logo

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని ఎదల్కన్ చెరువు వద్ద 161వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

Published : 29 Apr 2024 17:39 IST

పెద్దకొడపల్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని ఎదల్కన్ చెరువు వద్ద 161వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎన్ఎస్ఎస్ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్‌కుందా మండలం చిన్న దేవాడకు చెందిన కుర్మ అంజవ్వ (40) తన కుమారుడు యాదిగొండతో కలిసి సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైనా చిన్న దేవాడకు ఉదయం బయల్దేరారు. మండలంలోని ఆంజని గేటు దాటిన కొద్ది దూరంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ సంఘటనలో అంజవ్వ తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మరణించింది. కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు గత కొద్ది నెలల క్రితం బతుకు దెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. కుమారుడు పండ్లు అమ్ముకుంటూ, తల్లి అంజవ్వ అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని