ 15-05-2024]
జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో రామడుగు ఒకటి. ఈ ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, భీంగల్, వేల్పూర్ మండలాల్లోని గ్రామాలకు రెండు పంటల నీరందిస్తున్నారు. -
ఈ గ్రామాలు ఆదర్శం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నికల కమిషన్ ఎన్ని స్వీప్ కార్యక్రమాలు నిర్వహించినా కొన్ని గ్రామాల్లో సరాసరిగా 75 శాతం కంటే అధికంగా పోలింగ్ నమోదు కాలేదు -
ఆలోచన అదిరే!
[ 15-05-2024]
ఎండలు మండుతున్న తరుణంలో ద్విచక్రవాహనాలపై ప్రయాణమంటే భయపడాల్సిన పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాడు పెద్దకొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన యువకుడు బోగేష్. ఈయన హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తాడు. -
పైకి గాంభీర్యం.. లోలోన లెక్కలు
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ ముగిసి ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండగా.. గెలుపుపై ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకొంటున్నారు. -
ప్రవేశాల పెంపునకు కసరత్తు
[ 15-05-2024]
గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్ని కళాశాలలుగా ఆప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదని అధ్యాపకులు పేర్కొంటున్నారు. -
నేడు విచారణ
[ 15-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్సింగ్ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
ఆలస్యంగా కొనుగోళ్లు
[ 15-05-2024]
తల్లి బిడ్డలను కంటికి రెప్పలాగా ఎలా దాచుకుంటుందో.. అన్నదాతలు సైతం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కాపాడుకొని నానా అవస్థలు పడి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే లారీలు రాక వర్షానికి తడిసి ఎండిపోతుంటే పట్టించుకునే నాథుడే కరవయ్యారు. -
పెరిగిన ఓటింగ్తో ఉత్కంఠ
[ 15-05-2024]
హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరం ముగిసింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69.67 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 74.63 నమోదైంది. సుమారు ఐదుశాతం మేర పోలింగ్ పెరిగింది -
ఆమె కదిలింది
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ పోలింగ్ మాదిరిగానే ఓటర్లు పోటెత్తారు. నవంబరులో శాసనసభకు నిర్వహించిన ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు స్థానాల్లో 12,39,568 ఓట్లు పోలయ్యాయి -
‘1.30 లక్షల మెజారిటీతో గెలుస్తాం’
[ 15-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. -
ఉద్యోగిపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు
[ 15-05-2024]
విద్యుత్తు శాఖలో పనిచేసే ఉద్యోగి ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారనే విషయం ఆ శాఖలో గుప్పుమంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణాలో వైకాపా ఆనవాళ్లు మిగలవు: ఎంపీ బాలశౌరి
-
ఎవరి లెక్కలు వారివే.. భారీ ఆధిక్యంపై కాంగ్రెస్ ధీమా